ఏపీలో ప్రధాన పార్టీల మధ్య స్టిక్కర్ల యుద్ధం భీకరంగా సాగుతోంది. అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీల మధ్య స్టిక్కర్ల కార్యక్రమం కొత్త యుద్ధాన్ని తలిపిస్తోంది. వాస్తవానికి ఇంటింటికీ స్టిక్కర్లు అనే కార్యక్రమాన్ని మొదట ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డే మొదలుపెట్టారు. గడప గడపకు వైయస్సార్, మా నమ్మకం నువ్వే జగనన్న, మా భవిష్యత్ నువ్వే జగనన్న అనే నినాదాలతో గత కొంతకాలంగా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జిలు ఆయా నియోజకవర్గాల పరిధిలో విస్తృతంగా పర్యటించి స్టిక్కర్లు అంటిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని గత నెల 16వ తేదీ నుండి మరింత వేగవంతం చేశారు. గత ఏడాది మే 11వ తేదీ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంలోనే స్టిక్కర్ల కార్యక్రమాన్ని ప్రభుత్వం తెరమీదకు తెచ్చింది. వంద రోజులు కార్యక్రమాన్ని పూర్తిచేసుకున్న కొంత మంది నేతలు తమ నియోజకవర్గాల్లో ఇంటంటికీ వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలను వివరిస్తూ స్టిక్కర్లు అంటిస్తూ వస్తున్నారు.
దీనికి పోటీగా జనసేన కూడా హడావుడి లేకుండా స్టిక్కర్ల కార్యక్రమం ఒకటి మొదలుపెట్టింది. కాబోయే సీఎం పవన్ కల్యాణ్ అంటూ స్టిక్కర్ల కార్యక్రమాన్ని ప్రారంభించింది. తాజాగా తెలుగుదేశం కూడా సైకో పోవాలి .. సైకిల్ రావాలి.. మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలి అనే నినాదాలతో స్టిక్కర్లు తయారుచేసి ఇంటింటికీ అంటించే కార్యక్రమాన్ని మొదలు పెట్టింది.
దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన పార్టీల మధ్య స్టిక్కర్ల రాజకీయం ఊపందుకున్నట్లయింది. రాజకీయ రాజధాని బెజవాడలో టీడీపీ ఈకార్యక్రమాన్ని మరింత సవాల్గా తీసుకుంది. వైసీపీ అంటించిన స్టిక్కర్లకు పక్కనే టీడీపీ స్టిక్కర్ను కూడా అంటిస్తుండటంతో రాజకీయం మరింత వేడెక్కుతోంది.
ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రమవుతోందన్న నిఘా వర్గాల సమాచారంతో వైసీపీ ఎమ్మెల్యేలు రోజుకు 8 గంటలు ప్రజల్లోనే ఉండాలని ఆ పార్టీ పెద్దలు సూచిస్తున్నారు. పైకి చెప్పకపోయినా టీడీపీ కూడా ఇదే విధానం అమలు చేస్తోంది. ఎమ్మెల్యేలు, నియోజకవర్ నేతలు రోజుకు 10 గంటలు ప్రజల్లో ఉండాలని చంద్రబాబు నుంచి సూచనలు వెళ్లాయి ఇప్పటికే. అయితే.. వైసీపీ తరహాలో టీడీపీ, జనసేనలకు ప్రత్యేక కార్యక్రమాలేవీ పార్టీ అధిష్ఠానం నుంచి డిజైన్ కాకపోవడంతో స్థానిక నేతలు వైసీపీకి కౌంటరుగా స్టిక్కర్ల ప్రచారం చేస్తున్నారు. తమతమ నేతల ఫొటోలతో స్టిక్కర్లు తయారుచేయించి కాబోయే సీఎం అని వేస్తున్నారు.
తిరుగుబాట్లతో వైసీపీ తలకిందులవుతున్న నెల్లూరు జిల్లా, ఉభయ గోదావరి జిల్లాలలో జనసేన నేతలు ‘పవనే సీఎం’ అంటూ స్టిక్కర్లతో ప్రచారం చేస్తున్నారు. చాలా నియోజకవర్గాలలో టీడీపీ నేతలూ ఇలాంటి ప్రచారమే ఎత్తుకున్నారు. దీంతో ఏపీలో గోడలన్నీ మూడు పార్టీల స్కిక్లర్లతో కనిపిస్తున్నాయి.
This post was last modified on April 13, 2023 2:36 pm
దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల ఐదో దశ పోలింగ్ సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభం కానుంది. మొత్తం 6…
లోక్ సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే తెలంగాణలో ఉన్న 33 జిల్లాలను 17 జిల్లాలకు కుదిస్తారని వస్తున్న వార్తలు…
ఇండస్ట్రీలో సుదీర్ఘ అనుభవంతో ఎన్నో బ్లాక్ బస్టర్లు చూసిన డివివి దానయ్య సగటు మాములు ప్రేక్షకుడికి బాగా దగ్గరయ్యింది మాత్రం…
భారత దేశ చరిత్రలో ఇదోక అనూహ్యమైన.. అసహ్యించుకునే ఘటన. ఈ దేశాన్ని పాలించి, రైతుల మన్ననలు, మహిళల మన్ననలు పొందిన…
ఏపీ సీఎం జగన్.. నీరో చక్రవర్తిని తలపిస్తున్నారంటూ.. సీబీఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ సంచ లన వ్యాఖ్యలు చేశారు.…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో అత్యంత దురదృష్టకరమైన జట్టు పేరు చెప్పమని అడిగితే…ఠపీమని ఆర్సీబీ పేరు చెప్పేస్తారు క్రికెట్…