సమంతను శకుంతలదేవి గా చూపిస్తూ గుణ శేఖర్ తీసిన ‘శాకుంతలం’ సినిమా ఏప్రిల్ 14న గ్రాండ్ గా పాన్ ఇండియా మూవీగా రిలీజవుతుంది. ఈ సినిమా కోసం సమంత తన ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా ప్రమోషన్స్ లో పాల్గొంది. ముంబై , కొచ్చి ఇలా అన్నీ ప్రెస్ మీట్స్ కి హాజరైంది. ముఖ్యంగా ఎల్ బీ స్టేడియం ఈవెంట్ కి ఆమెను టీం వద్దని చెప్పినా వినకుండా ప్రమోషన్ కోసం అక్కడికి కూడా వెళ్ళింది. దీంతో సామ్ ఇప్పుడు అనారోగ్యంతో ఇబ్బంది పడుతుంది.
వరుస టూర్లు , ప్రమోషన్స్ , మీడియా ఇంట్రాక్షన్స్ ఇలా అన్నిటిలో పాల్గొన్నాక సమంత కి తీవ్ర జ్వరం వచ్చింది. ముఖ్యంగా దగ్గుతో పెద్దగా మాట్లాడలేకపోతుందని తెలుస్తుంది. తాజాగా జరిగిన తెలుగు ప్రెస్ మీట్ లో కూడా సామ్ మధ్యలో దగ్గుతోనే ఉంది. ఇక ఈరోజు డిల్లీలో బీజేపీ నాయకుల కోసం శాకుంతలం ప్రీమియర్ షో వేస్తున్నారు. అక్కడికి సామ్ వెళ్లాల్సి ఉంది కానీ ఆరోగ్యం బాగలేకపోవడంతో వెళ్లలేకపోయింది.
తాజాగా తన ఆరోగ్యం బాలేదని , ఫీవర్ తో మాట్లాడలేకపోతున్నాని అందుకే శాకుంతలం మిగతా ప్రమోషన్స్ కి అటెండ్ అవ్వలేకపోతున్నాని సామ్ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు చెప్పుకుంది. దీంతో అభిమానులు సినిమా కంటే ఆరోగ్యం ముఖ్యమని సమంత కి చెప్తూ రెస్ట్ తీసుకోమని రిప్లైలు పెడుతున్నారు. శాకుంతలం సక్సెస్ సమంతకి చాలా ఇంపార్టెంట్. ఈ సినిమా హిట్టయితే సమంతతో ఈ తరహా కథలు తీసేందుకు ఇంకొందరు దర్శక నిర్మాతలు ముందుకొస్తారు. మరి శాకుంతలంతో సమంత ఎలాంటి హిట్ కొడుతుందో చూడాలి.
This post was last modified on April 12, 2023 4:29 pm
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…