బాహుబలి సినిమా రేపిన సంచలనం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇండియన్ సినిమాను బాహుబలికి ముందు బాహుబలికి తర్వాత అని విభజించి చూసేలా ఆ సినిమా అసాధారణ ఫలితం అందుకుంది, ప్రేక్షకుల మీద, అలాగే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ మీద అసామాన్యమైన ప్రభావం చూపింది. ఈ సినిమాలో భాగమైన అందరి పేర్లూ మార్మోగిపోయాయి. వాళ్లకు వచ్చిన పేరు ప్రఖ్యాతుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
‘బాహుబలి-2’ చూసినపుడే ‘బాహుబలి-3’ కూడా వస్తే ఎంత బాగుంటుందో అన్న చర్చ నడిచింది. కానీ సీక్వెల్ ఉండదు కానీ.. బాహుబలి ప్రపంచం మాత్రం కొనసాగుతుందని రాజమౌళితో పాటు నిర్మాతలు కూడా సంకేతాలు ఇచ్చారు. ఇప్పటిదాకా అయితే ఆ ప్రపంచం తిరిగి రాలేదు. కానీ ఇప్పుడు ఆ దిశగా సంకేతాలు వస్తున్నాయి. బాహుబలి నిర్మాతలతో ప్రభాస్ కొత్త చిత్రానికి సిద్ధమవుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుండటమే అందుకు కారణం.
‘బాహుబలి’తో ఒకేసారి పతాక స్థాయిని అందుకున్న ఆర్కా మీడియా అధినేతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని.. ఆ తర్వాత తమ స్థాయికి తగ్గ సినిమాలు తీయలేదు. ఉమామహేశ్వర ఉగ్రరూపస్య లాంటి చిన్న సినిమాతో సరిపెట్టారు. ఇంకేవో ప్రాజెక్టులు చేశారు. ఐతే ఇప్పుడు ఆ బేనర్లో సినిమా చేసేందుకు ప్రభాస్ డేట్లు ఇచ్చాడన్నది తాజా సమాచారం.
ఇటీవలే శోభు, ప్రసాద్లతో ప్రభాస్ సమావేశం అయ్యాడట. సినిమా కోసం ఒప్పందం కుర్చుకున్నాడట. ఐతే ఈ చిత్రాన్ని రాజమౌళే రూపొందిస్తాడు అనే గ్యారెంటీ అయితే లేదు. ప్రస్తుతం ఆయన ఫోకస్ మొత్తం మహేష్ బాబు సినిమా మీదే ఉంది. ఒక సినిమా చేస్తుండగా.. వేరే చిత్రం గురించి ఆలోచించడు జక్కన్న. బాహుబలి నిర్మాతలతో ప్రభాస్ సినిమా అంటే.. అది బాహుబలి తరహాలోనే ఉండాలని, రాజమౌళే దర్శకత్వం వహించాలని ప్రేక్షకులు కోెరుకుంటారు. మరి శోభు, ప్రసాద్ ఏం ఆలోచిస్తున్నారో చూడాలి.
This post was last modified on April 24, 2023 6:04 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…