ఇంకో మూడు నెలల్లో రాబోతున్న ఆగస్ట్ స్వతంత్ర దినోత్సవాన్ని టార్గెట్ చేసుకుని పలు సినిమాలు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. 11 తేదీకి చిరంజీవి భోళా శంకర్ ఆల్రెడీ అఫీషియల్ గా లాక్ అయ్యింది. దర్శకుడు మెహర్ రమేష్ గ్యాప్ లేకుండా మెగాస్టార్ సహకారంతో షూటింగ్ ని వేగంగా పూర్తి చేసేలా పక్కా ప్లానింగ్ తో ముందుకెళ్తున్నాడు. ఒక ఐటెం సాంగ్ పెడదామన్న ఆలోచనకు చిరు నుంచి ఇంకా అంగీకారం రాలేదని అది కూడా ఓకే అయితే అందులో ఎవరైనా బాలీవుడ్ బ్యూటీ లేదా శ్రేయలాంటి సీనియర్ హీరోయిన్ ని తీసుకోవాలన్న ప్లానింగ్ ఉందట.
ఇదిలా ఉండగా అదే డేట్ కి కర్చీఫ్ వేసుకున్న రజనీకాంత్ జైలర్ ఇప్పుడా బరి నుంచి తప్పుకుంది. ఇది ఖరారు చేసుకున్నాకే శివ కార్తికేయన్ మహావీరుడు అనౌన్స్ మెంట్ వచ్చేసింది. సూపర్ స్టార్ దీపావళి వైపు చూస్తున్నారని చెన్నై టాక్. మరోవైపు సందీప్ రెడ్డి వంగా రన్బీర్ కపూర్ ల అనిమల్ 11 రావడం ఖాయమే. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. వచ్చే నెల నుంచి భారీ ఎత్తున ప్రమోషన్లు మొదలుపెట్టబోతున్నారు . రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ వయొలెంట్ డ్రామాని అన్ని భాషల్లో ప్యాన్ ఇండియా రేంజ్ లో సిద్ధం చేస్తున్నారు.
ఇదంతా బాగానే ఉంది కానీ సిద్దు జొన్నలగడ్డ డీజే టిల్లు 2ని ఎట్టి పరిస్థితుల్లో ఆగస్ట్ 11 విడుదల చేయాలని నిర్మాత నాగవంశీ ఆల్రెడీ బిజినెస్ డీల్స్ కూడా చేస్తున్నారని ఇన్ సైడ్ టాక్. ఆ మేరకు డిస్ట్రిబ్యూటర్లతో ఒప్పందాలు థియేటర్లు బ్లాక్ చేయడం లాంటివి జరుగుతున్నాయని సమాచారం. ఇదే బ్యానర్ లో రాబోయే మహేష్ బాబు 28తో పాటు టిల్లుకున్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని బయ్యర్లు పెద్ద మొత్తాలే ఆఫర్ చేస్తున్నట్టు తెలిసింది. ఇవి కాకుండా సన్నీ డియోల్ గదర్ 2 కూడా బరిలో ఉంది. చూస్తుంటే ఇండిపెండెన్స్ డేకి భారీ క్లాష్ తప్పేలా లేదు.
This post was last modified on April 24, 2023 5:58 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…