Movie News

బాహుబలి కాంబినేషన్ పక్కా

బాహుబలి సినిమా రేపిన సంచలనం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇండియన్ సినిమాను బాహుబలికి ముందు బాహుబలికి తర్వాత అని విభజించి చూసేలా ఆ సినిమా అసాధారణ ఫలితం అందుకుంది, ప్రేక్షకుల మీద, అలాగే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ మీద అసామాన్యమైన ప్రభావం చూపింది. ఈ సినిమాలో భాగమైన అందరి పేర్లూ మార్మోగిపోయాయి. వాళ్లకు వచ్చిన పేరు ప్రఖ్యాతుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

‘బాహుబలి-2’ చూసినపుడే ‘బాహుబలి-3’ కూడా వస్తే ఎంత బాగుంటుందో అన్న చర్చ నడిచింది. కానీ సీక్వెల్ ఉండదు కానీ.. బాహుబలి ప్రపంచం మాత్రం కొనసాగుతుందని రాజమౌళితో పాటు నిర్మాతలు కూడా సంకేతాలు ఇచ్చారు. ఇప్పటిదాకా అయితే ఆ ప్రపంచం తిరిగి రాలేదు. కానీ ఇప్పుడు ఆ దిశగా సంకేతాలు వస్తున్నాయి. బాహుబలి నిర్మాతలతో ప్రభాస్ కొత్త చిత్రానికి సిద్ధమవుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుండటమే అందుకు కారణం.

‘బాహుబలి’తో ఒకేసారి పతాక స్థాయిని అందుకున్న ఆర్కా మీడియా అధినేతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని.. ఆ తర్వాత తమ స్థాయికి తగ్గ సినిమాలు తీయలేదు. ఉమామహేశ్వర ఉగ్రరూపస్య లాంటి చిన్న సినిమాతో సరిపెట్టారు. ఇంకేవో ప్రాజెక్టులు చేశారు. ఐతే ఇప్పుడు ఆ బేనర్లో సినిమా చేసేందుకు ప్రభాస్ డేట్లు ఇచ్చాడన్నది తాజా సమాచారం.

ఇటీవలే శోభు, ప్రసాద్‌లతో ప్రభాస్ సమావేశం అయ్యాడట. సినిమా కోసం ఒప్పందం కుర్చుకున్నాడట. ఐతే ఈ చిత్రాన్ని రాజమౌళే రూపొందిస్తాడు అనే గ్యారెంటీ అయితే లేదు. ప్రస్తుతం ఆయన ఫోకస్ మొత్తం మహేష్ బాబు సినిమా మీదే ఉంది. ఒక సినిమా చేస్తుండగా.. వేరే చిత్రం గురించి ఆలోచించడు జక్కన్న. బాహుబలి నిర్మాతలతో ప్రభాస్ సినిమా అంటే.. అది బాహుబలి తరహాలోనే ఉండాలని, రాజమౌళే దర్శకత్వం వహించాలని ప్రేక్షకులు కోెరుకుంటారు. మరి శోభు, ప్రసాద్ ఏం ఆలోచిస్తున్నారో చూడాలి.

This post was last modified on April 24, 2023 6:04 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్..ఆ పార్టీదే గెలుపన్న కేకే సర్వే

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోరు హోరాహోరీగా జరుగుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న కేజ్రీవాల్ జోరుకు బ్రేకులు వేయాలని బీజేపీ భావిస్తోంది.…

38 minutes ago

పులివెందుల ప్రజల కోసం జగన్ అసెంబ్లీకి రావాలి: లోకేశ్

వైసీపీ నేతలు, కార్యకర్తల వెంట్రుక కూడా పీకలేరు అంటూ మాజీ సీఎం జగన్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా…

39 minutes ago

పవన్ కు జ్వరం.. రేపు భేటీ డౌట్

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…

12 hours ago

విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు పెట్టండి: హైకోర్టు ఆర్డ‌ర్‌

వైసీపీ నాయ‌కురాలు, మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు న‌మోదు చేయాల‌ని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసుల‌ను ఆదేశించింది. ఆమెతోపాటు..…

12 hours ago

కాంగ్రెస్ పార్టీ మీ అయ్య జాగీరా?:తీన్మార్ మ‌ల్ల‌న్న‌

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయ‌కుడు తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు ఆ పార్టీ రాష్ట్ర క‌మిటీ నోటీసులు జారీ చేసింది.…

13 hours ago

మళ్లీ అవే డైలాగులు..తీరు మారని జగన్!

అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…

14 hours ago