బాలయ్య నటించిన ‘వీర సింహా రెడ్డి’ సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది. గోపీచంద్ మలినేని బాలయ్యను డీల్ చేసిన విధానం చూసి ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. బాలయ్య గెటప్ , యాక్షన్ ఎపిసోడ్స్ రిలీజ్ కి ముందే మంచి బజ్ క్రియేట్ చేశాయి. దీంతో సినిమా థియేటర్స్ లో అభిమానులతో పాటు మూవీ లవర్స్ ను కూడా మెప్పించి భారీ విజయం అందుకుంది.
ఈ నెల 23న సినిమా వంద రోజులు పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా మైత్రి నిర్మాతలు భారీ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. రేపు ఈవెంట్ ఎక్కడా అనేది చెప్పానున్నారు. హైదరాబాద్ లేదా వంద రోజులు ఆడుతున్న ప్లేస్ లో ఈవెంట్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు.
వీర సింహా రెడ్డి కొన్ని సెంటర్స్ లో డైరెక్ట్ గా వంద రోజులు మరికొన్ని థియేటర్స్ లో షిఫ్టింగ్ తో వంద రోజులు పూర్తి చేసుకోనుంది. ఎన్ని థియేటర్స్ అనేది తెలియాల్సి ఉంది. అయితే ఓటీటీ , డిజిటల్ యుగం నడుస్తున్న ఈ రోజుల్లో థియేటర్స్ లో వంద రోజులు ఆడటం అంటే గొప్ప విషయమే. బాలయ్య నటించిన అఖండ కూడా వంద రోజులు థియేటర్స్ లో ప్రదర్శించబడింది. ఆ సినిమాకు కర్నూల్ లో గ్రాండ్ గా వంద రోజుల వేడుక చేశారు. ఇప్పుడు అదే రీతిలో వీర సింహా రెడ్డి 100 డేస్ ఫంక్షన్ ప్లాన్ చేస్తున్నారు. ఇలా వరుసగా రెండు సార్లు 100 రోజుల వేడుక జరుపుకున్న హీరోగా బాలయ్య అరుదైన రికార్డ్ నెలకొల్పనున్నాడు.
This post was last modified on April 18, 2023 10:12 pm
తండ్రుల వల్ల కానిది పిల్లలు చేసి చూపిస్తే అదో ఆనందం. నాగబాబు ప్రస్తుతం ఈ స్థితిని అనుభవిస్తున్నారు. నిర్మాతగా నాగబాబు…
సీనియర్ నటుడు రాజశేఖర్కు గోలీల ఫ్యాక్టరీ ఉందని.. దాని ద్వారా ప్రతి నెలా కోట్లు సంపాదిస్తున్నాడని సోషల్ మీడియాలో వీడియోలు…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇక రాష్ట్రపతి ఆమోదమే…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట నుంచి వచ్చిన మావిగన్ పైనే…
ఒకపక్క ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మెల్లగా మొదలైపోతున్నాయి. ట్రాకర్స్ ఒక్కొకరుగా రంగంలోకి దిగుతున్నారు. ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు ఏ నిమిషంలో…
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు క్యాంపు కార్యాలయంపై శనివారం దాడి…