అల్లరితో దర్శకుడిగా ప్రయాణాన్ని విభిన్నంగా మొదలుపెట్టిన రవిబాబు ఈ మధ్య కనిపించడం బాగా తగ్గిపోయింది. తండ్రి చలపతిరావు మరణం తర్వాత కొంత గ్యాప్ తీసుకుని మళ్ళీ దర్శనమిస్తున్నాడు. ఇటీవలే పెయిడ్ ఓటిటిలో దిగిన ఈటీవీ విన్ నిర్మించిన అసలుతో మళ్ళీ పూర్తి స్థాయి పాత్రలో కనిపించాడు. అయితే ఈసారి కేవలం నటనకే పరిమితమై కథ, మాటలు, నిర్మాణం, పర్యవేక్షణ బాధ్యత తీసుకుని డైరెక్షన్ ఉదయ్-సురేష్ లకు అప్పగించాడు. ఇది ఈ రోజు నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ట్రైలర్ కొంత ఆసక్తికరంగా అనిపించడంతో ఓమాదిరి బజ్ వచ్చింది.
ఫారెన్సిక్ ప్రొఫెసర్ చక్రవర్తి(సూర్య) ఆన్ లైన్ క్లాసులు చెబుతుండగా జూమ్ కెమెరాల సాక్షిగా హత్య చేయబడతాడు. కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి రంగంలోకి దిగిన సిఐడి ఆఫీసర్ రంజిత్ రావు(రవిబాబు) నలుగురు అనుమానితులను తీసుకుని విచారిస్తాడు. చక్రవర్తి దగ్గరే అసిస్టెంట్ పని చేసిన వందన(పూర్ణ) తండ్రి లాంటి వ్యక్తి పోయినందుకు తల్లడిల్లుతుంది. అయితే విచారణ కొనసాగే కొద్దీ విస్తుపోయే నిజాలు బయటపడతాయి. చంపిన వాడి తాలూకు క్లూస్ దొరక్క ఇబ్బందిపడుతున్న టైంలో వందన గుంటూరు వెళ్ళడంతో కథ మలుపు తిరుగుతుంది. అదే అసలు సస్పెన్స్.
గంట నలభై రెండు నిమిషాల నిడివితో పాటలు లేకుండా వీలైనంత సాగతీత రాకుండా రవిబాబు జాగ్రత్త పడ్డాడు. ఇతనే ఇందులో హీరో. చివరి దాకా క్రైమ్ ఎలిమెంట్ ని బాగానే మైంటైన్ చేశారు. కొన్ని లాజిక్స్ నమ్మశక్యంగా లేనప్పటికీ ఓవరాల్ గా కథనంతో పర్వాలేదనిపించారు. మెయిన్ ప్లాట్ తాలూకు నేపధ్యాన్ని, ఫ్లాష్ బ్యాక్ ని ఇంకాస్త బలంగా రాసుకుని ఉంటే బాగుండేది. ఇలాంటి సబ్జెక్టులతో గతంలోనూ చాలానే వచ్చాయి కాబట్టి మరీ ఎక్కువ అంచనాలు పెట్టేసుకోకుండా చిన్న మూవీ కాబట్టి లాగించేయొచ్చు. రెండో భాగంకి అవసరమైన ట్విస్టు చివర్లో వదిలారు.
This post was last modified on April 13, 2023 4:01 pm
థియేటర్లకు సరైన సినిమాలు వస్తే రావడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. ఎటొచ్చి వాళ్ళను కనీస స్థాయిలో మెప్పించే కంటెంట్ ఉన్నవి…
తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలకు పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డిలు..…
వంటగ్యాస్ కొరత కారణంగా దేశవ్యాప్తంగా చిన్న హోటళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. హోటళ్లకు సరఫరా అయ్యే కమర్షియల్ సిలిండర్ల పంపిణీని…
రాష్ట్రంలోని పలు మున్సిపల్ సంస్థల్లో పాలకవర్గాల గడువు ముగియడంతో అక్కడ స్పెషల్ ఆఫీసర్ల పాలన అమల్లోకి రానుంది. మున్సిపల్ కార్పొరేషన్లు,…
టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున వరుసగా తమిళ నటులు, టెక్నీషియన్లతో పని చేస్తున్నాడు. గత ఏడాది ధనుష్తో కలిసి…
అక్కడెక్కడో ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికాలు యుద్దం చేసుకుంటే.. వారికి వేలాది కిలోమీటర్ల ఇవతల ఉన్న బెంగళూరులోని టిఫిన్ సెంటర్లు..…