అక్కినేని అఖిల్ హీరోగా అతని మార్కెట్ ను మించి ఖర్చు పెట్టి తీసిన భారీ సినిమా ‘ఏజెంట్’ ఈ నెల 28న థియేటర్స్ లోకి వస్తుంది. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ ఉన్నపలంగా ఫిక్స్ చేసుకోవడంతో హడావిడిగా ప్రమోషన్స్ చేస్తున్నాడు అఖిల్. ఎక్కువ టైమ్ లేకపోవడంతో పాన్ ఇండియా రిలీజ్ ను వాయిదా వేసుకొని కేవలం తెలుగులోనే రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో అఖిల్ పాల్గొన్న ప్రతీ సారి షూటింగ్ డిలే , ఓవర్ బడ్జెట్ అనే క్వశ్చన్స్ ఎదురవుతున్నాయి.
ఈ క్వశ్చన్స్ విన్న ప్రతీ సారి కొద్దిగా ఇరిటేట్ అవుతున్నాడు అఖిల్. వెళ్ళిన ప్రతీ చోట అఖిల్ కి షూటింగ్ ఆలస్యం అనే ప్రశ్న వింటుంటే ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది. తాజాగా కూడా ఆ ప్రశ్న కి ఇరిటేషన్ గా ఫీలయ్యాడు అఖిల్. డిలే అండొద్దు. ఈ మాత్రం షూటింగ్ డేస్ అవుతాయి. అయినా మేము ఘాట్ చేసింది కేవలం 105 రోజులే అంటూ ఏదో లెక్క చెప్పుకొచ్చాడు. నిజానికి ఈ సినిమా చాలా కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. అవన్నీ చెప్పలేక అఖిల్ ఇలా కవర్ చేసుకుంటున్నాడు.
ఇక తన సినిమా ప్రమోషన్స్ కి ప్రభాస్ , చరణ్ వస్తున్నారా ? అనే ప్రశ్నకి అఖిల్ కూల్ గా రియాక్ట్ అయ్యాడు. ట్రైలర్ చూసి ఫోన్ లో ఇద్దరు మాట్లాడారని ప్రమోషన్స్ లో పాల్గొనే ఛాన్స్ ఉందన్నట్టుగా చెప్పాడు. ఇక నాగ్ వందో సినిమాలో తను కూడా యాక్ట్ చేస్తున్న విషయంపై కూడా అఖిల్ రియాక్ట్ అవుతూ ఇంకా దానికి స్క్రిప్ట్ రెడీ అవ్వలేదని , స్క్రిప్ట్ రెడీ అయితే తమే ఎనౌన్స్ చేస్తామని అన్నాడు. మా కాంబో సినిమా అంటే ఎప్పటికీ గుర్తుండి పోయేలా ఉండాలని అలా ఉంటేనే చేస్తామని తెలిపాడు.
This post was last modified on April 23, 2023 7:49 am
నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో జరుగుతున్న పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశాన్ని…
అటు పార్లమెంటులోనూ.. ఇటు బయట కూడా.. నీట్ ప్రశ్నపత్రాలకు సంబంధించిన నిరసనలు కొనసాగుతున్న సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని…
విజయ్ దేవరకొండకు 2026 ఎంతో కీలకమైన సంవత్సరం. చాలా ఏళ్ల నుంచి సరైన విజయం లేని అతను.. ఈ ఏడాది…
పూజా హెగ్డే పేరుకు ఉత్తరాది హీరోయినే కానీ.. ఆమె ఎక్కువ సినిమాలు చేసింది సౌత్లోనే. ముఖ్యంగా తెలుగులో ఆమె ఒకప్పుడు…
తమిళంలో నంబర్ వన్ హీరో స్థానంలో ఉండగా సినిమాలకు టాటా చెప్పేసి రాజకీయాల్లోకి వెళ్లిపోయాడు విజయ్. వెళ్తూ వెళ్తూ ఆయన…
రేపు జన నాయకుడు విడుదలవుతోంది. ఇది కాదు అసలు విశేషం. ఏపీ తెలంగాణ కొన్ని జిల్లా కేంద్రాల్లో ఉదయం 7…