Movie News

బన్నీకి ఎలివేషన్.. మిగతా స్టార్లపై ఫ్రస్టేషన్


హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో ఏదైనా పాత్ర చేయమంటే కాస్త ఇమేజ్ ఉన్న హీరోలెవరూ అంగీకరించరు. తమను డమ్మీని చేసేస్తారేమో అని, స్థాయి తగ్గిపోతుందేమో అని ఫీలవుతుంటారు. కానీ కొద్దిమంది హీరోలు మాత్రమే ఇలాంటి భేషజాలేమీ పెట్టుకోకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తుంటారు. ‘రుద్రమదేవి’ సినిమాలో రానా దగ్గుబాటి ఆమెకు జోడీగా కనిపించి మెప్పిస్తే.. అందులో అల్లు అర్జున్ ప్రత్యేక పాత్రతో మెరిశాడు. కానీ ఈ చిత్ర దర్శకుడు గుణశేఖర్ తీసిన తర్వాతి సినిమా ‘శాకుంతలం’కి మాత్రం అలా స్టార్ల బలం తోడవలేదు.

ఇందులో సమంతకు జోడీగా దుష్యంతుడి పాత్ర కోసం తెలుగు స్టార్లు కొందరిని సంప్రదించాడట గుణశేఖర్. కానీ ఎవ్వరూ ఒప్పుకోకపోవడంతో మలయాళ నటుడు దేవ్ మోహన్‌తో ఆ పాత్ర చేయించాడు. ఇటీవల ‘శాకుంతలం’ ప్రిమియర్ చూసిన చాలామంది ఎవరైనా స్టార్ హీరో దుష్యంతుడి పాత్రలో నటించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. మీడియా వాళ్లు కూడా ఇదే విషయమై గుణశేఖర్‌ను ప్రశ్నిస్తే.. ఆయన ఒకింత అసహనం వ్యక్తం చేశారు.

“రుద్రమదేవి సినిమాను మొదలు పెట్టినపుడు అందులో అల్లు అర్జున్ లేడు. మధ్యలో వచ్చి ఆ సినిమాలో చేరాడు. గోన గన్నారెడ్డి పాత్ర గురించి చెప్పగానే ఒక్క మాట ఆలోచించకుండా ఆ క్యారెక్టర్ చేశాడు. ఆ పాత్ర అంత బాగా పండింది. సినిమాకు ఉపయోగపడింది. హీరోలు ఇమేజ్ గురించి ఆలోచించకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించాలి. దుష్యంతుడి పాత్ర కోసం తెలుగులో కొందరు స్టార్ హీరోలను అడిగాం. కానీ ఎవ్వరూ చేయకపోవడంతోనే దేవ్ మోహన్‌ను తీసుకున్నాం. అతను ఆ పాత్రకు వంద శాతం న్యాయం చేశాడు” అని గుణశేఖర్ తెలిపాడు. ‘శాకుంతలం’ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.

This post was last modified on April 12, 2023 4:18 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

లేడీ డైరెక్టర్ వేసిన డేరింగ్ స్టెప్

టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…

2 hours ago

ఎవరెస్ట్ బరువు మోస్తున్న మారుతీ సాబ్

ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…

3 hours ago

రవితేజ వారి ‘మంచు’ పంచ్ చూశారా?

ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు…

4 hours ago

సినిమా వాయిదా… 60 కోట్ల రీఫండ్

అంతా అనుకున్న ప్రకారం జరిగితే తమిళనాడు థియేటర్ల దగ్గర ఈపాటికి పండుగ వాతావరణం ఉండేది. రేపటి ఉదయం ‘జననాయగన్’ రిలీజ్…

4 hours ago

తిరుమలపై ఎందుకీ పగ..?

తిరుమల శ్రీవారి ఆలయం అంటే దేవుడు లేడని భావించే నాస్తికులు కూడా పన్నెత్తు మాట అనని కలియుగ వైకుంఠం. ఎంతో…

4 hours ago

ది వీక్ కవర్ పేజీపై లోకేష్.. చీఫ్ జాబ్ క్రియేటర్

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పునర్నిర్మాణానికి దిశానిర్దేశం చేస్తున్న ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ‘ది వీక్’ మ్యాగజైన్ కవర్…

5 hours ago