మార్చి నెలాఖర్లో దసరా సందడి తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ డల్లుగానే నడుస్తోంది. రావణాసుర, మీటర్, శాకుంతలం.. ఇలా ఏ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. రావణాసుర చిత్రానికి ఓ మోస్తరుగా ఓపెనింగ్స్ అయినా వచ్చాయి కానీ.. మిగతా సినిమాల పరిస్థితి దారుణం.
సినిమాలకు బాగా కలిసొచ్చే వేసవి సీజన్లో ఈ స్లంప్ ఏంటని టాలీవుడ్ కంగారు పడిపోయింది. దీనికి తోడు ఈ శుక్రవారానికి షెడ్యూల్ అయిన కొత్త సినిమా విరూపాక్షకు కూడా ఏమంత పాజిటివ్ హైప్ కనిపించలేదు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ ఆకట్టుకున్నప్పటికీ.. అడ్వాన్స్ బుకింగ్స్ అయితే డల్లుగానే ఉన్నాయి. ఒకప్పుడు సాయిధరమ్ తేజ్ సినిమాలకు ఈజీగా తొలి రోజు ఫుల్స్ పడిపోయేవి కానీ.. ఈ సినిమాకు ఆ పరిస్థితి లేదు. శుక్రవారం మార్నింగ్ షోలకు అక్యుపెన్సీ తక్కువగా కనిపించింది.
ఐతే తొలి రోజు సాయంత్రానికి బాక్సాఫీస్ దగ్గర విరూపాక్ష మ్యాజిక్ మొదలైంది. పాజిటివ్ రివ్యూలు, టాక్ సినిమాకు బాగానే కలిసొచ్చాయి. అందరూ మంచి సినిమా అని చెబుతుండేసరికి ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగిపోయింది. సాయంత్రానికి ఒక్కసారిగా ఆక్యుపెన్సీలు పెరిగిపోయాయి. హైదరాబాద్ లాంటి సిటీల్లో చాలా థియేటర్లలో హౌస్ ఫుల్స్ పడిపోయాయి. ఈ రోజుల్లో సినిమా యావరేజ్ అంటే ఆలోచిస్తారు కానీ.. అందరూ బాగుంది అంటే ప్రేక్షకులు ఎగబడతారు.
అందులోనూ కొన్ని వారాలుగా సరైన సినిమా లేకపోవడం కూడా విరూపాక్ష వైపు మళ్లడానికి దోహద పడుతోంది. తేజు మీద సానుకూలత, సానుభూతి ఉండటం కూడా సినిమాకు కలిసొస్తుందని భావిస్తున్నారు. శని, ఆదివారాల్లో సినిమాకు మరింత మంచి వసూళ్లు వస్తాయని.. హౌస్ ఫుల్స్తో రన్ అవుతుందని ఆశిస్తున్నారు. కొత్త దర్శకుడు కార్తీక్ దండు రూపొందించిన ఈ చిత్రానికి అతడి గురువు సుకుమార్ స్క్రీన్ ప్లే అందించాడు.
దర్శకుడు లొకేషన్లో లేకుండా సినిమా తీయడం సాధ్యం అవుతుందా? అదెలా సాధ్యం అంటారా? సింగ్ గీతం టీం ఈ విషయాన్ని…
నిజమేనండోయ్… ఏ విషయంలో అయినా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ…
తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్ సంపాదించింది సమంత. విజయశాంతి, అనుష్కల తర్వాత హీరోలతో…
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…