Movie News

ఒక్క నిర్మాణ సంస్థ‌లో 30 సినిమాలు

ఒక నిర్మాణ సంస్థ 30 సినిమాలు పూర్తి చేస్తేనే ఆశ్చర్యపోయే రోజులు ఇవి. అలాంటిది ఒక సంస్థలో 30 సినిమాల దాకా ప్లానింగ్‌లో ఉన్నాయి అంటే షాకవ్వక తప్పదు. కొన్నేళ్ల నుంచి ట్రెండును గమనిస్తే.. కొంచెం అగ్రెసివ్‌గా సినిమాలు తీసి.. ఆ తర్వాత కనుమరుగు అయిపోతున్న ప్రొడక్షన్ హౌస్‌లు చాలానే కనిపిస్తాయి. సినిమాల నిర్మాణం పూర్తిగా జూదం లాగా మారిపోయి.. కాంబినేషన్ల మీద ఆధారపడి సినిమాలు తీసే ప్రస్తుత కాలంలో నిలకడగా విజయాలు అందుకుని.. దీర్ఘ కాలం నిలిచే సంస్థలు తగ్గిపోతున్నాయి.

ఇలాంటి టైంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలో దాదాపు 30 సినిమాల దాకా ప్లానింగ్‌లో ఉన్నాయన్న వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. ఈ సంస్థ మొదట్లో కొంచెం నెమ్మదిగానే అడుగులు వేసింది. చిన్న స్థాయి సినిమాలే నిర్మించింది. ఫలితాలు కూడా అందుకు తగ్గట్లే వచ్చాయి.

కానీ గత ఏడాది ‘కార్తికేయ-2’తో పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని అందుకుంది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. తర్వాత కొన్ని నెలలకే ‘ధమాకా’ రూపంలో మరో జాక్‌పాట్ తగిలింది. దీంతో ఈ సంస్థ దూకుడు బాగా పెరిగింది. ఇప్పుడు ఇద్దరు టాప్ స్టార్లతో సినిమాలు ప్రొడ్యూస్ చేస్తూ తమ సంస్థను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకువెళ్లే పనిలో ఉన్నారు టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల.

మారుతి దర్శకత్వంలో ప్రభాస్ సినిమాతో పాటు.. పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న ‘వినోదియ సిత్తం’ రీమేక్ పీపుల్స్ మీడియా బేనర్లో తెరకెక్కతున్నవే. ఇక మే తొలి వారంలో రానున్న ‘రామబాణం’ ఈ సంస్థ సినిమానే. ఇవి పైకి కనిపిస్తున్నవి కానీ.. ఇంకా అనౌన్స్ కాకుండానే సైలెంటుగా సెట్స్ మీదికి వెళ్లినవి.. ప్రి ప్రొడక్షన్ దశలో ఉన్నవి.. కథా చర్చల్లో ఉన్నవి.. ఇలా ఈ సంస్థలో చాలా సినిమాలే వరుసలో ఉన్నాయట. అన్నీ కలిపితే నంబర్ 30 దాకా ఉంటుందని టాక్. ఒక సంస్థ కాస్త అటు ఇటుగా ఒకే టైంలో ఇన్ని సినిమాలు ప్లాన్ చేయడం ఒక రికార్డేమో.

Satya

Recent Posts

1500 కోట్ల భూ క‌బ్జా కేసు.. ప‌రారీలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే?

వైసీపీ అధికారంలో ఉండ‌గా.. ఆపార్టీకి చెందిన నాయ‌కులు అనేక అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డార‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. మద్యం నుంచి ఇసుక దాకా,…

41 minutes ago

విజయవాడ మ్యాచులో బౌండరీ దాటాల్సిందే

పెద్ది ప్రమోషన్లు చివరి స్టేజికి వచ్చేశాయి. ఇంకో వారం కన్నా తక్కువ టైం ఉండటంతో ఫ్యాన్స్ ఎగ్జైట్ మెంట్ పెరుగుతోంది.…

1 hour ago

కర్ణాటక సీఎం మార్పు… ఢిల్లీలో షర్మిల

దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో అధికారం దక్కించుకున్న గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్.. మరో రాష్ట్రంలో అధికార కూటమిలో భాగస్వామిగా…

3 hours ago

క‌డ‌ప‌పైనే పసుపు సేన దృష్టి

రాష్ట్రవ్యాప్తంగా మహానాడు మహా వైభవంగా జరిగింది. ఆన్లైన్ వేదికగా నిర్వహించినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున…

8 hours ago

జూన్ నెలలో విజయ్…….జూలైలో జూనియర్ విజయ్

కోలీవుడ్ లో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకోనుంది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చివరి సినిమాగా చెప్పబడుతున్న జన నాయగన్…

9 hours ago

కెప్టెన్‌గా రిష‌బ్ పంత్ ఔట్‌

రెండేళ్ల ముందు ఐపీఎల్ వేలంలో ఏకంగా రూ.27 కోట్ల‌తో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ టీం సొంత‌మైన ఆట‌గాడు రిష‌బ్ పంత్.…

9 hours ago