సినిమాలు, సీరియళ్లలో నటించడానికి ముందు ఆర్టిస్టులు కష్టాలు పడటం మామూలే. రకరకాల నేపథ్యాల నుంచి వచ్చి.. చివరికి సినీ, టీవీ రంగాల్లో సెటిలవుతుంటారు. టీవీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పవిత్ర జయరాంది కూడా ఇలాంటి ఆసక్తికర నేపథ్యమే. పవిత్ర జయరాం పెద్దగా చదువుకోలేదట. దీంతో కొంచెం స్థాయి ఉన్న ఉద్యోగాలు చేసే అవకాశం కూడా లేకపోయిందని.. దీంతో హౌస్ కీపర్గా, సేల్స్ గర్ల్గా చిన్న చిన్న ఉద్యోగాలు చేశానని ఆమె ఒక ఇంటర్వ్యూలో వెల్లడించడం విశేషం.
ప్రస్తుతం పవిత్ర జయరాం స్టార్ మాలో బాగా పాపులర్ అయిన ‘త్రినయిని’ సీరియల్లో ముఖ్య పాత్ర పోషిస్తోంది. దీంతో పాటు మరి కొన్ని సీరియళ్లతో పవిత్ర టీవీ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించింది. తాజాగా ఆమె ఒక యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో తన నేపథ్యం గురించి ఆసక్తికర సంగతులు చెప్పింది.
తనది కర్ణాటకలోని మాండ్య అని.. తనకంటూ సొంత గుర్తింపు ఉండాలని బెంగళూరుకు వచ్చానని.. ఐతే తాను పెద్దగా చదువుకోకపోవడంతో ఎక్కడా చెప్పుకోదగ్గ ఉద్యోగం దొరకలేదని పవిత్ర జయరాం తెలిపింది. ఆ పరిస్థితుల్లో కొన్ని రోజుల్లో ఒక హోటల్లో హౌస్ కీపర్గా పని చేసినట్లు ఆమె వెల్లడించింది. తర్వాత సేల్స్ గర్ల్గా కూడా కొంత కాలం పని చేశానని.. లైబ్రరీలో కూడా చిన్న ఉద్యోగం చేశానని పవిత్ర తెలిపింది. ఐతే ఆ పనులు చేస్తున్నపుడు ఆదాయం సరిపోక ఇబ్బందులు పడ్డానని.. అలాంటి పరిస్థితుల్లో తన స్నేహితురాలు ఒక దర్శకుడి నంబర్ ఇచ్చిందని.. అదే తన జీవితాన్ని మలుపు తిప్పిందని పవిత్ర చెప్పింది.
సిరిగంధం శ్రీనివాస మూర్తి అనే డాక్యుమెంటరీ ఫిలిం మేకర్ దగ్గర దర్శకత్వ విభాగంలో కొన్నాళ్లు పని చేశాక.. కన్నడ సీరియల్స్లో నటించే ఆలోచనతో ఆడిషన్స్కు వెళ్లానని.. కొన్నాళ్లకు ఒక సీరియల్లో ఛాన్స్ వచ్చిందని.. ఆ తర్వాత తెలుగులో ‘నిన్నే పెళ్ళాడతా’ సీరియల్లో నటించానని.. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదని పవిత్రి తెలిపింది. ఇప్పుడు ఇంత పాపులర్ అయిన ఒక నటి.. సేల్స్ గర్ల్, హౌస్ కీపర్గా పని చేసిందంటే ఆశ్చర్యం కలగక మానదు.
This post was last modified on April 10, 2023 2:28 pm
తండ్రుల వల్ల కానిది పిల్లలు చేసి చూపిస్తే అదో ఆనందం. నాగబాబు ప్రస్తుతం ఈ స్థితిని అనుభవిస్తున్నారు. నిర్మాతగా నాగబాబు…
సీనియర్ నటుడు రాజశేఖర్కు గోలీల ఫ్యాక్టరీ ఉందని.. దాని ద్వారా ప్రతి నెలా కోట్లు సంపాదిస్తున్నాడని సోషల్ మీడియాలో వీడియోలు…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇక రాష్ట్రపతి ఆమోదమే…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట నుంచి వచ్చిన మావిగన్ పైనే…
ఒకపక్క ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మెల్లగా మొదలైపోతున్నాయి. ట్రాకర్స్ ఒక్కొకరుగా రంగంలోకి దిగుతున్నారు. ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు ఏ నిమిషంలో…
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు క్యాంపు కార్యాలయంపై శనివారం దాడి…