కొన్ని కాంబినేషన్స్ ఎప్పుడో సెట్ అయిపోతాయి. కానీ బయటికొచ్చే సరికి చాలా టైమ్ పడుతుంది. ఇలాంటి ఓ క్రేజీ కాంబో ఎప్పుడో సెట్ అయింది కానీ ఇంత వరకూ ఎలాంటి లీకులు లేవు. ఆ క్రేజీ కాంబోనే రాజమౌళి -ప్రభాస్. బాహుబలి ఫ్రాంచైజ్ తో అద్భుతాలు సృష్టించిన ఈ కాంబో ఆ వెంటనే మరో ప్రాజెక్ట్ లాక్ చేసుకుంది. ప్రస్తుతం ఎవరి కమిట్ మెంట్స్ వాళ్ళు పూర్తి చేసి మళ్ళీ కలుద్దామని అనేసుకున్నారు. తాజాగా ఈ విషయాన్ని దిల్ రాజు బయటపెట్టారు.
ఇటీవలే ప్రభాస్ తో సినిమా ఎప్పుడు అంటూ దిల్ రాజు కి ఓ ప్రశ్న ఎదురైంది. వెంటనే దిల్ రాజు రాజమౌళి తో చేస్తున్నాడు ఆ సినిమా అయ్యాక మా కాంబో ఉండబోతుంది అన్నట్టుగా చెప్పారు. ప్రభాస్ చేతిలో నాలుగు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటి పేర్లు చెప్పకుండా దిల్ రాజు ఆ తర్వాత ఉండే కాంబో సినిమాను రివీల్ చేశారు. అంటే రాజమౌళి -ప్రభాస్ ఓ బేనర్ కి కమిట్ అయి ఉండవచ్చు. దాని తర్వాతే దిల్ రాజు బేనర్ లో ప్రభాస్ చేసే ఛాన్స్ ఉంది కావచ్చు.
ఏదేమైనా దిల్ రాజు చెప్పిన మాటలను బట్టి చూస్తే మహేష్ సినిమా తర్వాత రాజమౌళి డైరెక్ట్ చేయబోయేది ప్రభాస్ నే అనిపిస్తుంది. ఎలాగో రాజమౌళి మహేష్ సినిమాను కంప్లీట్ చేయడానికి ఇంకా రెండేళ్ళు పైనే పడుతుంది. ఆ తర్వాత కథ కమామియా కోసం ఇంకొన్ని నెలలు తీసుకుంటారు. ఈ గ్యాప్ లో ప్రభాస్ తన లైనప్ కంప్లీట్ చేసేసుకుంటాడు కావచ్చు. ఈసారి ఈ కాంబో సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉండొచ్చు.
This post was last modified on April 6, 2023 7:17 pm
మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…
అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…
రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…
అభిమానులందు పవన్ అభిమానులు వేరయా అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఆయనకున్న లాయల్ ఫ్యాన్ బేస్ ఇండియా మొత్తంలో…
బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తనకి ఎన్నో…
వందల కోట్లతో ప్యాన్ ఇండియా మూవీస్ తీస్తున్నప్పుడు పెద్ద ఎత్తున ప్రమోషన్లు అవసరం. ఎవరికైనా ఇది తప్పదు. ఎప్పుడో 2027…