సమంతను శకుంతలదేవి గా చూపిస్తూ గుణ శేఖర్ తీసిన ‘శాకుంతలం’ సినిమా ఏప్రిల్ 14న గ్రాండ్ గా పాన్ ఇండియా మూవీగా రిలీజవుతుంది. ఈ సినిమా కోసం సమంత తన ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా ప్రమోషన్స్ లో పాల్గొంది. ముంబై , కొచ్చి ఇలా అన్నీ ప్రెస్ మీట్స్ కి హాజరైంది. ముఖ్యంగా ఎల్ బీ స్టేడియం ఈవెంట్ కి ఆమెను టీం వద్దని చెప్పినా వినకుండా ప్రమోషన్ కోసం అక్కడికి కూడా వెళ్ళింది. దీంతో సామ్ ఇప్పుడు అనారోగ్యంతో ఇబ్బంది పడుతుంది.
వరుస టూర్లు , ప్రమోషన్స్ , మీడియా ఇంట్రాక్షన్స్ ఇలా అన్నిటిలో పాల్గొన్నాక సమంత కి తీవ్ర జ్వరం వచ్చింది. ముఖ్యంగా దగ్గుతో పెద్దగా మాట్లాడలేకపోతుందని తెలుస్తుంది. తాజాగా జరిగిన తెలుగు ప్రెస్ మీట్ లో కూడా సామ్ మధ్యలో దగ్గుతోనే ఉంది. ఇక ఈరోజు డిల్లీలో బీజేపీ నాయకుల కోసం శాకుంతలం ప్రీమియర్ షో వేస్తున్నారు. అక్కడికి సామ్ వెళ్లాల్సి ఉంది కానీ ఆరోగ్యం బాగలేకపోవడంతో వెళ్లలేకపోయింది.
తాజాగా తన ఆరోగ్యం బాలేదని , ఫీవర్ తో మాట్లాడలేకపోతున్నాని అందుకే శాకుంతలం మిగతా ప్రమోషన్స్ కి అటెండ్ అవ్వలేకపోతున్నాని సామ్ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు చెప్పుకుంది. దీంతో అభిమానులు సినిమా కంటే ఆరోగ్యం ముఖ్యమని సమంత కి చెప్తూ రెస్ట్ తీసుకోమని రిప్లైలు పెడుతున్నారు. శాకుంతలం సక్సెస్ సమంతకి చాలా ఇంపార్టెంట్. ఈ సినిమా హిట్టయితే సమంతతో ఈ తరహా కథలు తీసేందుకు ఇంకొందరు దర్శక నిర్మాతలు ముందుకొస్తారు. మరి శాకుంతలంతో సమంత ఎలాంటి హిట్ కొడుతుందో చూడాలి.
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…
హీరోయిన్లు కెరీర్లో కొంచెం కుదురుకోగానే పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న ఎదురవుతుంది మీడియా నుంచి. ఆ తంతు పూర్తయ్యాక తల్లెప్పుడు…
సింగ్ గీతంని విష్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ తన మిత్రుడు రామ్ చరణ్ పెద్దికి మాత్రం ఎలాంటి ట్వీట్ వేయకపోవడం…
ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఇండీ కూటమిలో భాగంగా డీఎంకే, కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగిన…