రేపు బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన పోరుకి తెరలేవనుంది. రెండు ఏ మాత్రం సంబంధం లేని జానర్లు భారీ బడ్జెట్ తో రూపొంది అభిమానుల విపరీతమైన అంచనాల మధ్య థియేటర్లలో అడుగు పెడుతున్నాయి. అఖిల్ ఏజెంట్ ప్రమోషన్లు గత పదిరోజులుగా అగ్రెసివ్ గా జరుగుతున్నాయి. నలభై కోట్లకు దగ్గరగా వెళ్తేనే లాభాల్లోకి అడుగు పెట్టినట్టు అవుతుంది. బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఇదేమీ కష్టం కాదు. బాక్సాఫీస్ వద్ద రెండో వారంలోకి అడుగు పెట్టిన విరూపాక్ష తప్ప ఇంకేవి స్ట్రాంగ్ గా లేవు. టాక్ కనక బాగుంటే ఏజెంట్ కి వసూళ్ల వర్షం ఖాయమని ట్రేడ్ అంచనా వేస్తోంది.
తొలుత ఏజెంట్ ని ప్యాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ చేద్దామనుకున్నప్పటికీ ప్రస్తుతానికి తెలుగు మలయాళం వెర్షన్లకు మాత్రమే పరిమితమయ్యారు. మమ్ముట్టి ఉన్నా కేరళలో పోటీ వల్ల లిమిటెడ్ స్క్రీన్లు దక్కడంతో అవి పెరిగే విషయంలో టాక్ కీలక పాత్ర పోషించనుంది. పూర్తి తమిళ వాసనలతో మల్టీ స్టారర్ గా రూపొందిన పొన్నియిన్ సెల్వన్ 2కి దిల్ రాజు పుణ్యమాని చెప్పుకోదగ్గ స్థాయిలోనే థియేటర్లు దక్కాయి. అయితే అడ్వాన్స్ బుకింగ్స్ అంతో ఇంతో నగరాల్లో తప్ప మిగిలిన చోట్ల బాగా చాలా నీరసంగా ఉన్నాయి. ఏదో బాహుబలి రేంజ్ టాక్ వస్తే తప్ప జనం కదిలేలా లేరు.
చెప్పాలంటే ఇది తెలుగు గన్నుతో తమిళ కత్తి యుద్ధం చేస్తున్నట్టు ఉంది. అయితే ఏజెంట్ ఓవర్సీస్ ప్రింట్ల విషయంలో జరుగుతున్న జాప్యం ప్రీమియర్లను ఆలస్యం చేసే అవకాశముంది. నిర్మాత అనిల్ సుంకర ఏపీ తెలంగాణలో ఉదయం 7 గంటల నుంచే షోలు పడేలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడంతో ఆ మేరకు ఆన్ లైన్ టికెట్ల అమ్మకాలు మొదలైపోయాయి. దర్శకుడు సురేందర్ రెడ్డికి దీని సక్సెస్ చాలా కీలకం. ఎంత కష్టపడినా సైరా నరసింహారెడ్డికి ఆశించిన ఫలితం దక్కపోవడంతో ఎలాగైనా ఏజెంట్ తో బలమైన కంబ్యాక్ ఇవ్వాలని కసిమీదున్నాడు. విజేత ఎవరో రేపు తేలిపోతుంది.
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…