భారతీయ ప్రేక్షకులను ఒక ఊపు ఊపేసిన మాస్ సినిమాల్లో కేజీఎఫ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. భాష, ప్రాంత భేదం లేకుండా దేశవ్యాప్తంగా అందరు ప్రేక్షకులకూ ఈ సినిమా తెగ నచ్చేసింది. కేజీఎఫ్-1, 2 రెండూ కూడా డివైడ్ టాక్ను తట్టుకుని తిరుగులేని బ్లాక్బస్టర్లు అయ్యాయి.
గత ఏడాది ఇదే సమయంలో రిలీజైన కేజీఎఫ్-2 ఏకంగా రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టి ఔరా అనిపించింది. ఈ సినిమా చివర్లో కేజీఎఫ్-3 గురించి హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాకపోతే ఆ తర్వాత దీని గురించి ఎలాంటి చర్చ లేదు. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం సలార్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ సినిమా చేయాల్సి ఉంది. సలార్-2కు సీక్వెల్ కూడా వస్తుందని వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్తోనే మరో సినిమా కూడా ఉంటుందంటున్నారు.
ఇన్ని సినిమాల మధ్య కేజీఎఫ్-3 అసలుంటుందా అన్న సందేహాలు జనాల్లో ఉన్నాయి. కానీ ఈ సందేహాలకు కేజీఎఫ్ నిర్మాణ సంస్థ హోంబలె ఫిలిమ్స్ చెక్ పెట్టింది. కేజీఎఫ్-3 కచ్చితంగా ఉంటుందని తెలియజేస్తూ.. ఈ సినిమా కథ విషయంలోనూ ఒక హింట్ ఇచ్చింది. కేజీఎఫ్-2 వార్షికోత్సవం నేపథ్యంలో హోంబలె ఫిలిమ్స్ ట్విట్టర్లో ఒక స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది.
రాకీ భాయ్ 1978 నుంచి 1981 వరకు ఎక్కడ ఉన్నాడు అని అందులో ప్రశ్న లేవనెత్తింది. ఇది కేజీఎఫ్-3 కథకు సంబంధించిన హింట్ అని భావిస్తున్నారు. ప్రశాంత్ ఎప్పుడు సినిమా చేస్తాడో కానీ.. ఆ మూడేళ్లలో రాకీ ఏం చేశాడు అనే నేపథ్యంలోనే ఈ సినిమాను నడిపిస్తాడన్నది స్పష్టం. కేజీఎఫ్-2లో బంగారంతో పాటే రాకీ సముద్రంలో మునిగిపోతున్నట్లు చూపిస్తారు. కానీ అక్కడి నుంచి తప్పించుకున్నాక రాకీ జర్నీని చాప్టర్-3లో చూపిస్తారన్నమాట.
This post was last modified on April 14, 2023 4:26 pm
ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్లో ఎదురుదెబ్బ తగిలినా, సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) రెండో మ్యాచ్లోనే అద్భుతంగా పుంజుకుంది. కోల్కతాలోని…
టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…
అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…
తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు రేణుకా చౌదరి.. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే…
మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…
ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…