గత కొన్నేళ్లలో తెలుగులో కొన్ని చిన్న సినిమాలు సంచలన విజయం సాధించాయి. మన దగ్గరా గొప్ప ప్రయోగాలు జరుగుతాయని.. బడ్జెట్ పరిమితుల గురించి పట్టించుకోకుండా కంటెంట్ను నమ్ముకుని అద్భుతమైన సినిమాలు అందించగలమని మన యువ దర్శకులు, రచయితలు చాటిచెప్పారు. ఈ కోవలో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ చిత్రాల్లో గత ఏడాది విడుదలైన ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఒకటి.
కొత్త దర్శకుడు స్వరూప్తో కలిసి సొంతంగా స్క్ర్రిప్టు పనిలో కూడా భాగస్వామ్యం పంచుకున్న యువ నటుడు నవీన్ పొలిశెట్టి ఈ చిత్రంతో తన సత్తా ఏంటో చూపించాడు. కథ లోకలే కానీ.. ఈ సినిమా రీచ్ మాత్రం అంతర్జాతీయ స్థాయిది. చూసిన ప్రతి తెలుగు ప్రేక్షకుడూ వావ్ అనుకుని కాలర్ ఎగరేసేలా తెరకెక్కిందీ చిత్రం. దీన్ని ఒక ఫ్రాంఛైజీలా చేయడానికి అవకాశముందని సినిమా చూసిన వాళ్లకు అర్థమైంది.
చిత్ర బృందం కూడా ఈ దిశగా ఇంతకుముందే సంకేతాలు ఇచ్చింది. ఇప్పుడు ‘ఏజెంట్’ నిర్మాత దీని సీక్వెల్స్ గురించి స్వయంగా ప్రకటించాడు. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’కు కనీసం మరో రెండు సీక్వెల్స్ తీస్తామని అతను వెల్లడించాడు. ముందు తొలి సీక్వెల్ కోసం సన్నాహాలు మొదలుపెడుతున్నామని.. త్వరలోనే ప్రకటన ఉంటుందని తెలిపాడు.
మన ఏజెంట్ ఛేదించడానికి మరి కొన్ని కేసులు సిద్ధమవుతున్నాయని అతనన్నాడు. మరోవైపు ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ను జపనీస్తో పాటు మరికొన్ని విదేశీ భాషల్లోకి అనువాదం చేయబోతుండటం విశేషం. బాలీవుడ్లోనూ ఈ చిత్రాన్ని రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మొత్తానికి కథలో బలం ఉండాలే కానీ.. బడ్జెట్, కాస్టింగ్, టెక్నీషియన్స్ ఏ స్థాయి అన్నది సంబంధం మంచి ఫలితాన్ని అందుకోవచ్చనడానికి ‘ఏజెంట్’ ఉదాహరణ అనడంలో సందేహం లేదు.
This post was last modified on August 3, 2020 5:34 pm
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…