హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో ఏదైనా పాత్ర చేయమంటే కాస్త ఇమేజ్ ఉన్న హీరోలెవరూ అంగీకరించరు. తమను డమ్మీని చేసేస్తారేమో అని, స్థాయి తగ్గిపోతుందేమో అని ఫీలవుతుంటారు. కానీ కొద్దిమంది హీరోలు మాత్రమే ఇలాంటి భేషజాలేమీ పెట్టుకోకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తుంటారు. ‘రుద్రమదేవి’ సినిమాలో రానా దగ్గుబాటి ఆమెకు జోడీగా కనిపించి మెప్పిస్తే.. అందులో అల్లు అర్జున్ ప్రత్యేక పాత్రతో మెరిశాడు. కానీ ఈ చిత్ర దర్శకుడు గుణశేఖర్ తీసిన తర్వాతి సినిమా ‘శాకుంతలం’కి మాత్రం అలా స్టార్ల బలం తోడవలేదు.
ఇందులో సమంతకు జోడీగా దుష్యంతుడి పాత్ర కోసం తెలుగు స్టార్లు కొందరిని సంప్రదించాడట గుణశేఖర్. కానీ ఎవ్వరూ ఒప్పుకోకపోవడంతో మలయాళ నటుడు దేవ్ మోహన్తో ఆ పాత్ర చేయించాడు. ఇటీవల ‘శాకుంతలం’ ప్రిమియర్ చూసిన చాలామంది ఎవరైనా స్టార్ హీరో దుష్యంతుడి పాత్రలో నటించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. మీడియా వాళ్లు కూడా ఇదే విషయమై గుణశేఖర్ను ప్రశ్నిస్తే.. ఆయన ఒకింత అసహనం వ్యక్తం చేశారు.
“రుద్రమదేవి సినిమాను మొదలు పెట్టినపుడు అందులో అల్లు అర్జున్ లేడు. మధ్యలో వచ్చి ఆ సినిమాలో చేరాడు. గోన గన్నారెడ్డి పాత్ర గురించి చెప్పగానే ఒక్క మాట ఆలోచించకుండా ఆ క్యారెక్టర్ చేశాడు. ఆ పాత్ర అంత బాగా పండింది. సినిమాకు ఉపయోగపడింది. హీరోలు ఇమేజ్ గురించి ఆలోచించకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించాలి. దుష్యంతుడి పాత్ర కోసం తెలుగులో కొందరు స్టార్ హీరోలను అడిగాం. కానీ ఎవ్వరూ చేయకపోవడంతోనే దేవ్ మోహన్ను తీసుకున్నాం. అతను ఆ పాత్రకు వంద శాతం న్యాయం చేశాడు” అని గుణశేఖర్ తెలిపాడు. ‘శాకుంతలం’ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on April 12, 2023 4:18 pm
ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…
అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…
చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారిపోయింది. గతంలో సినిమా బాగుంటే…
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి రోజురోజుకూ అట్టడుగుకు పడిపోతోంది. నేటి మ్యాచ్ లో సొంత…
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…