Adipurush
టీజర్లు, ట్రైలర్ల వల్ల కొన్ని సినిమాలకు బాగా కలిసొస్తుంటుంది. విడుదల ముంగిట సినిమాకు హైప్ పెరగడానికి అవి పనికొస్తుంటాయి. అదే సమయంలో టీజర్, ట్రైలర్ బాలేకుంటే సీన్ రివర్సవుతుంది. ఉన్న హైప్ కూడా పోతుంది. సినిమా రిజల్ట్ మీదే అది ప్రభావం చూపొచ్చు. ‘ఆదిపురుష్’ సినిమా విషయంలో రెండోదే జరిగేలా కనిపించింది. గత ఏడాది రిలీజైన ఆ సినిమా టీజర్ మీద జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు.
రామాయణానికి సంబంధించి మన ఊహల్లో ఉన్న దానికి భిన్నంగా ప్రధాన పాత్రలు కనిపించడం.. అలాగే చాలా కృత్రిమంగా అనిపించిన గ్రాఫిక్స్.. సినిమా మీద విపరీతమైన ట్రోలింగ్కు కారణం అయ్యాయి. టెక్నాలజీ ఈ సినిమాకు బలం కాకపోగా.. పెద్ద బలహీనతగా మారింది. చరిత్రలో ఇంత వరకు ఒక టీజర్ వల్ల ఏ సినిమాకూ జరగని డ్యామేజ్ ఈ చిత్రానికి జరిగింది. అది ఏ స్థాయిలో అంటే.. సినిమాను ఆరు నెలలు వాయిదా వేసుకుని మళ్లీ గ్రాఫిక్స్, ఇతర విషయాల మీద కరెక్షన్లకు కూర్చునేంత.
మొత్తానికి చెయ్యాల్సిన కరెక్షన్లేవో చేశారు. అనుకున్న ప్రకారమే జూన్ 16న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల కొన్ని పోస్టర్లు, అలాగే పాటలు రిలీజ్ చేసి ప్రమోషన్లు మొదలుపెట్టారు. కానీ వీటి మీద కంటే ట్రైలర్ మీదే అందరి దృష్టీ నిలిచి ఉంది. అదెలా ఉంటుందన్న దాన్ని బట్టి సినిమా మీద జనాలు ఒక అంచనాకు రాబోతున్నారు.
ప్రభాస్ అభిమానులతో సహా అందరూ టీజర్ లాగా కాకుండా ఈసారి పాజిటివ్ ఫీల్ ఇచ్చేలా ట్రైలర్ ఉండాలని కోరుకుంటున్నారు. ఓం రౌత్ అండ్ టీం విడుదలకు నెల రోజుల ముందే ట్రైలర్ లాంచ్ చేయాలని చూస్తోంది. ఇందుకోసం మంచి ముహూర్తం చూస్తున్నారు. మే 4 లేదా 17న ట్రైలర్ రిలీజ్ చేయాలని చూస్తున్నట్లు సమాచారం. ఆల్రెడీ ట్రైలర్ సిద్ధమైందట. దాని నిడివి 3 నిమిషాల 22 సెకన్లు అని తెలిసింది. ఈ ట్రైలర్ ఏ రోజు రిలీజైతే ఆ రోజు ‘ఆదిపురుష్’ ఫేట్ ఏంటి అన్నది తేలిపోతుంది అనడంలో సందేహం లేదు.
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…