కోలీవుడ్ లో కల్ట్ దర్శకుడిగా పేరున్న వెట్రిమారన్ గురించి మూవీ లవర్స్ కు కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. ఆయన కొత్త సినిమా విడుతలై పార్ట్ 1 మొన్న మార్చి 31న విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక్కడ దసరా పోటీతో పాటు థియేటర్ల లభ్యత, తెలుగు హక్కులు కొనుగోలుకు తగినంత సమయం లేకపోవడం లాంటి కారణాల వల్ల డబ్బింగ్ లేట్ అయ్యింది.ఎట్టకేలకు అల్లు అరవింద్ ముందుకు రావడంతో విడుదల భాగం 1 పేరుతో ఈ నెల పదిహేడున రిలీజ్ చేయబోతున్నారు. ఆన్ లైన్ లో రివ్యూలు గట్రా చూసిన వాళ్ళకు దీని మీద మంచి ఆసక్తి నెలకొంది.
డిపార్ట్ మెంట్ లో చాలా నిజాయితీగా ఉండే ఓ పోలీస్ కానిస్టేబుల్(కమెడియన్ సూరి) చుట్టూ జరుగుతున్న అన్యాయాలను చూసి రగిలిపోతూ ఉంటాడు. వెనుకబడిన వర్గాల హక్కులకై పోరాడుతున్న ప్రజాదళం నక్సలైట్ బృందం నాయకుడైన పెరుమాళ్ (విజయ్ సేతుపతి) కోసం ప్రభుత్వం జల్లెడ పట్టి వెతుకుతూ ఉంటుంది. స్పెషల్ ఆఫీసర్(గౌతమ్ మీనన్) వచ్చాక సానుభూతిపరుల మీద ఆ ఇంటి ఆడాళ్ళ మీద ఖాకీ చొక్కా మాటున దారుణాలకు తెగబడతారు. దీంతో పెరుమాళ్ బయటికి వచ్చి అరాచకం మొదలుపెడతాడు. ఈ యుద్ధం ఎక్కడికి వెళ్లిందన్నదే స్టోరీ.
విజువల్స్ అన్నీ చాలా డెప్త్ తో ఇంటెన్సిటీతో రూపొందించారు వెట్రిమారన్. ఇళయరాజా సంగీతం, నాణ్యమైన తారాగణం ఏదో చీకటి ప్రపంచంలో ప్రయాణించే అనుభూతిని కలిగించేలా ఉంది. అయితే ఈ తరహా బ్యాక్ డ్రాప్ ఉన్న మూవీస్ ని తెలుగు ఆడియన్స్ అంతగా రిసీవ్ చేసుకోవడం లేదు. విరాట పర్వంలో ఇలాంటి ఇష్యూని టచ్ చేసిన దర్శకుడు వేణు ఊడుగుల ఈ కారణంగానే సక్సెస్ అందుకోలేకపోయాడు. మరి అనువాద రూపంలో వచ్చి అందులోనూ ఎలాంటి క్యాస్టింగ్ ఆకర్షణలు లేని విడుదల పార్ట్ 1 ఏ మేరకు మన ప్రేక్షకులను మెప్పిస్తుందో ఏప్రిల్ 15 తేలిపోతుంది.
This post was last modified on April 8, 2023 1:56 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…