విశాఖ సింగ్ గుర్తుందా? ప్రస్తుతం దర్శకుడిగా మారి తొలి ప్రేమ, మిస్టర్ మజ్ను, రంగ్ దె, సర్ సినిమాలు తీసిన వెంకీ అట్లూరి కథానాయకుడిగా నటించిన ‘జ్ఞాపకం’ అనే సినిమాలో ఈ అమ్మాయే కథానాయిక. దాంతో పాటుగా నారా రోహిత్ సినిమా ‘రౌడీ ఫెలో’లోనూ ఆమె హీరోయిన్గా చేసింది. అందం, అభినయం రెండూ ఉన్నప్పటికీ తెలుగులో చేసిన సినిమాలు అంతగా వర్కవుట్ కాకపోవడంతో ఆమె కనుమరుగైపోయింది.
ఐతే తమిళంలో మాత్రం విశాఖకు కొన్ని మంచి సినిమాలు పడ్డాయి. అక్కడ ఆమెకు బాగానే పాపులారిటీ ఉంది. కథానాయికగా నటిస్తూనే బిజినెస్లోకి కూడా అడుగు పెట్టిన విశాఖ.. ఈ మధ్య తమిళంలో కూడా పెద్దగా సినిమాలు చేయట్లేదు. కొంత కాలంగా లైమ్ లైట్లో లేకుండా పోయిన విశాఖ.. తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుతో తన ఫాలోవర్లు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.
ఈ పోస్టులో షేర్ చేసిన ఫొటోలో విశాఖ ఆసుపత్రి బెడ్ మీద పేషెంట్గా కనిపించడం గమనార్హం. ఇదేమీ సినిమా కోసం తీసుకున్న స్టిల్ కాదు. రియల్ లైఫ్దే. విశాఖ సింగ్కు ఏ సమస్య అన్నది వెల్లడించలేదు కానీ.. తాను అనారోగ్యం బారిన పడి కోలుకుంటున్నట్లు ఆమె వెల్లడించింది. కొన్ని భయంకరమైన ఘటనలు, ప్రమాదాలు, చలికాలంలో అనారోగ్య సమస్యలు తనను వేధిస్తున్నాయని.. ఐతే తనకు ఎంతో నచ్చే వేసవి సీజన్ రావడం చాలా సంతోషంగా ఉందని ఆమె పేర్కొంది. ఏప్రిల్ వచ్చిందంటే తనకు కొత్త ఏడాది మొదలైనట్లు అనిపిస్తుందని.. ఈ నెలలోనే తాను పుట్టడం వల్ల కూడా ఈ ఫీలింగ్ కలగొచ్చని చెప్పింది.
ఎన్ని అడ్డంకులు ఎదురైనా తాను దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నానని విశాఖ పేర్కొంది. విశాఖ మాటల్ని బట్టి చూస్తే ఆమెకు చలికాలం పడదని, ఆ సమయంలో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని అర్థమవుతోంది. విశాఖ పోస్టు చూసిన నెటిజన్లు ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…