Movie News

పవన్ నిర్ణయాల వెనుక త్రివిక్రమ్ దర్శకత్వం

వివిధ దశల్లో నాలుగు సినిమాలు సెట్లలో పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉండగానే పవన్ కళ్యాణ్ కొత్త సినిమాల తాలూకు ప్రకటనలు ఒకరకంగా అభిమానులను కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. వినోదయ సితం రీమేక్ పూర్తయ్యింది. ఓజిని ముంబైలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశారు. ఉస్తాద్ భగత్ సింగ్ ఒక షెడ్యూల్ పూర్తయ్యింది. హరిహర వీరమల్లు బ్యాలన్స్ ఈ నెలలోనే మొదలవుతుంది. ఇవన్నీ రిలీజ్ అయ్యేలోగా ఎలాగూ ఎన్నికలు వచ్చేస్తాయి కాబట్టి పవన్ జనసేనలో బిజీ అయిపోతారని ఫ్యాన్స్ ఆల్రెడీ ఫిక్స్ అయ్యారు. కానీ పిక్చర్ అభీ బాకీహై తరహాలో ఇప్పుడో కొత్త ట్విస్టు వచ్చి పడింది.

అసలు ఫామ్ లో లేని సుధీర్ వర్మ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ మరో ప్రాజెక్ట్ ఖరారు చేశారనే వార్త బలంగా తిరుగుతోంది. సితార ఎంటర్ టైన్మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తాయట. అయితే సుధీర్ వర్మ హ్యాట్రిక్ ఫ్లాపుల్లో ఉన్నాడు. రణరంగం, శాకినీ డాకిని, రావణాసుర వరసగా దెబ్బ కొట్టాయి. అయినా సరే పవన్ ఎస్ చెప్పడానికి కారణం త్రివిక్రమేనని ఇన్ సైడ్ టాక్. కథ స్క్రీన్ ప్లే మాటలు తాను సమకూరుస్తాననే మాట మీద ఇది పట్టాలు ఎక్కేందుకు రూట్ క్లియర్ అయ్యిందట. సుధీర్ వర్మ టేకింగ్ పరంగా కంప్లయింట్స్ లేవు కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నారట.

అన్నీ ఆలోచించే టైం లేదు కాబట్టే పవన్ ఆ బాధ్యత మొత్తం త్రివిక్రమ్ మీద పెట్టినందు వల్లే ఇలా ఒక్కొక్కటి సెట్ అవుతున్నాయని మెగా కాంపౌండ్ న్యూస్. ఈ లెక్కల 2024 వేసవిలోగా పవన్ కళ్యాణ్ సినిమాలు మొత్తం అయిదు విడుదలైనా ఆశ్చర్యం లేదు. మరో ట్విస్ట్ ఏంటంటే సుధీర్ వర్మ సినిమాలో ఓ యూత్ హీరోకి స్కోప్ ఉందని అది వైష్ణవ్ తేజ్ తో చేయించే ఆలోచన ఉందనే టాక్ కూడా బలంగా వినిపిస్తోంది. మొత్తానికి కాంబోలు గట్రా పర్ఫెక్ట్ గానే సెట్ అవుతున్నాయి కానీ పవన్ ఇప్పుడు రాజకీయాల కంటే సినిమాల గురించే సీరియస్ గా ఆలోచిస్తున్నట్టు కనిపిస్తోంది.

This post was last modified on April 16, 2023 2:57 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

క్రికెట్ మ్యాచ్ గురించి ఎందుకు జగన్?

ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టిన మాజీ సీఎం జగన్…తాపీగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. బడ్జెట్ లో…

33 seconds ago

రక్తపాతం కోరుకుంటున్న విశ్వక్

ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…

32 minutes ago

సాక్షిపై రఘురామ దావా… అమరావతి రైతులకు కోటి

వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…

1 hour ago

వారణాసికి అన్నీ పక్కా ప్లానింగ్

రాజమౌళి సినిమాలంటే చెప్పిన డేటుకి రావు అని ప్రేక్షకులు ముందే బలంగా ఫిక్సయిపోయి ఉంటారు. ఆయన చివరి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’…

2 hours ago

ఫస్ట్ టైమ్.. అసెంబ్లీలో చే’నేత’ స్టాళ్లు

ఏపీ అసెంబ్లీ స‌మావేశాల్లో ప‌లు ఆసక్తిక‌ర ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ స‌మావేశాల‌కు విద్యార్థుల‌ను అనుమ‌తిస్తున్నారు. స‌మావేశాల‌ను వారు ప్ర‌త్య‌క్షంగా…

2 hours ago

ఈసారి డీఎస్సీలో వారిపైనే ప్రత్యేక దృష్టి?

ఏపీలో ఉపాధ్యాయ ఉద్యోగార్ధులకు మంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే మరో డీఎస్సీ వేస్తామని ప్రకటించారు. దీంతో…

3 hours ago