సమంతను శకుంతలదేవి గా చూపిస్తూ గుణ శేఖర్ తీసిన ‘శాకుంతలం’ సినిమా ఏప్రిల్ 14న గ్రాండ్ గా పాన్ ఇండియా మూవీగా రిలీజవుతుంది. ఈ సినిమా కోసం సమంత తన ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా ప్రమోషన్స్ లో పాల్గొంది. ముంబై , కొచ్చి ఇలా అన్నీ ప్రెస్ మీట్స్ కి హాజరైంది. ముఖ్యంగా ఎల్ బీ స్టేడియం ఈవెంట్ కి ఆమెను టీం వద్దని చెప్పినా వినకుండా ప్రమోషన్ కోసం అక్కడికి కూడా వెళ్ళింది. దీంతో సామ్ ఇప్పుడు అనారోగ్యంతో ఇబ్బంది పడుతుంది.
వరుస టూర్లు , ప్రమోషన్స్ , మీడియా ఇంట్రాక్షన్స్ ఇలా అన్నిటిలో పాల్గొన్నాక సమంత కి తీవ్ర జ్వరం వచ్చింది. ముఖ్యంగా దగ్గుతో పెద్దగా మాట్లాడలేకపోతుందని తెలుస్తుంది. తాజాగా జరిగిన తెలుగు ప్రెస్ మీట్ లో కూడా సామ్ మధ్యలో దగ్గుతోనే ఉంది. ఇక ఈరోజు డిల్లీలో బీజేపీ నాయకుల కోసం శాకుంతలం ప్రీమియర్ షో వేస్తున్నారు. అక్కడికి సామ్ వెళ్లాల్సి ఉంది కానీ ఆరోగ్యం బాగలేకపోవడంతో వెళ్లలేకపోయింది.
తాజాగా తన ఆరోగ్యం బాలేదని , ఫీవర్ తో మాట్లాడలేకపోతున్నాని అందుకే శాకుంతలం మిగతా ప్రమోషన్స్ కి అటెండ్ అవ్వలేకపోతున్నాని సామ్ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు చెప్పుకుంది. దీంతో అభిమానులు సినిమా కంటే ఆరోగ్యం ముఖ్యమని సమంత కి చెప్తూ రెస్ట్ తీసుకోమని రిప్లైలు పెడుతున్నారు. శాకుంతలం సక్సెస్ సమంతకి చాలా ఇంపార్టెంట్. ఈ సినిమా హిట్టయితే సమంతతో ఈ తరహా కథలు తీసేందుకు ఇంకొందరు దర్శక నిర్మాతలు ముందుకొస్తారు. మరి శాకుంతలంతో సమంత ఎలాంటి హిట్ కొడుతుందో చూడాలి.
This post was last modified on April 12, 2023 4:29 pm
పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో భారత్కు అంతర్జాతీయ వేదికపై కీలక మద్దతు లభించింది. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ…
రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మక స్థానాల్లో గుంటూరు మేయర్ స్థానం ఒకటి. విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లు అమరావతి రాజధాని పరిసరాల్లో ఉండటంతో…
వ్యూహాల కలిమి.. నాయకుల చెలిమి ఏ పార్టీకైనా అత్యంత అవసరం. ఈ విషయంలో వైసీపీ చేస్తున్న వ్వవహారం.. పార్టీని దుంపనాశనం…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. సొంత నియోజకవర్గం పులివెందులను తమ హస్తగతం చేసుకోవాలన్నది.. టీడీపీ ఆకాంక్ష. ముఖ్యంగా స్థానిక…
ప్రేక్షకులు చాల అడ్వాన్స్ ఉన్నారు, తెలివి మీరిపోయారనే సత్యాన్ని చాలా మంది దర్శక నిర్మాతలు గుర్తించడం లేదు. ఆ ఏముందిలే…
ఇండస్ట్రీలో వరుసగా ఫెయిల్యూర్లు ఇచ్చాక అవకాశాలు దక్కించుకోవడం అంత తేలికైన విషయం కాదు. కానీ కొందరు డైరెక్టర్లు మాత్రం తమ…