అక్కినేని నాగచైతన్య కెరీర్ ఆరంభం నుంచి కూడా ఒడుదొడుకులతోనే సాగుతోంది. ‘జోష్’ లాంటి ఫ్లాప్ మూవీతో కెరీర్ను ఆరంభించిన అతను.. ఆ తర్వాత ‘ఏమాయ చేసావె’తో హిట్టు కొట్టాడు. కానీ మళ్లీ తడబడ్డాడు. ఒకట్రెండు పెద్ద హిట్లు కొట్టడం.. ఆ తర్వాత అదే స్థాయిలో డిజాస్టర్ ఖాతాలో వేసుకోవడం ఇదీ వరస. ముఖ్యంగా అతను ప్రేమకథలతో సక్సెస్లు సాధించి.. ఆ తర్వాత మాస్, యాక్షన్ టచ్ ఉన్న సినిమాలతో చేదు అనుభవాలు ఎదుర్కొంటున్నాడు. చివరగా అతను చేసిన ‘థాంక్యూ’ సినిమా తీవ్ర నిరాశకే గురి చేసింది.
త్వరలో అతను ‘కస్టడీ’ మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందా అని అక్కినేని అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సినిమాల సంగతి ఇలా ఉంటే.. చైతూ ‘దూత’ అనే వెబ్ సిరీస్ను రెండేళ్ల కిందటే మొదలుపెట్టిన సంగతి గుర్తుండే ఉంటుంది. దాని సంగతే ఏమీ తెలియట్లేదు.
‘థాంక్యూ’ సినిమా మేకింగ్ దశలో ఉండగా.. ‘దూత’కు మంచి బజ్యే కనిపించింది. ఈ సిరీస్ను రూపొందిస్తున్నది విక్రమ్ కుమార్ కావడం.. అప్పటికే చైతూ, ఆయన కలయికలో మనం సినిమా వచ్చి ఉండటం.. దూత అనే టైటిల్, దీనికి సంబంధించి ఇంతకుముందు రిలీజ్ చేసిన ప్రోమో కూడా బాగుండటంతో బజ్ బాగానే కనిపించింది. ఈ సిరీస్ను గత ఏడాదే రిలీజ్ చేస్తాం అన్నారు. కానీ ఏమైందో ఏమో.. తర్వాత అతీ గతీ లేదు. గత ఏడాది ఈ సమయానికే ‘దూత’ మేకింగ్ చివరి దశలో ఉందన్నారు. కానీ ఇప్పటికీ రిలీజ్ కాలేదు. రిలీజ్ సంగతి పక్కన పెడితే.. దీని గురించి ఎవరూ మాట్లాడట్లేదు.
అమేజాన్ ప్రైమ్ వాళ్లు ఒక డెడ్ లైన్ పెట్టి ఒరిజినల్స్ పూర్తి చేయిస్తుంటారు. కానీ ఈ సిరీస్ విషయంలో వాళ్లెందుకు సైలెంటుగా ఉన్నారో తెలియట్లేదు. ఇలా ఆలస్యం అయ్యే ఏ సినిమా అయినా, సిరీస్ అయినా ప్రేక్షకుల్లో ఆసక్తిని తగ్గించేస్తుంది. కాబట్టి వీలైనంత త్వరగా ‘దూత’ను ప్రేక్షకుల ముందుకు తెస్తే బెటర్.
This post was last modified on April 15, 2023 5:55 pm
సరిగ్గా వారం రోజుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేస్తాడు. థియేటర్ యజమానులు ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నారు. కేవలం…
ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు…
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…