బాహుబలి సినిమా రేపిన సంచలనం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇండియన్ సినిమాను బాహుబలికి ముందు బాహుబలికి తర్వాత అని విభజించి చూసేలా ఆ సినిమా అసాధారణ ఫలితం అందుకుంది, ప్రేక్షకుల మీద, అలాగే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ మీద అసామాన్యమైన ప్రభావం చూపింది. ఈ సినిమాలో భాగమైన అందరి పేర్లూ మార్మోగిపోయాయి. వాళ్లకు వచ్చిన పేరు ప్రఖ్యాతుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
‘బాహుబలి-2’ చూసినపుడే ‘బాహుబలి-3’ కూడా వస్తే ఎంత బాగుంటుందో అన్న చర్చ నడిచింది. కానీ సీక్వెల్ ఉండదు కానీ.. బాహుబలి ప్రపంచం మాత్రం కొనసాగుతుందని రాజమౌళితో పాటు నిర్మాతలు కూడా సంకేతాలు ఇచ్చారు. ఇప్పటిదాకా అయితే ఆ ప్రపంచం తిరిగి రాలేదు. కానీ ఇప్పుడు ఆ దిశగా సంకేతాలు వస్తున్నాయి. బాహుబలి నిర్మాతలతో ప్రభాస్ కొత్త చిత్రానికి సిద్ధమవుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుండటమే అందుకు కారణం.
‘బాహుబలి’తో ఒకేసారి పతాక స్థాయిని అందుకున్న ఆర్కా మీడియా అధినేతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని.. ఆ తర్వాత తమ స్థాయికి తగ్గ సినిమాలు తీయలేదు. ఉమామహేశ్వర ఉగ్రరూపస్య లాంటి చిన్న సినిమాతో సరిపెట్టారు. ఇంకేవో ప్రాజెక్టులు చేశారు. ఐతే ఇప్పుడు ఆ బేనర్లో సినిమా చేసేందుకు ప్రభాస్ డేట్లు ఇచ్చాడన్నది తాజా సమాచారం.
ఇటీవలే శోభు, ప్రసాద్లతో ప్రభాస్ సమావేశం అయ్యాడట. సినిమా కోసం ఒప్పందం కుర్చుకున్నాడట. ఐతే ఈ చిత్రాన్ని రాజమౌళే రూపొందిస్తాడు అనే గ్యారెంటీ అయితే లేదు. ప్రస్తుతం ఆయన ఫోకస్ మొత్తం మహేష్ బాబు సినిమా మీదే ఉంది. ఒక సినిమా చేస్తుండగా.. వేరే చిత్రం గురించి ఆలోచించడు జక్కన్న. బాహుబలి నిర్మాతలతో ప్రభాస్ సినిమా అంటే.. అది బాహుబలి తరహాలోనే ఉండాలని, రాజమౌళే దర్శకత్వం వహించాలని ప్రేక్షకులు కోెరుకుంటారు. మరి శోభు, ప్రసాద్ ఏం ఆలోచిస్తున్నారో చూడాలి.
This post was last modified on April 24, 2023 6:04 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…