అల్లరితో దర్శకుడిగా ప్రయాణాన్ని విభిన్నంగా మొదలుపెట్టిన రవిబాబు ఈ మధ్య కనిపించడం బాగా తగ్గిపోయింది. తండ్రి చలపతిరావు మరణం తర్వాత కొంత గ్యాప్ తీసుకుని మళ్ళీ దర్శనమిస్తున్నాడు. ఇటీవలే పెయిడ్ ఓటిటిలో దిగిన ఈటీవీ విన్ నిర్మించిన అసలుతో మళ్ళీ పూర్తి స్థాయి పాత్రలో కనిపించాడు. అయితే ఈసారి కేవలం నటనకే పరిమితమై కథ, మాటలు, నిర్మాణం, పర్యవేక్షణ బాధ్యత తీసుకుని డైరెక్షన్ ఉదయ్-సురేష్ లకు అప్పగించాడు. ఇది ఈ రోజు నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ట్రైలర్ కొంత ఆసక్తికరంగా అనిపించడంతో ఓమాదిరి బజ్ వచ్చింది.
ఫారెన్సిక్ ప్రొఫెసర్ చక్రవర్తి(సూర్య) ఆన్ లైన్ క్లాసులు చెబుతుండగా జూమ్ కెమెరాల సాక్షిగా హత్య చేయబడతాడు. కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి రంగంలోకి దిగిన సిఐడి ఆఫీసర్ రంజిత్ రావు(రవిబాబు) నలుగురు అనుమానితులను తీసుకుని విచారిస్తాడు. చక్రవర్తి దగ్గరే అసిస్టెంట్ పని చేసిన వందన(పూర్ణ) తండ్రి లాంటి వ్యక్తి పోయినందుకు తల్లడిల్లుతుంది. అయితే విచారణ కొనసాగే కొద్దీ విస్తుపోయే నిజాలు బయటపడతాయి. చంపిన వాడి తాలూకు క్లూస్ దొరక్క ఇబ్బందిపడుతున్న టైంలో వందన గుంటూరు వెళ్ళడంతో కథ మలుపు తిరుగుతుంది. అదే అసలు సస్పెన్స్.
గంట నలభై రెండు నిమిషాల నిడివితో పాటలు లేకుండా వీలైనంత సాగతీత రాకుండా రవిబాబు జాగ్రత్త పడ్డాడు. ఇతనే ఇందులో హీరో. చివరి దాకా క్రైమ్ ఎలిమెంట్ ని బాగానే మైంటైన్ చేశారు. కొన్ని లాజిక్స్ నమ్మశక్యంగా లేనప్పటికీ ఓవరాల్ గా కథనంతో పర్వాలేదనిపించారు. మెయిన్ ప్లాట్ తాలూకు నేపధ్యాన్ని, ఫ్లాష్ బ్యాక్ ని ఇంకాస్త బలంగా రాసుకుని ఉంటే బాగుండేది. ఇలాంటి సబ్జెక్టులతో గతంలోనూ చాలానే వచ్చాయి కాబట్టి మరీ ఎక్కువ అంచనాలు పెట్టేసుకోకుండా చిన్న మూవీ కాబట్టి లాగించేయొచ్చు. రెండో భాగంకి అవసరమైన ట్విస్టు చివర్లో వదిలారు.
This post was last modified on April 13, 2023 4:01 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…