తెలుగు దర్శకులకు వేరే ఫిలిం ఇండస్ట్రీల్లోనూ ఇది వరకు ఎన్నడూ లేనంత డిమాండ్ ఏర్పడింది గత కొన్నేళ్లలో. బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్వుడ్.. ఇలా అన్ని ఇండస్ట్రీల హీరోలూ టాలీవుడ్ డైరెక్టర్లతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా ఈ మధ్య తమిళ హీరోలు.. వరుసగా తెలుగు దర్శకులతో జట్టు కడుతున్నారు.
శివ కార్తికేయనేమో అనుదీప్తో ‘ప్రిన్స్’ చేస్తే.. వెంకీ అట్లూరితో ధనుష్ ‘సార్’ చేశాడు. అలాగే విజయ్.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘వారసుడు’ మూవీలో నటించాడు. ధనుష్.. శేఖర్ కమ్ములతోనూ జట్టు కడుతున్న సంగతి తెలిసిందే. ఇంకా కొందరు తమిళ హీరోలు తెలుగు దర్శకుల వైపు చూస్తున్నారు. ఇందులో కోలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడైన సూర్య కూడా ఉన్నట్లు తాజా సమాచారం. తెలుగులో సూర్యకు ఎంత మంచి ఫాలోయింగ్ ఉండేదో తెలిసిందే. రజినీకాంత్, కమల్ హాసన్ల తర్వాత అంత ఫాలోయింగ్ సంపాదించింది సూర్యనే.
ఐతే గత కొన్నేళ్లలో సూర్య సరైన సినిమాలు అందించకపోవడం వల్ల తెలుగులో మార్కెట్, క్రేజ్ పడిపోయింది. అయినప్పటికీ అతడిని అభిమానించే వాళ్లు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. వారిని మెప్పించడంతో పాటు తమిళంలోనూ మంచి విజయం అందుకునే దిశగా ఒక పాన్ ఇండియా సినిమా చేయాలని సూర్య నిర్ణయించుకున్నాడట.
ఇందుకోసం అతను ‘కార్తికేయ-2’ దర్శకుడు చందూ మొండేటితో చేతులు కలుపుతున్నట్లు సమాచారం. చందూ ‘కార్తికేయ-2’లో పాన్ ఇండియా స్థాయిలో ఘనవిజయాన్నందుకున్నాడు. సరైన స్టార్ పడితే అతడి తర్వాతి చిత్రం వేరే లెవెల్కు వెళ్తుందనడంలో సందేహం లేదు. అందుకే అతను సూర్యకు ఒక కథ చెప్పి ఒప్పించినట్లు సమాచారం. మొదట్నుంచి సైన్స్ ఫిక్షన్ టచ్ ఉన్న ఫాంటసీ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు చందూ. సూర్యకు కూడా ఈ తరహా సినిమాలంటే ప్రత్యేక ఆసక్తి ఉంది. వీరి కలయికలో ఈ జానర్లో మంచి సినిమా పడితే ప్రేక్షకులకు పండగే.
This post was last modified on April 17, 2023 6:15 pm
బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…
వరుస ఫ్లాపుల కారణంగా గత కొన్నేళ్లలో మాస్ రాజా రవితేజ ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ బాగా దెబ్బ తిన్న మాట…
అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. నేషనల్ హాలిడే. ఆ మహానుభావుడిని ఎందరు గుర్తు చేసుకుంటారో కానీ సెలవు…
సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ‘80ల ట్రెండ్’ సందడి చేస్తోంది. సాధారణ ఫొటోలను కృత్రిమ మేధ సాయంతో 1980ల నాటి దుస్తులు,…
చాట్జీపీటీ, జెమినీ, క్లాడ్ లాంటి AI సేవల వెనుక భారీ డేటా సెంటర్లు, ఖరీదైన చిప్స్, విద్యుత్ అవసరం ఉంటుంది.…
నాలాంటి వాళ్ళే కాక్రోచ్ అవుతున్నారంటూ వైసీపీ అధినేత జగన్ చెప్పిన ఈ మాట నెట్టింట తెగ వైరల్ అవుతుంది. నీట్…