అక్కినేని అఖిల్ హీరోగా అతని మార్కెట్ ను మించి ఖర్చు పెట్టి తీసిన భారీ సినిమా ‘ఏజెంట్’ ఈ నెల 28న థియేటర్స్ లోకి వస్తుంది. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ ఉన్నపలంగా ఫిక్స్ చేసుకోవడంతో హడావిడిగా ప్రమోషన్స్ చేస్తున్నాడు అఖిల్. ఎక్కువ టైమ్ లేకపోవడంతో పాన్ ఇండియా రిలీజ్ ను వాయిదా వేసుకొని కేవలం తెలుగులోనే రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో అఖిల్ పాల్గొన్న ప్రతీ సారి షూటింగ్ డిలే , ఓవర్ బడ్జెట్ అనే క్వశ్చన్స్ ఎదురవుతున్నాయి.
ఈ క్వశ్చన్స్ విన్న ప్రతీ సారి కొద్దిగా ఇరిటేట్ అవుతున్నాడు అఖిల్. వెళ్ళిన ప్రతీ చోట అఖిల్ కి షూటింగ్ ఆలస్యం అనే ప్రశ్న వింటుంటే ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది. తాజాగా కూడా ఆ ప్రశ్న కి ఇరిటేషన్ గా ఫీలయ్యాడు అఖిల్. డిలే అండొద్దు. ఈ మాత్రం షూటింగ్ డేస్ అవుతాయి. అయినా మేము ఘాట్ చేసింది కేవలం 105 రోజులే అంటూ ఏదో లెక్క చెప్పుకొచ్చాడు. నిజానికి ఈ సినిమా చాలా కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. అవన్నీ చెప్పలేక అఖిల్ ఇలా కవర్ చేసుకుంటున్నాడు.
ఇక తన సినిమా ప్రమోషన్స్ కి ప్రభాస్ , చరణ్ వస్తున్నారా ? అనే ప్రశ్నకి అఖిల్ కూల్ గా రియాక్ట్ అయ్యాడు. ట్రైలర్ చూసి ఫోన్ లో ఇద్దరు మాట్లాడారని ప్రమోషన్స్ లో పాల్గొనే ఛాన్స్ ఉందన్నట్టుగా చెప్పాడు. ఇక నాగ్ వందో సినిమాలో తను కూడా యాక్ట్ చేస్తున్న విషయంపై కూడా అఖిల్ రియాక్ట్ అవుతూ ఇంకా దానికి స్క్రిప్ట్ రెడీ అవ్వలేదని , స్క్రిప్ట్ రెడీ అయితే తమే ఎనౌన్స్ చేస్తామని అన్నాడు. మా కాంబో సినిమా అంటే ఎప్పటికీ గుర్తుండి పోయేలా ఉండాలని అలా ఉంటేనే చేస్తామని తెలిపాడు.
This post was last modified on April 23, 2023 7:49 am
వరస ఫెయిల్యూర్స్ తో మార్కెట్ ని రిస్క్ లో పెట్టుకున్న విజయ్ దేవరకొండకు ది ఫ్యామిలీ స్టార్ ఇచ్చిన షాక్…
నిన్న సాయంత్రం విడుదలైన దేవర పార్ట్ 1 మొదటి ఆడియో సింగల్ ఫియర్ కు ఊహించని స్థాయిలో ఇటు ఛార్ట్…
రవితేజ ‘టచ్ చేసి చూడు’ సినిమా గుర్తుందా ? అందులో అలజడి సృష్టిస్తున్న అల్లరిమూకలను అరికట్టేందుకు రవితేజ పోలీసులకు రౌడీ…
ఇంకో ముప్పై ఏడు రోజుల్లో విడుదల కాబోతున్న కల్కి ఏడి 2898 కోసం అభిమానులే కాదు యావత్ ఇండస్ట్రీ మొత్తం…
కాలు జారితే తీసుకోవచ్చు. కానీ, నోరు జారితే మాత్రం తీసుకోవడం కష్టం. పైగా ఇది పరువు, ప్రతిష్టలకు కూడా సంబంధించిన…
ఏపీలో ఈ నెల 13న జరిగిన పోలింగ్ అనంతరం.. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో చోటు చేసు కున్న హింస..…