ఇంకో మూడు నెలల్లో రాబోతున్న ఆగస్ట్ స్వతంత్ర దినోత్సవాన్ని టార్గెట్ చేసుకుని పలు సినిమాలు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. 11 తేదీకి చిరంజీవి భోళా శంకర్ ఆల్రెడీ అఫీషియల్ గా లాక్ అయ్యింది. దర్శకుడు మెహర్ రమేష్ గ్యాప్ లేకుండా మెగాస్టార్ సహకారంతో షూటింగ్ ని వేగంగా పూర్తి చేసేలా పక్కా ప్లానింగ్ తో ముందుకెళ్తున్నాడు. ఒక ఐటెం సాంగ్ పెడదామన్న ఆలోచనకు చిరు నుంచి ఇంకా అంగీకారం రాలేదని అది కూడా ఓకే అయితే అందులో ఎవరైనా బాలీవుడ్ బ్యూటీ లేదా శ్రేయలాంటి సీనియర్ హీరోయిన్ ని తీసుకోవాలన్న ప్లానింగ్ ఉందట.
ఇదిలా ఉండగా అదే డేట్ కి కర్చీఫ్ వేసుకున్న రజనీకాంత్ జైలర్ ఇప్పుడా బరి నుంచి తప్పుకుంది. ఇది ఖరారు చేసుకున్నాకే శివ కార్తికేయన్ మహావీరుడు అనౌన్స్ మెంట్ వచ్చేసింది. సూపర్ స్టార్ దీపావళి వైపు చూస్తున్నారని చెన్నై టాక్. మరోవైపు సందీప్ రెడ్డి వంగా రన్బీర్ కపూర్ ల అనిమల్ 11 రావడం ఖాయమే. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. వచ్చే నెల నుంచి భారీ ఎత్తున ప్రమోషన్లు మొదలుపెట్టబోతున్నారు . రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ వయొలెంట్ డ్రామాని అన్ని భాషల్లో ప్యాన్ ఇండియా రేంజ్ లో సిద్ధం చేస్తున్నారు.
ఇదంతా బాగానే ఉంది కానీ సిద్దు జొన్నలగడ్డ డీజే టిల్లు 2ని ఎట్టి పరిస్థితుల్లో ఆగస్ట్ 11 విడుదల చేయాలని నిర్మాత నాగవంశీ ఆల్రెడీ బిజినెస్ డీల్స్ కూడా చేస్తున్నారని ఇన్ సైడ్ టాక్. ఆ మేరకు డిస్ట్రిబ్యూటర్లతో ఒప్పందాలు థియేటర్లు బ్లాక్ చేయడం లాంటివి జరుగుతున్నాయని సమాచారం. ఇదే బ్యానర్ లో రాబోయే మహేష్ బాబు 28తో పాటు టిల్లుకున్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని బయ్యర్లు పెద్ద మొత్తాలే ఆఫర్ చేస్తున్నట్టు తెలిసింది. ఇవి కాకుండా సన్నీ డియోల్ గదర్ 2 కూడా బరిలో ఉంది. చూస్తుంటే ఇండిపెండెన్స్ డేకి భారీ క్లాష్ తప్పేలా లేదు.
టాలీవుడ్లో ప్రస్తుతం మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకడు. రాజమౌళి కాకుండా ఇండస్ట్రీలో ఫెయిల్యూర్ లేని దర్శకుడు…
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ మధ్య కాస్త స్క్రీన్ మీద తగ్గినట్టు కనిపించినా అవకాశాలకు ఏ లోటు లేదు.…
అసలు ఈ ఏడాది విడుదలవుతుందా లేదాని అనుమాన పడుతున్న టాక్సిక్ హఠాత్తుగా బాంబు వేసింది. ఆగస్ట్ 26 విడుదల చేయబోతున్నట్టు…
విజయవాడ కృష్ణలంక పోలీసు స్టేషన్ సీఐ నాగరాజుపై ప్రభుత్వం విచారణకు ఆదేశించి.. ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే..…
టాలీవుడ్ లో హీరోల సినిమాల వసూళ్ల మీద సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ జరగడం ఎప్పటినుంచో చూస్తున్నాం. అయితే ఇప్పుడు…
వచ్చే మూడేళ్లలో తానేంటో చూపిస్తానని.. వైసీపీని ఉద్దేశించి డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.…