పవన్ కళ్యాణ్ లీకులు సర్వసాధారణం అయిపోయాయి. వకీల్ సాబ్ షూటింగ్ జరుగుతున్న టైంలో పవన్ నడుచుకుంటూ వెళ్లే స్టిల్ ని ఒక అభిమాని దూరం నుంచి ఫోటో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. తీరా చూస్తే దానికొచ్చిన రీచ్ చూసి దర్శక నిర్మాతలు ఆ పిక్ నే టైటిల్ లోగో పక్కన వాడుకునే దాకా వెళ్ళింది. కట్ చేస్తే ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సైతం ఇదే బాట పట్టింది. మాస్ గెటప్ లో డార్క్ కలర్ గళ్ళ పంచ, నల్లని చొక్క, సన్నని గెడ్డంతో సైడ్ కట్ నుంచి తీసుకున్న పిక్చర్ అప్పుడే ట్విట్టర్, ఇన్స్ టాలో తెగ తిరుగుతోంది. దీన్ని కూడా లోగోగా వాడతారో ఏంటో.
దీనికి సంబంధించి ఒక ఆసక్తికరమైన స్టోరీ వినిపిస్తోంది. పవన్ ఇప్పుడు కనిపించిన ఈ లుక్కు ఫస్ట్ హాఫ్ లో వస్తుందట. ఒరిజినల్ తేరిలో విజయ్ బేకరీ నడుపుకునే వ్యక్తిగా చూపించిన సంగతి తెలిసిందే. దానికి బదులుగా పవన్ కి కొత్త సెటప్ పెట్టి ఫ్యాన్స్ కి షాక్ ఇవ్వబోతున్నట్టు తెలిసింది. పోలీస్ స్టేషన్ కి సంబంధించిన ఎపిసోడ్స్ ఫ్లాష్ బ్యాక్ లో ఉంటాయి. గబ్బర్ సింగ్ లాగే దర్శకుడు హరీష్ శంకర్ పూర్తిగా కొత్త ట్రీట్మెంట్ తో ఉస్తాద్ భగత్ సింగ్ తీస్తున్నట్టు తెలిసింది. దానికి తగ్గట్టే లీకులు ఉండటంతో సోసోగా ఉన్న అంచనాలు మెల్లగా పెరగడం మొదలయ్యాయి.
జూన్ లో వినోదయ సితం రీమేక్ రిలీజయ్యాక హరిహరవీరమల్లు కన్నా ముందే ఉస్తాద్ భగత్ సింగ్ ని విడుదల చేసే ప్లానింగ్ జరుగుతోంది. దానికి కారణం లేకపోలేదు. ఇంకో ఏడాదిలోపే ఎన్నికలు వస్తున్న తరుణంలో ముందు కమర్షియల్ సినిమాలు పూర్తి చేసి ఆపై వీరమల్లు లాంటి హిస్టారికల్ మూవీని వదిలితే అదో మంచి స్ట్రాటజీ అవుతుంది. సుజిత్ తో చేస్తున్న ఓజి మాత్రం ఎలక్షన్లయ్యాకే వస్తుంది. రాజకీయపరంగా ఆలోగా ఏమైనా అనూహ్య పరిణామాలు తలెత్తితే అప్పుడు దాని ప్లానింగ్ లో ఏదైనా మార్పులు చేర్పులు ఉండొచ్చు.
This post was last modified on April 9, 2023 1:19 pm
తిరుమల పరకామణి చోరీ ఘటనపై మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా…
గత కొన్నేళ్లుగా సౌత్ సినిమాల ఆధిపత్యం ముందు బాలీవుడ్ నిలవలేకపోతోంది. ఒక సంవత్సరంలో ఓవరాల్ పెర్ఫామెన్స్ పరంగా చూసుకున్నా.. హైయెస్ట్…
పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడు డబుల్ మర్డర్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి…
ఏపీ ఎడ్యుకేషన్ మోడల్ ఇప్పుడు జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటోంది. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా విధానాలు అందరి…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆసక్తికర విషయాన్ని దేశ ప్రజలతో పంచుకున్నారు. ``ఇది మీ సొమ్మా.. అయితే.. సొంతం చేసుకోండి.…
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అంచనాలకు మించి ఆడేస్తోంది. మరీ జవాన్, పఠాన్ రేంజులో కాదు కానీ రణ్వీర్…