కొన్ని కాంబినేషన్స్ ఎప్పుడో సెట్ అయిపోతాయి. కానీ బయటికొచ్చే సరికి చాలా టైమ్ పడుతుంది. ఇలాంటి ఓ క్రేజీ కాంబో ఎప్పుడో సెట్ అయింది కానీ ఇంత వరకూ ఎలాంటి లీకులు లేవు. ఆ క్రేజీ కాంబోనే రాజమౌళి -ప్రభాస్. బాహుబలి ఫ్రాంచైజ్ తో అద్భుతాలు సృష్టించిన ఈ కాంబో ఆ వెంటనే మరో ప్రాజెక్ట్ లాక్ చేసుకుంది. ప్రస్తుతం ఎవరి కమిట్ మెంట్స్ వాళ్ళు పూర్తి చేసి మళ్ళీ కలుద్దామని అనేసుకున్నారు. తాజాగా ఈ విషయాన్ని దిల్ రాజు బయటపెట్టారు.
ఇటీవలే ప్రభాస్ తో సినిమా ఎప్పుడు అంటూ దిల్ రాజు కి ఓ ప్రశ్న ఎదురైంది. వెంటనే దిల్ రాజు రాజమౌళి తో చేస్తున్నాడు ఆ సినిమా అయ్యాక మా కాంబో ఉండబోతుంది అన్నట్టుగా చెప్పారు. ప్రభాస్ చేతిలో నాలుగు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటి పేర్లు చెప్పకుండా దిల్ రాజు ఆ తర్వాత ఉండే కాంబో సినిమాను రివీల్ చేశారు. అంటే రాజమౌళి -ప్రభాస్ ఓ బేనర్ కి కమిట్ అయి ఉండవచ్చు. దాని తర్వాతే దిల్ రాజు బేనర్ లో ప్రభాస్ చేసే ఛాన్స్ ఉంది కావచ్చు.
ఏదేమైనా దిల్ రాజు చెప్పిన మాటలను బట్టి చూస్తే మహేష్ సినిమా తర్వాత రాజమౌళి డైరెక్ట్ చేయబోయేది ప్రభాస్ నే అనిపిస్తుంది. ఎలాగో రాజమౌళి మహేష్ సినిమాను కంప్లీట్ చేయడానికి ఇంకా రెండేళ్ళు పైనే పడుతుంది. ఆ తర్వాత కథ కమామియా కోసం ఇంకొన్ని నెలలు తీసుకుంటారు. ఈ గ్యాప్ లో ప్రభాస్ తన లైనప్ కంప్లీట్ చేసేసుకుంటాడు కావచ్చు. ఈసారి ఈ కాంబో సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉండొచ్చు.
ప్రపంచమంతా ఒక సినిమా కోసం ఎదురు చూడటం చాలా అరుదు. క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ది ఒడిస్సీ ఈ…
ఊరు వాడ పేరుతో ఎన్టీఆర్ అభిమానులు చేపడుతున్న సేవా కార్యక్రమాల వ్యవహారం ఇటీవల ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారిన సంగతి…
న్యాయస్థానంలో సాక్ష్యాధారాలే కీలకం. మూఢనమ్మకాలతో చట్టాన్ని ప్రభావితం చేయలేరు... అయితే అమాయకత్వమో.. మరి ఏమో కానీ తీర్పు తనకు అనుకూలంగా…
సినీ రంగంలో గొప్ప స్థాయికి చేరుకున్న చాలామంది దర్శకులు ఒకప్పుడు అనామకులే. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి అవకాశాల కోసం కాళ్లరిగేలా…
ఒకే రోజు ఏపీలో రెండు ఘటనలు.. ఒకటి ప్రకాశం జిల్లా సింగరాయకొండ. మరొకటి పల్నాడు జిల్లా వినుకొండ. రెండు ప్రాంతాలు…
రాయలసీమను కూటమి ప్రభుత్వం పెట్టుబడుల సీమగా మారుస్తోంది. పెద్ద ఎత్తున పెట్టుబడులు తరలి వస్తున్నాయి. తాజాగా దాల్మియా సిమెంట్ భారీ…