2000 సంవత్సరానికి అటు ఇటు తెలుగు, తమిళ సినిమాలను బాగా ఫాలో అయిన వాళ్లు సిమ్రాన్ను అంత సులువుగా మరిచిపోలేరు. తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు.. తమిళంలో కమల్ హాసన్, విజయ్, అజిత్.. ఇలా ఎంతోమంది టాప్ స్టార్లతో సినిమాలు చేసి.. తిరుగులేని స్టార్ స్టేటస్ సంపాదించింది ఈ పంజాబీ భామ.
హీరోయిన్గా అవకాశాలు తగ్గుతున్న దశలో దీపక్ బగ్గా అనే వ్యాపారవేత్తను పెళ్లాడి కొంత కాలం సినిమాలకు దూరం అయిపోయిన ఆమె.. ఆపై క్యారెక్టర్ రోల్స్లోకి మారిపోయింది. కొన్ని చిత్రాల్లో లీడ్ రోల్స్ కూడా చేసింది. సెకండ్ ఇన్నింగ్స్లో నటిగా మంచి పేరు సంపాదించిన ఆమె.. ఇప్పుడు కూడా కోలీవుడ్లో కొంచెం బిజీగానే ఉంది. ఇప్పుడు సిమ్రాన్ తన కొడుకును హీరోగా పరిచయం చేసే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం.
2003లో దీపక్ను పెళ్లాడిన కొంత కాలానికే కొడుకును కంది సిమ్రాన్. ఆ కొడుకు ఇప్పుడు టీనేజీ చివరి దశలో ఉన్నాడు. తన పేరు.. అదీప్. సిమ్రాన్ కొడుకు ఫొటోలు ఇంత కాలం సోషల్ మీడియాలోకి కూడా రాలేదు. ఐతే ఇప్పుడు అతడి ఫొటో ఒకటి వైరల్ అవుతోంది. చూడగానే హీరోలా ఉన్నాడే అనిపించేలా ఉంది తన లుక్. టీనేజీ ఛాయలు ఇంకా పోలేదు కానీ.. ఒకట్రెండేళ్లు ఆగితే ఇంకా మంచి లుక్లోకి వస్తాడనడంలో సందేహం లేదు.
సిమ్రాన్తో పాటు ఆమె భర్త కూడా పొడగరులు కావడంతో అదీప్ కూడా ఆజానుబాహువులాగే కనిపిస్తున్నాడు. తన కొడుకును హీరోను చేయడానికి సిమ్రాన్ సన్నాహాల్లో ఉన్నట్లు సమాచారం. ఇందుకే తన ఫొటోను సోషల్ మీడియాలో రిలీజ్ చేసి జనాల రెస్పాన్స్ చూస్తున్నట్లు కనిపిస్తోంది. తమిళంలోనే సిమ్రాన్కు ఎక్కువ ఫాలోయింగ్ ఉంది కాబట్టి అక్కడే తన కొడుకును హీరోగా చేసే అవకాశముంది.
This post was last modified on April 13, 2023 3:06 pm
సీఎం జగన్పై ఆయన సోదరి షర్మిల.. ఎన్నికల ప్రచారాల్లో సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. హీటెక్కించిన విషయం తెలిసిందే. అన్నను టార్గెట్…
గన్నవరం నియోజకవర్గంలో చంద్రబాబు తాజాగా ఎన్నికల ప్రచారం చేశారు. అయితే.. ఆయన నియోజకవర్గంలోకి అడుగు పెట్టేసరికి.. భారీ ఎత్తున వర్షం…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ కూటమికి ఓ ప్రధాన ఆయుధం దొరికింది. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఈ విషయాన్నే…
మీడియా ముందే నాయకులు వలవలా ఏడ్చేయడం కొత్త కాదు. గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా.. తన సతీమణిని దూషించారంటూ..…
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమరం హోరాహోరీగా సాగుతోంది. మే 13న జరిగే పోలింగ్తో పార్టీల రాజకీయ జీవితాలు ముడిపడి ఉన్నాయి. అధికారం…
ఏపీలో ఉద్యోగులు గతంలో ఎన్నడూ లేని విధంగా ఓటెత్తారు. మొత్తం లక్షల సంఖ్యలో ఉన్న ఉద్యోగులు.. ఏకంగా 4.32 లక్షల…