పెద్ద సినిమాల్లో హీరో హీరోయిన్ల మధ్య డ్యూయెట్లు అంటే ఫారిన్లో మంచు ప్రదేశాలకు వెళ్లిపోతుంటుంది యూనిట్. మంచు కురుస్తున్న బ్యాగ్రౌండ్లో రొమాంటిక్ సాంగ్స్ తీస్తే ప్రేక్షకులకు మంచి కిక్ వస్తుందని భావిస్తారు. ఐతే ఈ పాటల్లో చాలా వరకు హీరోలు కోట్లు, సూట్లు వేసుకుని కనిపిస్తే.. హీరోయిన్లు మాత్రం కురచ దుస్తుల్లో అందాలు ఆరబోస్తుంటారు. అంత చలిలో వాళ్లు చాలా ఆనందంగా గెంతులేస్తున్నట్లు కనిపించాల్సి ఉంటుంది. హీరోయిన్లను ఇలా చూపించడం పట్ల చాలామంది అభ్యంతరం వ్యక్తం చేస్తుంటారు.
హీరోయిన్లు సైతం ఈ విషయంలో తమ ఆవేదనను వెళ్లగక్కుతుంటారు. సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ సైతం ఈ విషయంలో అలాగే మాట్లాడింది.
ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు మంచు అంటే అస్సలు పడదని శ్రుతి వెల్లడించింది. చలికి అస్సలు తట్టుకోలేనని.. ఐతే సినిమాల్లో భాగంగా చాలాసార్లు మంచు ప్రదేశాల్లో చిత్రీకరించిన పాటల్లో నర్తించాల్సి వచ్చిందని శ్రుతి చెప్పింది. ఇలాంటి పాటలు తీసినపుడు హీరోలకు మాత్రం కోట్లు వేస్తారని.. హీరోయిన్లు మాత్రం కురచ దుస్తుల్లో కనిపించాల్సి ఉంటుందని.. ఇది అన్యాయమని శ్రుతి అంది. తాను దర్శకులందరికీ ఒక విన్నపం చేయదలుచుకున్నానని.. ఇలా ఎవ్వరూ చేయొద్దని.. మంచులో పాటలు తీసేటపుడు హీరోయిన్లకు కూడా హీరోల్లాగే కోట్లు వేసుకునే అవకాశం కల్పించాలని ఆమె కోరింది.
ఈ ఇంటర్యూలో శ్రుతి ఇలా చెప్పగానే.. వాల్తేరు వీరయ్య సినిమాలో శ్రీదేవి పాటకు సంబంధించి విజువల్స్ వేశారు. అందులో చిరు కోటుతో కనిపించగా.. శ్రుతి చీరలో కనిపించింది. ఐతే శ్రుతి జనరల్గానే ఈ విషయం చెప్పినప్పటికీ.. ఈ వీడియో చూసి చిరు ఫ్యాన్స్ కొందరు శ్రుతి మీద విమర్శలు గుప్పిస్తున్నారు.
This post was last modified on April 11, 2023 9:38 am
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఉవ్వెత్తున సాగుతున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలు(అసెంబ్లీ+పార్లమెంటు) ప్రశాంతంగా జరిగాయని ఎన్నికలు సంఘం చెబుతోంది. అయితే.. ప్రశాంతత కొన్ని నియోజకవర్గాలకు.. జిల్లాలకు మాత్రమే…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలకు వెళ్లి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి అయిన శిల్పా రవికి ప్రచారం…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పలు చోట్ల అధికార వైఎస్సార్ పార్టీ నేతలు, కార్యకర్తలు దాడులకు పాల్పడ్డ ఉదంతాలు మీడియాలో…
ఎన్నికల అంకం ముగింపుకొస్తున్న తరుణంలో అందరి దృష్టి క్రమంగా సినిమాల వైపు మళ్లుతోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్లానింగ్ ఎలా…
కీలకమైన నాలుగోదశ ఎన్నికల పోలింగ్ సమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవా ల్.. సంచలన ప్రకటన చేశారు.…