మార్చి నెలాఖర్లో దసరా సందడి తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ డల్లుగానే నడుస్తోంది. రావణాసుర, మీటర్, శాకుంతలం.. ఇలా ఏ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. రావణాసుర చిత్రానికి ఓ మోస్తరుగా ఓపెనింగ్స్ అయినా వచ్చాయి కానీ.. మిగతా సినిమాల పరిస్థితి దారుణం.
సినిమాలకు బాగా కలిసొచ్చే వేసవి సీజన్లో ఈ స్లంప్ ఏంటని టాలీవుడ్ కంగారు పడిపోయింది. దీనికి తోడు ఈ శుక్రవారానికి షెడ్యూల్ అయిన కొత్త సినిమా విరూపాక్షకు కూడా ఏమంత పాజిటివ్ హైప్ కనిపించలేదు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ ఆకట్టుకున్నప్పటికీ.. అడ్వాన్స్ బుకింగ్స్ అయితే డల్లుగానే ఉన్నాయి. ఒకప్పుడు సాయిధరమ్ తేజ్ సినిమాలకు ఈజీగా తొలి రోజు ఫుల్స్ పడిపోయేవి కానీ.. ఈ సినిమాకు ఆ పరిస్థితి లేదు. శుక్రవారం మార్నింగ్ షోలకు అక్యుపెన్సీ తక్కువగా కనిపించింది.
ఐతే తొలి రోజు సాయంత్రానికి బాక్సాఫీస్ దగ్గర విరూపాక్ష మ్యాజిక్ మొదలైంది. పాజిటివ్ రివ్యూలు, టాక్ సినిమాకు బాగానే కలిసొచ్చాయి. అందరూ మంచి సినిమా అని చెబుతుండేసరికి ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగిపోయింది. సాయంత్రానికి ఒక్కసారిగా ఆక్యుపెన్సీలు పెరిగిపోయాయి. హైదరాబాద్ లాంటి సిటీల్లో చాలా థియేటర్లలో హౌస్ ఫుల్స్ పడిపోయాయి. ఈ రోజుల్లో సినిమా యావరేజ్ అంటే ఆలోచిస్తారు కానీ.. అందరూ బాగుంది అంటే ప్రేక్షకులు ఎగబడతారు.
అందులోనూ కొన్ని వారాలుగా సరైన సినిమా లేకపోవడం కూడా విరూపాక్ష వైపు మళ్లడానికి దోహద పడుతోంది. తేజు మీద సానుకూలత, సానుభూతి ఉండటం కూడా సినిమాకు కలిసొస్తుందని భావిస్తున్నారు. శని, ఆదివారాల్లో సినిమాకు మరింత మంచి వసూళ్లు వస్తాయని.. హౌస్ ఫుల్స్తో రన్ అవుతుందని ఆశిస్తున్నారు. కొత్త దర్శకుడు కార్తీక్ దండు రూపొందించిన ఈ చిత్రానికి అతడి గురువు సుకుమార్ స్క్రీన్ ప్లే అందించాడు.
This post was last modified on April 22, 2023 2:08 pm
వైసీపీ సీనియర్ నాయకుడు, ప్రస్తుతం శాసన మండలి చైర్మన్గా ఉన్న మోషేన్ రాజుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టే అంశంపై…
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై అదే పార్టీకి చెందిన సీనియర్లు గుర్రుగా ఉన్న నేపథ్యంలో అనేక ఫిర్యాదులు అధిష్టానానికి చేరుతున్నాయి. ముఖ్యంగా…
2026 వేసవి వృథా అయిపోతోందని బయ్యర్ వర్గాలు తెగ ఆందోళన చెందుతున్నాయి. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా యునానిమస్ బ్లాక్…
ఏడాదికి ఒక సినిమా విడుదల చేయడమే మహా కష్టమైపోతున్న ట్రెండ్ లో కేవలం వారం గ్యాప్ లో రెండు రిలీజులు…
టీడీపీ శ్రేణులకు ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు పలు జాగ్రత్తలు చెప్పారు. వైసీపీని గొడ్డలి పార్టీగా అభివర్ణించిన ఆయన..…
ఐపీఎస్ అధికారిగా సుదీర్ఘ కాలం పాటు తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ లోనే విధులు నిర్వర్తించిన సీనియర్ పోలీసు అధికారి సీవీ…