పవన్ కళ్యాణ్ లీకులు సర్వసాధారణం అయిపోయాయి. వకీల్ సాబ్ షూటింగ్ జరుగుతున్న టైంలో పవన్ నడుచుకుంటూ వెళ్లే స్టిల్ ని ఒక అభిమాని దూరం నుంచి ఫోటో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. తీరా చూస్తే దానికొచ్చిన రీచ్ చూసి దర్శక నిర్మాతలు ఆ పిక్ నే టైటిల్ లోగో పక్కన వాడుకునే దాకా వెళ్ళింది. కట్ చేస్తే ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సైతం ఇదే బాట పట్టింది. మాస్ గెటప్ లో డార్క్ కలర్ గళ్ళ పంచ, నల్లని చొక్క, సన్నని గెడ్డంతో సైడ్ కట్ నుంచి తీసుకున్న పిక్చర్ అప్పుడే ట్విట్టర్, ఇన్స్ టాలో తెగ తిరుగుతోంది. దీన్ని కూడా లోగోగా వాడతారో ఏంటో.
దీనికి సంబంధించి ఒక ఆసక్తికరమైన స్టోరీ వినిపిస్తోంది. పవన్ ఇప్పుడు కనిపించిన ఈ లుక్కు ఫస్ట్ హాఫ్ లో వస్తుందట. ఒరిజినల్ తేరిలో విజయ్ బేకరీ నడుపుకునే వ్యక్తిగా చూపించిన సంగతి తెలిసిందే. దానికి బదులుగా పవన్ కి కొత్త సెటప్ పెట్టి ఫ్యాన్స్ కి షాక్ ఇవ్వబోతున్నట్టు తెలిసింది. పోలీస్ స్టేషన్ కి సంబంధించిన ఎపిసోడ్స్ ఫ్లాష్ బ్యాక్ లో ఉంటాయి. గబ్బర్ సింగ్ లాగే దర్శకుడు హరీష్ శంకర్ పూర్తిగా కొత్త ట్రీట్మెంట్ తో ఉస్తాద్ భగత్ సింగ్ తీస్తున్నట్టు తెలిసింది. దానికి తగ్గట్టే లీకులు ఉండటంతో సోసోగా ఉన్న అంచనాలు మెల్లగా పెరగడం మొదలయ్యాయి.
జూన్ లో వినోదయ సితం రీమేక్ రిలీజయ్యాక హరిహరవీరమల్లు కన్నా ముందే ఉస్తాద్ భగత్ సింగ్ ని విడుదల చేసే ప్లానింగ్ జరుగుతోంది. దానికి కారణం లేకపోలేదు. ఇంకో ఏడాదిలోపే ఎన్నికలు వస్తున్న తరుణంలో ముందు కమర్షియల్ సినిమాలు పూర్తి చేసి ఆపై వీరమల్లు లాంటి హిస్టారికల్ మూవీని వదిలితే అదో మంచి స్ట్రాటజీ అవుతుంది. సుజిత్ తో చేస్తున్న ఓజి మాత్రం ఎలక్షన్లయ్యాకే వస్తుంది. రాజకీయపరంగా ఆలోగా ఏమైనా అనూహ్య పరిణామాలు తలెత్తితే అప్పుడు దాని ప్లానింగ్ లో ఏదైనా మార్పులు చేర్పులు ఉండొచ్చు.
This post was last modified on April 9, 2023 1:19 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…