మార్చి నెలాఖర్లో దసరా సందడి తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ డల్లుగానే నడుస్తోంది. రావణాసుర, మీటర్, శాకుంతలం.. ఇలా ఏ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. రావణాసుర చిత్రానికి ఓ మోస్తరుగా ఓపెనింగ్స్ అయినా వచ్చాయి కానీ.. మిగతా సినిమాల పరిస్థితి దారుణం.
సినిమాలకు బాగా కలిసొచ్చే వేసవి సీజన్లో ఈ స్లంప్ ఏంటని టాలీవుడ్ కంగారు పడిపోయింది. దీనికి తోడు ఈ శుక్రవారానికి షెడ్యూల్ అయిన కొత్త సినిమా విరూపాక్షకు కూడా ఏమంత పాజిటివ్ హైప్ కనిపించలేదు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ ఆకట్టుకున్నప్పటికీ.. అడ్వాన్స్ బుకింగ్స్ అయితే డల్లుగానే ఉన్నాయి. ఒకప్పుడు సాయిధరమ్ తేజ్ సినిమాలకు ఈజీగా తొలి రోజు ఫుల్స్ పడిపోయేవి కానీ.. ఈ సినిమాకు ఆ పరిస్థితి లేదు. శుక్రవారం మార్నింగ్ షోలకు అక్యుపెన్సీ తక్కువగా కనిపించింది.
ఐతే తొలి రోజు సాయంత్రానికి బాక్సాఫీస్ దగ్గర విరూపాక్ష మ్యాజిక్ మొదలైంది. పాజిటివ్ రివ్యూలు, టాక్ సినిమాకు బాగానే కలిసొచ్చాయి. అందరూ మంచి సినిమా అని చెబుతుండేసరికి ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగిపోయింది. సాయంత్రానికి ఒక్కసారిగా ఆక్యుపెన్సీలు పెరిగిపోయాయి. హైదరాబాద్ లాంటి సిటీల్లో చాలా థియేటర్లలో హౌస్ ఫుల్స్ పడిపోయాయి. ఈ రోజుల్లో సినిమా యావరేజ్ అంటే ఆలోచిస్తారు కానీ.. అందరూ బాగుంది అంటే ప్రేక్షకులు ఎగబడతారు.
అందులోనూ కొన్ని వారాలుగా సరైన సినిమా లేకపోవడం కూడా విరూపాక్ష వైపు మళ్లడానికి దోహద పడుతోంది. తేజు మీద సానుకూలత, సానుభూతి ఉండటం కూడా సినిమాకు కలిసొస్తుందని భావిస్తున్నారు. శని, ఆదివారాల్లో సినిమాకు మరింత మంచి వసూళ్లు వస్తాయని.. హౌస్ ఫుల్స్తో రన్ అవుతుందని ఆశిస్తున్నారు. కొత్త దర్శకుడు కార్తీక్ దండు రూపొందించిన ఈ చిత్రానికి అతడి గురువు సుకుమార్ స్క్రీన్ ప్లే అందించాడు.
This post was last modified on April 22, 2023 2:08 pm
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…