మార్చి నెలాఖర్లో దసరా సందడి తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ డల్లుగానే నడుస్తోంది. రావణాసుర, మీటర్, శాకుంతలం.. ఇలా ఏ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. రావణాసుర చిత్రానికి ఓ మోస్తరుగా ఓపెనింగ్స్ అయినా వచ్చాయి కానీ.. మిగతా సినిమాల పరిస్థితి దారుణం.
సినిమాలకు బాగా కలిసొచ్చే వేసవి సీజన్లో ఈ స్లంప్ ఏంటని టాలీవుడ్ కంగారు పడిపోయింది. దీనికి తోడు ఈ శుక్రవారానికి షెడ్యూల్ అయిన కొత్త సినిమా విరూపాక్షకు కూడా ఏమంత పాజిటివ్ హైప్ కనిపించలేదు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ ఆకట్టుకున్నప్పటికీ.. అడ్వాన్స్ బుకింగ్స్ అయితే డల్లుగానే ఉన్నాయి. ఒకప్పుడు సాయిధరమ్ తేజ్ సినిమాలకు ఈజీగా తొలి రోజు ఫుల్స్ పడిపోయేవి కానీ.. ఈ సినిమాకు ఆ పరిస్థితి లేదు. శుక్రవారం మార్నింగ్ షోలకు అక్యుపెన్సీ తక్కువగా కనిపించింది.
ఐతే తొలి రోజు సాయంత్రానికి బాక్సాఫీస్ దగ్గర విరూపాక్ష మ్యాజిక్ మొదలైంది. పాజిటివ్ రివ్యూలు, టాక్ సినిమాకు బాగానే కలిసొచ్చాయి. అందరూ మంచి సినిమా అని చెబుతుండేసరికి ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగిపోయింది. సాయంత్రానికి ఒక్కసారిగా ఆక్యుపెన్సీలు పెరిగిపోయాయి. హైదరాబాద్ లాంటి సిటీల్లో చాలా థియేటర్లలో హౌస్ ఫుల్స్ పడిపోయాయి. ఈ రోజుల్లో సినిమా యావరేజ్ అంటే ఆలోచిస్తారు కానీ.. అందరూ బాగుంది అంటే ప్రేక్షకులు ఎగబడతారు.
అందులోనూ కొన్ని వారాలుగా సరైన సినిమా లేకపోవడం కూడా విరూపాక్ష వైపు మళ్లడానికి దోహద పడుతోంది. తేజు మీద సానుకూలత, సానుభూతి ఉండటం కూడా సినిమాకు కలిసొస్తుందని భావిస్తున్నారు. శని, ఆదివారాల్లో సినిమాకు మరింత మంచి వసూళ్లు వస్తాయని.. హౌస్ ఫుల్స్తో రన్ అవుతుందని ఆశిస్తున్నారు. కొత్త దర్శకుడు కార్తీక్ దండు రూపొందించిన ఈ చిత్రానికి అతడి గురువు సుకుమార్ స్క్రీన్ ప్లే అందించాడు.
This post was last modified on April 22, 2023 2:08 pm
తండ్రుల వల్ల కానిది పిల్లలు చేసి చూపిస్తే అదో ఆనందం. నాగబాబు ప్రస్తుతం ఈ స్థితిని అనుభవిస్తున్నారు. నిర్మాతగా నాగబాబు…
సీనియర్ నటుడు రాజశేఖర్కు గోలీల ఫ్యాక్టరీ ఉందని.. దాని ద్వారా ప్రతి నెలా కోట్లు సంపాదిస్తున్నాడని సోషల్ మీడియాలో వీడియోలు…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇక రాష్ట్రపతి ఆమోదమే…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట నుంచి వచ్చిన మావిగన్ పైనే…
ఒకపక్క ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మెల్లగా మొదలైపోతున్నాయి. ట్రాకర్స్ ఒక్కొకరుగా రంగంలోకి దిగుతున్నారు. ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు ఏ నిమిషంలో…
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు క్యాంపు కార్యాలయంపై శనివారం దాడి…