సినిమాలు, సీరియళ్లలో నటించడానికి ముందు ఆర్టిస్టులు కష్టాలు పడటం మామూలే. రకరకాల నేపథ్యాల నుంచి వచ్చి.. చివరికి సినీ, టీవీ రంగాల్లో సెటిలవుతుంటారు. టీవీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పవిత్ర జయరాంది కూడా ఇలాంటి ఆసక్తికర నేపథ్యమే. పవిత్ర జయరాం పెద్దగా చదువుకోలేదట. దీంతో కొంచెం స్థాయి ఉన్న ఉద్యోగాలు చేసే అవకాశం కూడా లేకపోయిందని.. దీంతో హౌస్ కీపర్గా, సేల్స్ గర్ల్గా చిన్న చిన్న ఉద్యోగాలు చేశానని ఆమె ఒక ఇంటర్వ్యూలో వెల్లడించడం విశేషం.
ప్రస్తుతం పవిత్ర జయరాం స్టార్ మాలో బాగా పాపులర్ అయిన ‘త్రినయిని’ సీరియల్లో ముఖ్య పాత్ర పోషిస్తోంది. దీంతో పాటు మరి కొన్ని సీరియళ్లతో పవిత్ర టీవీ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించింది. తాజాగా ఆమె ఒక యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో తన నేపథ్యం గురించి ఆసక్తికర సంగతులు చెప్పింది.
తనది కర్ణాటకలోని మాండ్య అని.. తనకంటూ సొంత గుర్తింపు ఉండాలని బెంగళూరుకు వచ్చానని.. ఐతే తాను పెద్దగా చదువుకోకపోవడంతో ఎక్కడా చెప్పుకోదగ్గ ఉద్యోగం దొరకలేదని పవిత్ర జయరాం తెలిపింది. ఆ పరిస్థితుల్లో కొన్ని రోజుల్లో ఒక హోటల్లో హౌస్ కీపర్గా పని చేసినట్లు ఆమె వెల్లడించింది. తర్వాత సేల్స్ గర్ల్గా కూడా కొంత కాలం పని చేశానని.. లైబ్రరీలో కూడా చిన్న ఉద్యోగం చేశానని పవిత్ర తెలిపింది. ఐతే ఆ పనులు చేస్తున్నపుడు ఆదాయం సరిపోక ఇబ్బందులు పడ్డానని.. అలాంటి పరిస్థితుల్లో తన స్నేహితురాలు ఒక దర్శకుడి నంబర్ ఇచ్చిందని.. అదే తన జీవితాన్ని మలుపు తిప్పిందని పవిత్ర చెప్పింది.
సిరిగంధం శ్రీనివాస మూర్తి అనే డాక్యుమెంటరీ ఫిలిం మేకర్ దగ్గర దర్శకత్వ విభాగంలో కొన్నాళ్లు పని చేశాక.. కన్నడ సీరియల్స్లో నటించే ఆలోచనతో ఆడిషన్స్కు వెళ్లానని.. కొన్నాళ్లకు ఒక సీరియల్లో ఛాన్స్ వచ్చిందని.. ఆ తర్వాత తెలుగులో ‘నిన్నే పెళ్ళాడతా’ సీరియల్లో నటించానని.. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదని పవిత్రి తెలిపింది. ఇప్పుడు ఇంత పాపులర్ అయిన ఒక నటి.. సేల్స్ గర్ల్, హౌస్ కీపర్గా పని చేసిందంటే ఆశ్చర్యం కలగక మానదు.
This post was last modified on April 10, 2023 2:28 pm
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…