విశ్వక్ సేన్ బోలెడు నమ్మకం పెట్టుకుని చాలా కష్టపడి దర్శకత్వం వహించి నటించిన దాస్ కా ధమ్కీ నెల తిరక్కుండానే ఓటిటిలో వస్తున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 14 అంటే రేపటి నుంచే ఆహాలో హ్యాపీగా చూసేయొచ్చు. బ్రేక్ ఈవెన్ అయ్యింది లాభాలొచ్చాయని చెప్పుకున్నారు కానీ లోగుట్టు పెరుమాళ్ళకెరుక అన్నట్టు అసలు నిజం రహస్యంగా మిగిలిపోయింది. ఇప్పుడీ సినిమాని హిందీలో థియేట్రికల్ రిలీజ్ చేయిస్తున్నాడీ కుర్ర హీరో. అదేంటి ఒక భాషలో డిజిటల్ లో వచ్చే రోజే నార్త్ సైడ్ హాళ్లలో వదలడం ఏమిటనే సందేహం వచ్చినా సమాధానం దొరకడం కష్టమే.
బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ మూవీ ఏదీ లేకపోవడంతో ఆ అవకాశాన్ని వాడుకునేందుకు విశ్వక్ ప్లాన్ చేసుకున్నాడు. కానీ ఓటిటి ప్రపంచంలో ఫలానా బాష రాకపోయినా సరే సబ్ టైటిల్స్ తో ఉచితంగా ఇంట్లోనే చూసే ప్రేక్షకులు కోట్లలో ఉన్నారు. అలాంటిది ఇప్పుడిలా చేయడం ఖచ్చితంగా రిస్కే. పోనీ రికార్డులు తిరగేసిన బ్లాక్ బస్టర్ అయితే ఏమోలే అనుకోవచ్చు. కానీ అలా జరగలేదుగా. ప్రస్తుతం హిందీ వెర్షన్ తాలూకు ట్రైలర్ రిలీజ్, ప్రమోషన్లు అన్నీ జరుగుతున్నాయి కానీ ఉత్తరాది జనాలు అంతగా పట్టించుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు.
ఏది ఏమైనా చిన్నా పెద్దా సంబంధం లేకుండా ఒకవేళ ప్యాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేసుకుంటే మాత్రం ఒకే డేట్ కి వచ్చేలా నిర్మాతలు జాగ్రత్త పడటం మంచిది. లేదంటే కనీసం పబ్లిసిటీ ఖర్చులు కూడా కిట్టుబాటు కావు. దీనికి సరైన ప్రణాళిక అవసరం. ఆ మధ్య కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ వేదని ఇలాగే ఒకే రోజు ఓటిటి, థియేటర్ లో వదిలి చేటు చేసుకున్నారు. నష్టాలు తప్పలేదు. ఇప్పుడు చూస్తేనేమో దాస్ కా ధమ్కీకీ అదే రిపీట్ చేస్తున్నారు. సరే ఇక్కడి ఫలితం ఎలా ఉన్నా ఏదైనా అద్భుతం జరిగి హిందీలో ఆడుతుందేమోనని ఆశపడుతున్నారు ఫ్యాన్స్
This post was last modified on April 13, 2023 3:16 pm
ఏపీలో పోలింగ్ ప్రక్రియకు మరికొన్ని గంటల ముందు.. సంచలనం చోటు చేసుకుంది. కూటమి పార్టీల ముఖ్య నేత, టీడీపీ అధినేత…
ఏపీలో చిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. శనివారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగిసిపోవడంతో నాయకులు, పార్టీల అధినే తలు ఎక్కడికక్కడ సేద…
బెట్టింగ్లో రూ.2 కోట్లు పోగొట్టిన కుమారుడిని తండ్రి హతమార్చిన ఘటన మెదక్ జిల్లాలోని చిన్నశంకరంపేట మండలం బగిరాత్పల్లిలో చోటు చేసుకుంది.…
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల్లో యూత్లో పవన్కు ఉన్నది మామూలు క్రేజ్ కాదు. సినిమాల్లో సూపర్ స్టార్ ఇమేజ్ వల్ల…
ఆంధ్రప్రదేశ్లో గత పర్యాయం వైఎస్సార్ కాంగ్రెస్ 151 సీట్లతో ఘనవిజయం సాధించడంలో ఆ పార్టీకి వ్యూహకర్తగా పని చేసిన ప్రశాంత్…
దాదాపు 55 రోజుల పాటు అవిశ్రాంతంగా పార్లమెంటు ఎన్నికల ప్రచారం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పీసీసీచీఫ్ ఎనుముల రేవంత్…