Adipurush
టీజర్లు, ట్రైలర్ల వల్ల కొన్ని సినిమాలకు బాగా కలిసొస్తుంటుంది. విడుదల ముంగిట సినిమాకు హైప్ పెరగడానికి అవి పనికొస్తుంటాయి. అదే సమయంలో టీజర్, ట్రైలర్ బాలేకుంటే సీన్ రివర్సవుతుంది. ఉన్న హైప్ కూడా పోతుంది. సినిమా రిజల్ట్ మీదే అది ప్రభావం చూపొచ్చు. ‘ఆదిపురుష్’ సినిమా విషయంలో రెండోదే జరిగేలా కనిపించింది. గత ఏడాది రిలీజైన ఆ సినిమా టీజర్ మీద జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు.
రామాయణానికి సంబంధించి మన ఊహల్లో ఉన్న దానికి భిన్నంగా ప్రధాన పాత్రలు కనిపించడం.. అలాగే చాలా కృత్రిమంగా అనిపించిన గ్రాఫిక్స్.. సినిమా మీద విపరీతమైన ట్రోలింగ్కు కారణం అయ్యాయి. టెక్నాలజీ ఈ సినిమాకు బలం కాకపోగా.. పెద్ద బలహీనతగా మారింది. చరిత్రలో ఇంత వరకు ఒక టీజర్ వల్ల ఏ సినిమాకూ జరగని డ్యామేజ్ ఈ చిత్రానికి జరిగింది. అది ఏ స్థాయిలో అంటే.. సినిమాను ఆరు నెలలు వాయిదా వేసుకుని మళ్లీ గ్రాఫిక్స్, ఇతర విషయాల మీద కరెక్షన్లకు కూర్చునేంత.
మొత్తానికి చెయ్యాల్సిన కరెక్షన్లేవో చేశారు. అనుకున్న ప్రకారమే జూన్ 16న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల కొన్ని పోస్టర్లు, అలాగే పాటలు రిలీజ్ చేసి ప్రమోషన్లు మొదలుపెట్టారు. కానీ వీటి మీద కంటే ట్రైలర్ మీదే అందరి దృష్టీ నిలిచి ఉంది. అదెలా ఉంటుందన్న దాన్ని బట్టి సినిమా మీద జనాలు ఒక అంచనాకు రాబోతున్నారు.
ప్రభాస్ అభిమానులతో సహా అందరూ టీజర్ లాగా కాకుండా ఈసారి పాజిటివ్ ఫీల్ ఇచ్చేలా ట్రైలర్ ఉండాలని కోరుకుంటున్నారు. ఓం రౌత్ అండ్ టీం విడుదలకు నెల రోజుల ముందే ట్రైలర్ లాంచ్ చేయాలని చూస్తోంది. ఇందుకోసం మంచి ముహూర్తం చూస్తున్నారు. మే 4 లేదా 17న ట్రైలర్ రిలీజ్ చేయాలని చూస్తున్నట్లు సమాచారం. ఆల్రెడీ ట్రైలర్ సిద్ధమైందట. దాని నిడివి 3 నిమిషాల 22 సెకన్లు అని తెలిసింది. ఈ ట్రైలర్ ఏ రోజు రిలీజైతే ఆ రోజు ‘ఆదిపురుష్’ ఫేట్ ఏంటి అన్నది తేలిపోతుంది అనడంలో సందేహం లేదు.
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…
టాలీవుడ్లో బిగ్గెస్ట్ సినీ ఫ్యామిలీ ఏది అంటే.. మెగా కుటుంబం గురించే ముందుగా చెప్పుకోవాలి. ఆ కుటుంబంలో ఉన్నంత మంది…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మలయాళ పరిశ్రమను మినహాయిస్తే.. ప్రతి చోటా సినిమాల మేకింగ్ బాగా టైం తీసుకుంటోంది. కొంచెం స్టార్ ఇమేజ్…
టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…