Movie News

విరూపాక్ష బిజినెస్ లక్ష్యం ఎంత

ఇంకో రెండు రోజుల్లో విడుదల కాబోతున్న విరూపాక్ష మీద నిర్మాతలు మాములు నమ్మకంగా లేరు. సాధారణంగా సాయి ధరమ్ తేజ్ కి రెగ్యులర్ టైమింగ్ కాకుండా హైదరాబాద్ మినహాయించి ఇతర చోట్ల స్పెషల్ షో లు ఉండవు. కానీ దీనికి మాత్రం ప్రత్యేకంగా కర్నూలు లాంటి జిల్లా కేంద్రంలోనూ ఉదయం ఏడున్నరకు ప్రీమియర్లు వేస్తున్నారంటే వాళ్లకున్న కాన్ఫిడెన్స్ ని అర్థం చేసుకోవచ్చు. సుకుమార్ స్క్రీన్ ప్లే సమకూర్చిన ఈ విలేజ్ ఫాంటసీ థ్రిల్లర్ తో కార్తీక్ దండు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ప్రీ రిలీజ్ రిపోర్ట్స్ చాలా పాజిటివ్ గా ఉన్న మాట వాస్తవం.

ఇక బిజినెస్ సంగతి చూస్తే ఏపీ తెలంగాణ కలిపి సుమారు 21 కోట్లకు థియేట్రికల్ డీల్స్ జరిగినట్టుగా ట్రేడ్ టాక్. ఓవర్ సీస్ మరో మూడు కోట్లు అదనం. సాయి ధరమ్ తేజ్ మార్కెట్ కోణంలో చూస్తే ఇది పెద్ద మొత్తమే. అయితే ట్రైలర్ వచ్చాక ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందనే నమ్మకం బయ్యర్లలో కనిపిస్తోంది. గత నెల దసరా తర్వాత ఇంకే సినిమా కనీస స్థాయిలో మెప్పించలేకపోవడంతో సమ్మర్ సీజన్ కి ఇదే బెస్ట్ ఆప్షన్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు. పాజిటివ్ టాక్స్ వస్తే ఆపై వారం ఏజెంట్, పొన్నియన్ సెల్వన్ 2 ఉన్నా కూడా ఇబ్బంది లేదన్న ధీమా టీమ్ లో కనిపిస్తోంది.

ఇటు తేజు, హీరోయిన్ సంయుక్త మీనన్ ఇద్దరూ ఎడతెరిపి లేకుండా ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. ప్రస్తుతానికి ఆన్ లైన్ అడ్వాన్స్ బుకింగ్స్ నెమ్మదిగానే ఉన్నప్పటికీ ఆ రోజుకు పికప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎలాగూ శుక్రవారం రంజాన్ పండగ కలిసి వస్తోంది. సల్మాన్ ఖాన్ కిసీకా భాయ్ కిసీకా జాన్ పోటీలో ఉన్నప్పటికీ తెలుగు జనాల ఫస్ట్ ఛాయస్ విరూపాక్షనే ఉంటుంది కాబట్టి ఓపెనింగ్స్ ని గ్రాండ్ గానే ఆశించొచ్చు. తిరిగి జూలైలో పవన్ కళ్యాణ్ తో నటించిన సినిమా రిలీజ్ ఉంది కనక అది సక్సెస్ అయితే మావయ్యకే ఎక్కువ క్రెడిట్ వెళ్తుంది కాబట్టి సోలో హీరోగా విరూపాక్షతో పెద్ద హిట్టు పడాలి.

This post was last modified on April 19, 2023 12:22 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

1 hour ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

3 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

4 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

5 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

5 hours ago