అల్లరితో దర్శకుడిగా ప్రయాణాన్ని విభిన్నంగా మొదలుపెట్టిన రవిబాబు ఈ మధ్య కనిపించడం బాగా తగ్గిపోయింది. తండ్రి చలపతిరావు మరణం తర్వాత కొంత గ్యాప్ తీసుకుని మళ్ళీ దర్శనమిస్తున్నాడు. ఇటీవలే పెయిడ్ ఓటిటిలో దిగిన ఈటీవీ విన్ నిర్మించిన అసలుతో మళ్ళీ పూర్తి స్థాయి పాత్రలో కనిపించాడు. అయితే ఈసారి కేవలం నటనకే పరిమితమై కథ, మాటలు, నిర్మాణం, పర్యవేక్షణ బాధ్యత తీసుకుని డైరెక్షన్ ఉదయ్-సురేష్ లకు అప్పగించాడు. ఇది ఈ రోజు నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ట్రైలర్ కొంత ఆసక్తికరంగా అనిపించడంతో ఓమాదిరి బజ్ వచ్చింది.
ఫారెన్సిక్ ప్రొఫెసర్ చక్రవర్తి(సూర్య) ఆన్ లైన్ క్లాసులు చెబుతుండగా జూమ్ కెమెరాల సాక్షిగా హత్య చేయబడతాడు. కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి రంగంలోకి దిగిన సిఐడి ఆఫీసర్ రంజిత్ రావు(రవిబాబు) నలుగురు అనుమానితులను తీసుకుని విచారిస్తాడు. చక్రవర్తి దగ్గరే అసిస్టెంట్ పని చేసిన వందన(పూర్ణ) తండ్రి లాంటి వ్యక్తి పోయినందుకు తల్లడిల్లుతుంది. అయితే విచారణ కొనసాగే కొద్దీ విస్తుపోయే నిజాలు బయటపడతాయి. చంపిన వాడి తాలూకు క్లూస్ దొరక్క ఇబ్బందిపడుతున్న టైంలో వందన గుంటూరు వెళ్ళడంతో కథ మలుపు తిరుగుతుంది. అదే అసలు సస్పెన్స్.
గంట నలభై రెండు నిమిషాల నిడివితో పాటలు లేకుండా వీలైనంత సాగతీత రాకుండా రవిబాబు జాగ్రత్త పడ్డాడు. ఇతనే ఇందులో హీరో. చివరి దాకా క్రైమ్ ఎలిమెంట్ ని బాగానే మైంటైన్ చేశారు. కొన్ని లాజిక్స్ నమ్మశక్యంగా లేనప్పటికీ ఓవరాల్ గా కథనంతో పర్వాలేదనిపించారు. మెయిన్ ప్లాట్ తాలూకు నేపధ్యాన్ని, ఫ్లాష్ బ్యాక్ ని ఇంకాస్త బలంగా రాసుకుని ఉంటే బాగుండేది. ఇలాంటి సబ్జెక్టులతో గతంలోనూ చాలానే వచ్చాయి కాబట్టి మరీ ఎక్కువ అంచనాలు పెట్టేసుకోకుండా చిన్న మూవీ కాబట్టి లాగించేయొచ్చు. రెండో భాగంకి అవసరమైన ట్విస్టు చివర్లో వదిలారు.
This post was last modified on April 13, 2023 4:01 pm
మొన్న ఏడాది వచ్చిన వరుణ్ తేజ్ 'మట్కా'ని సామాన్య ప్రేక్షకులు మర్చిపోయి ఉండొచ్చు కానీ అభిమానులకు మాత్రం పీడకలలా నిలిచిపోయింది.…
నిన్న కీలకమైన వీకెండ్ పూర్తయ్యింది. శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీ, పాపం ప్రతాప్ ఆశలన్నీ సండే మీద పెట్టుకుని ప్రమోషన్లు…
సమ్మర్ సీజన్ లో ఏప్రిల్ చివరి వారం సినిమాలకు చాలా మంచి టైం. వేసవి పీక్స్ లో ఉండటంతో పాటు…
గంధపు చెక్కల స్మగ్లర్గా.. దేశవ్యాప్తంగా ఒకప్పుడు సంచలనం రేపిన వీరప్పన్ గురించి అందరికీ తెలిసిందే. కర్ణాటక నుంచి తమిళనాడు వరకు…
ఎన్నికల రాజకీయాల్లో ఆరితేరిన ప్రధాని నరేంద్ర మోడీ.. సమయం.. సందర్భంతోపాటు సెంటిమెంటుకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. సాధారణ ప్రజలకు అత్యంతచేరువ…
రెండేళ్ల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సూపర్ 6 పేరిట ఇచ్చిన హామీలు బాగా…