మాములుగా సల్మాన్ ఖాన్ సినిమా అంటే బాలీవుడ్ లో అదో రకమైన పండగ వాతావరణం ఉంటుంది. అందులోనూ తను చాలా సెంటిమెంట్ గా భావించే రంజాన్ కు వస్తున్నాడంటే అంతకంటే కావాల్సింది ఏముంటుంది. కానీ విచిత్రంగా కిసీకా భాయ్ కిసీకా జాన్ విషయంలో మాత్రం అంత హైప్ కనిపించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. వెంకటేష్ , పూజా హెగ్డే లాంటి స్టార్ క్యాస్టింగ్, రామ్ చరణ్ స్పెషల్ క్యామియో ఇవేవీ పూర్తి స్థాయి బజ్ ని పెంచలేకపోయాయి. పైగా సల్మాన్ విగ్గు ఎక్కువ ట్రోలింగ్ కు గురయ్యింది. నిన్న సాయంత్రం ట్రైలర్ వదిలారు.
కంటెంట్ చూస్తే ఆరిపోయిన రెగ్యులర్ మాస్ మసాలానే కండల వీరుడు నమ్ముకున్నట్టు కనిపిస్తుంది. అందరూ భాయ్ జాన్(సల్మాన్ ఖాన్) అని పిలిచే హీరోని ఓ అమ్మాయి(పూజా హెగ్డే) ప్రేమిస్తుంది. మనసులు ఇచ్చి పుచ్చుకుంటారు. ఆమెది తెలంగాణ కుటుంబం. అన్నయ్య(వెంకటేష్)కి హింస అంటే అస్సలు నచ్చదు. భాయ్ కేమో శత్రువు(జగపతిబాబు) నుంచి ప్రమాదం పదే పదే వెంటాడుతుంది. పెళ్లి చేసుకోవడం కోసం ఏర్పాట్లు చేస్తుంటే దాన్ని చెడగొట్టేందుకు విలన్ ఎంట్రీ ఇస్తాడు. ఇక అక్కడి నుంచి జరిగే డ్రామా ఎలా ఉంటుందో ఈజీగా ఊహించుకోవచ్చు.
ముందు నుంచి ప్రచారంలో ఉన్నట్టు ఇది కాటమరాయుడు రీమేక్ కాదు. అన్ని సౌత్ మూవీస్ ని కలిపేశారు. సీమ శాస్త్రి, విశ్వాసం, వీరం, బాషా ఇలా అన్ని మిక్స్ చేసి జ్యుస్ గా మార్చాడు దర్శకుడు ఫర్హాద్ సంజి. సల్మాన్ స్క్రీన్ ప్రెజెన్స్ మూడు రకాలుగా డిజైన్ చేయడం మాస్ కి ప్రత్యేకంగా అనిపించొచ్చు. ఎంత రొటీన్ అయినా ఎలివేషన్లు ఎమోషన్లు సరిగ్గా కుదిరితే ఆడియన్స్ హిట్ చేస్తారు కాబట్టి ఆ కోణంలో చూస్తే కిసీకా భాయ్ కిసీకా జాన్ లో అన్ని అంశాలు ఉన్నట్టే కనిపిస్తున్నాయి. ఆరేళ్ళ తర్వాత ఈద్ పండక్కు వస్తున్న సల్లు భాయ్ ఏం చేస్తాడో చూడాలి.
This post was last modified on April 11, 2023 8:18 am
ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్లో ఎదురుదెబ్బ తగిలినా, సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) రెండో మ్యాచ్లోనే అద్భుతంగా పుంజుకుంది. కోల్కతాలోని…
టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…
అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…
తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు రేణుకా చౌదరి.. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే…
మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…
ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…