కొన్ని కాంబినేషన్స్ ఎప్పుడో సెట్ అయిపోతాయి. కానీ బయటికొచ్చే సరికి చాలా టైమ్ పడుతుంది. ఇలాంటి ఓ క్రేజీ కాంబో ఎప్పుడో సెట్ అయింది కానీ ఇంత వరకూ ఎలాంటి లీకులు లేవు. ఆ క్రేజీ కాంబోనే రాజమౌళి -ప్రభాస్. బాహుబలి ఫ్రాంచైజ్ తో అద్భుతాలు సృష్టించిన ఈ కాంబో ఆ వెంటనే మరో ప్రాజెక్ట్ లాక్ చేసుకుంది. ప్రస్తుతం ఎవరి కమిట్ మెంట్స్ వాళ్ళు పూర్తి చేసి మళ్ళీ కలుద్దామని అనేసుకున్నారు. తాజాగా ఈ విషయాన్ని దిల్ రాజు బయటపెట్టారు.
ఇటీవలే ప్రభాస్ తో సినిమా ఎప్పుడు అంటూ దిల్ రాజు కి ఓ ప్రశ్న ఎదురైంది. వెంటనే దిల్ రాజు రాజమౌళి తో చేస్తున్నాడు ఆ సినిమా అయ్యాక మా కాంబో ఉండబోతుంది అన్నట్టుగా చెప్పారు. ప్రభాస్ చేతిలో నాలుగు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటి పేర్లు చెప్పకుండా దిల్ రాజు ఆ తర్వాత ఉండే కాంబో సినిమాను రివీల్ చేశారు. అంటే రాజమౌళి -ప్రభాస్ ఓ బేనర్ కి కమిట్ అయి ఉండవచ్చు. దాని తర్వాతే దిల్ రాజు బేనర్ లో ప్రభాస్ చేసే ఛాన్స్ ఉంది కావచ్చు.
ఏదేమైనా దిల్ రాజు చెప్పిన మాటలను బట్టి చూస్తే మహేష్ సినిమా తర్వాత రాజమౌళి డైరెక్ట్ చేయబోయేది ప్రభాస్ నే అనిపిస్తుంది. ఎలాగో రాజమౌళి మహేష్ సినిమాను కంప్లీట్ చేయడానికి ఇంకా రెండేళ్ళు పైనే పడుతుంది. ఆ తర్వాత కథ కమామియా కోసం ఇంకొన్ని నెలలు తీసుకుంటారు. ఈ గ్యాప్ లో ప్రభాస్ తన లైనప్ కంప్లీట్ చేసేసుకుంటాడు కావచ్చు. ఈసారి ఈ కాంబో సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉండొచ్చు.
This post was last modified on April 6, 2023 7:17 pm
ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వస్తున్న మూడో తరం వారసుడు జయకృష్ణ కొత్త సినిమా శ్రీనివాస మంగాపురం షూటింగ్ పూర్తయ్యే స్టేజికు…
ఇటీవలే శ్వాసనాళానికి సంబంధించిన శస్త్ర చికిత్స చేయించుకున్న ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్రమంగా కోలుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్…
టిడిపిలోనే కొందరు నాయకులకు మెజారిటీ సమస్య ఇప్పుడు కొంత గడబిడగా మారింది. గత ఎన్నికల సమయంలో భారీ స్థాయి మెజారిటీతో…
ఎవరు ఔనన్నా కాదన్నా టాలీవుడ్ రెండు వర్గాలుగా విడిపోయింది. ఎగ్జిబిటర్లు ప్లస్ వాళ్లలోనే ఉన్న నిర్మాతలు, ప్రొడ్యూసర్లు ప్లస్ వాళ్లలోనే…
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)కు నిజంగానే ఉచ్చు బిగుస్తోందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.…
జైలు.. ఈ మాట వినగానే సామాన్యులకు వామ్మో అనిపిస్తుంది. అక్కడి పరిస్థితుల గురించి అనుభవం ఉన్న వాళ్లు చెబుతుంటే.. సినిమాల్లో…