బాలయ్య నటించిన ‘వీర సింహా రెడ్డి’ సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది. గోపీచంద్ మలినేని బాలయ్యను డీల్ చేసిన విధానం చూసి ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. బాలయ్య గెటప్ , యాక్షన్ ఎపిసోడ్స్ రిలీజ్ కి ముందే మంచి బజ్ క్రియేట్ చేశాయి. దీంతో సినిమా థియేటర్స్ లో అభిమానులతో పాటు మూవీ లవర్స్ ను కూడా మెప్పించి భారీ విజయం అందుకుంది.
ఈ నెల 23న సినిమా వంద రోజులు పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా మైత్రి నిర్మాతలు భారీ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. రేపు ఈవెంట్ ఎక్కడా అనేది చెప్పానున్నారు. హైదరాబాద్ లేదా వంద రోజులు ఆడుతున్న ప్లేస్ లో ఈవెంట్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు.
వీర సింహా రెడ్డి కొన్ని సెంటర్స్ లో డైరెక్ట్ గా వంద రోజులు మరికొన్ని థియేటర్స్ లో షిఫ్టింగ్ తో వంద రోజులు పూర్తి చేసుకోనుంది. ఎన్ని థియేటర్స్ అనేది తెలియాల్సి ఉంది. అయితే ఓటీటీ , డిజిటల్ యుగం నడుస్తున్న ఈ రోజుల్లో థియేటర్స్ లో వంద రోజులు ఆడటం అంటే గొప్ప విషయమే. బాలయ్య నటించిన అఖండ కూడా వంద రోజులు థియేటర్స్ లో ప్రదర్శించబడింది. ఆ సినిమాకు కర్నూల్ లో గ్రాండ్ గా వంద రోజుల వేడుక చేశారు. ఇప్పుడు అదే రీతిలో వీర సింహా రెడ్డి 100 డేస్ ఫంక్షన్ ప్లాన్ చేస్తున్నారు. ఇలా వరుసగా రెండు సార్లు 100 రోజుల వేడుక జరుపుకున్న హీరోగా బాలయ్య అరుదైన రికార్డ్ నెలకొల్పనున్నాడు.
This post was last modified on April 18, 2023 10:12 pm
వైసీపీ సీనియర్ నాయకుడు, ప్రస్తుతం శాసన మండలి చైర్మన్గా ఉన్న మోషేన్ రాజుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టే అంశంపై…
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై అదే పార్టీకి చెందిన సీనియర్లు గుర్రుగా ఉన్న నేపథ్యంలో అనేక ఫిర్యాదులు అధిష్టానానికి చేరుతున్నాయి. ముఖ్యంగా…
2026 వేసవి వృథా అయిపోతోందని బయ్యర్ వర్గాలు తెగ ఆందోళన చెందుతున్నాయి. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా యునానిమస్ బ్లాక్…
ఏడాదికి ఒక సినిమా విడుదల చేయడమే మహా కష్టమైపోతున్న ట్రెండ్ లో కేవలం వారం గ్యాప్ లో రెండు రిలీజులు…
టీడీపీ శ్రేణులకు ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు పలు జాగ్రత్తలు చెప్పారు. వైసీపీని గొడ్డలి పార్టీగా అభివర్ణించిన ఆయన..…
ఐపీఎస్ అధికారిగా సుదీర్ఘ కాలం పాటు తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ లోనే విధులు నిర్వర్తించిన సీనియర్ పోలీసు అధికారి సీవీ…