సినిమా అందరూ బాగుందని మెచ్చుకున్నారు. రివ్యూలు పాజిటివ్ గా వచ్చాయి. పబ్లిక్ టాక్ ఒక డిఫరెంట్ మూవీ చూశామని చెప్పాయి. కట్ చేస్తే మొదటి రోజు కోటి ఇరవై లక్షల దాకా వసూలు చేసి డీసెంట్ అనిపించుకుంది. కానీ ఇదంతా విడుదల పార్ట్ 1కు సానుకూలంగా మారలేకపోయింది. టిపికల్ మూవీస్ తో అణుగారిన వర్గాలకు ప్రతినిధిగా ఎన్నో గొప్ప చిత్రాలు అందించిన దర్శకుడు వెట్రిమారన్ నుంచి వచ్చిన మరో క్లాసిక్ ఇది. విమర్శలు ఎంత మెచ్చుకున్నా సాధారణ ప్రేక్షకులను ఎక్కువ సంఖ్యలో థియేటర్ల దాకా రప్పించలేకపోతోంది. నగరాల్లోనే బాగా నెమ్మదించేసింది.
గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ ద్వారా అల్లు అరవింద్ పంపిణి చేసినప్పటికీ దీన్ని మరింత బలంగా పబ్లిక్ లోకి తీసుకెళ్లేలా ప్రమోషన్లు చేయకపోవడంతో రీచ్ లిమిటెడ్ గా మారింది. పోటీలో శాకుంతలం, రుద్రుడు రెండూ డిజాస్టర్ అయినప్పటికీ విడుదల పార్ట్ 1 ఆ అవకాశం వాడుకోలేదు. 80 దశకం నాటి పోలీస్ నక్సలైట్ యుద్ధాన్ని చూసేందుకు తెలుగు ఆడియన్స్ అంతగా ఆసక్తి చూపించలేదని దీన్ని బట్టి అర్థమవుతోంది. వెట్రిమారన్ ఎంత రియలిస్టిక్ గా చూపించినా హింస మోతాదుతో పాటు ప్రాంతీయత సమస్య రావడం వల్ల ఫ్యామిలీ జనాలు దూరంగా ఉండిపోయారు.
స్వంతగా రిలీజ్ చేయడం వల్ల విడుదల పార్ట్ `1 కలెక్షన్ల లెక్కలకు సంబంధించిన వివరాలు బయటికి రావడం లేదు. పార్ట్ 2 బిజినెస్ కి ఇది చాలా కీలకం కానుంది. విజయ్ సేతుపతి పాత్ర రెండో భాగంలోనే ఎక్కువ హైలైట్ కాబోతోంది కాబట్టి అది రిలీజయ్యే టైంకి ఈ అంశాన్నే ఎక్కువ మార్కెటింగ్ చేసుకోవాలి. ఇంకా విడుదల తేదీ ఖరారు చేయలేదు కానీ ఈసారి తమిళ తెలుగు భాషల్లో ఒకేసారి ప్లాన్ చేసినట్టు తెలిసింది. థియేటర్ల సంగతి ఎలా ఉన్నా షాకింగ్ కంటెంట్ ఉన్న విడుదల పార్ట్ 1కి ఓటిటిలో వచ్చాక మాత్రం ఓ రేంజ్ రెస్పాన్స్ రావడం ఖాయం.
This post was last modified on April 18, 2023 6:01 pm
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…
నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఢిల్లీ నిరసనలో ఉగ్రవాదుల కుట్ర కోణం బయట పడిందని ఢిల్లీ టాస్క్ఫోర్స్…