కోలీవుడ్ లో కల్ట్ దర్శకుడిగా పేరున్న వెట్రిమారన్ గురించి మూవీ లవర్స్ కు కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. ఆయన కొత్త సినిమా విడుతలై పార్ట్ 1 మొన్న మార్చి 31న విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక్కడ దసరా పోటీతో పాటు థియేటర్ల లభ్యత, తెలుగు హక్కులు కొనుగోలుకు తగినంత సమయం లేకపోవడం లాంటి కారణాల వల్ల డబ్బింగ్ లేట్ అయ్యింది.ఎట్టకేలకు అల్లు అరవింద్ ముందుకు రావడంతో విడుదల భాగం 1 పేరుతో ఈ నెల పదిహేడున రిలీజ్ చేయబోతున్నారు. ఆన్ లైన్ లో రివ్యూలు గట్రా చూసిన వాళ్ళకు దీని మీద మంచి ఆసక్తి నెలకొంది.
డిపార్ట్ మెంట్ లో చాలా నిజాయితీగా ఉండే ఓ పోలీస్ కానిస్టేబుల్(కమెడియన్ సూరి) చుట్టూ జరుగుతున్న అన్యాయాలను చూసి రగిలిపోతూ ఉంటాడు. వెనుకబడిన వర్గాల హక్కులకై పోరాడుతున్న ప్రజాదళం నక్సలైట్ బృందం నాయకుడైన పెరుమాళ్ (విజయ్ సేతుపతి) కోసం ప్రభుత్వం జల్లెడ పట్టి వెతుకుతూ ఉంటుంది. స్పెషల్ ఆఫీసర్(గౌతమ్ మీనన్) వచ్చాక సానుభూతిపరుల మీద ఆ ఇంటి ఆడాళ్ళ మీద ఖాకీ చొక్కా మాటున దారుణాలకు తెగబడతారు. దీంతో పెరుమాళ్ బయటికి వచ్చి అరాచకం మొదలుపెడతాడు. ఈ యుద్ధం ఎక్కడికి వెళ్లిందన్నదే స్టోరీ.
విజువల్స్ అన్నీ చాలా డెప్త్ తో ఇంటెన్సిటీతో రూపొందించారు వెట్రిమారన్. ఇళయరాజా సంగీతం, నాణ్యమైన తారాగణం ఏదో చీకటి ప్రపంచంలో ప్రయాణించే అనుభూతిని కలిగించేలా ఉంది. అయితే ఈ తరహా బ్యాక్ డ్రాప్ ఉన్న మూవీస్ ని తెలుగు ఆడియన్స్ అంతగా రిసీవ్ చేసుకోవడం లేదు. విరాట పర్వంలో ఇలాంటి ఇష్యూని టచ్ చేసిన దర్శకుడు వేణు ఊడుగుల ఈ కారణంగానే సక్సెస్ అందుకోలేకపోయాడు. మరి అనువాద రూపంలో వచ్చి అందులోనూ ఎలాంటి క్యాస్టింగ్ ఆకర్షణలు లేని విడుదల పార్ట్ 1 ఏ మేరకు మన ప్రేక్షకులను మెప్పిస్తుందో ఏప్రిల్ 15 తేలిపోతుంది.
This post was last modified on April 8, 2023 1:56 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…