కొన్ని కాంబినేషన్స్ ఎప్పుడో సెట్ అయిపోతాయి. కానీ బయటికొచ్చే సరికి చాలా టైమ్ పడుతుంది. ఇలాంటి ఓ క్రేజీ కాంబో ఎప్పుడో సెట్ అయింది కానీ ఇంత వరకూ ఎలాంటి లీకులు లేవు. ఆ క్రేజీ కాంబోనే రాజమౌళి -ప్రభాస్. బాహుబలి ఫ్రాంచైజ్ తో అద్భుతాలు సృష్టించిన ఈ కాంబో ఆ వెంటనే మరో ప్రాజెక్ట్ లాక్ చేసుకుంది. ప్రస్తుతం ఎవరి కమిట్ మెంట్స్ వాళ్ళు పూర్తి చేసి మళ్ళీ కలుద్దామని అనేసుకున్నారు. తాజాగా ఈ విషయాన్ని దిల్ రాజు బయటపెట్టారు.
ఇటీవలే ప్రభాస్ తో సినిమా ఎప్పుడు అంటూ దిల్ రాజు కి ఓ ప్రశ్న ఎదురైంది. వెంటనే దిల్ రాజు రాజమౌళి తో చేస్తున్నాడు ఆ సినిమా అయ్యాక మా కాంబో ఉండబోతుంది అన్నట్టుగా చెప్పారు. ప్రభాస్ చేతిలో నాలుగు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటి పేర్లు చెప్పకుండా దిల్ రాజు ఆ తర్వాత ఉండే కాంబో సినిమాను రివీల్ చేశారు. అంటే రాజమౌళి -ప్రభాస్ ఓ బేనర్ కి కమిట్ అయి ఉండవచ్చు. దాని తర్వాతే దిల్ రాజు బేనర్ లో ప్రభాస్ చేసే ఛాన్స్ ఉంది కావచ్చు.
ఏదేమైనా దిల్ రాజు చెప్పిన మాటలను బట్టి చూస్తే మహేష్ సినిమా తర్వాత రాజమౌళి డైరెక్ట్ చేయబోయేది ప్రభాస్ నే అనిపిస్తుంది. ఎలాగో రాజమౌళి మహేష్ సినిమాను కంప్లీట్ చేయడానికి ఇంకా రెండేళ్ళు పైనే పడుతుంది. ఆ తర్వాత కథ కమామియా కోసం ఇంకొన్ని నెలలు తీసుకుంటారు. ఈ గ్యాప్ లో ప్రభాస్ తన లైనప్ కంప్లీట్ చేసేసుకుంటాడు కావచ్చు. ఈసారి ఈ కాంబో సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉండొచ్చు.
This post was last modified on April 6, 2023 7:17 pm
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు.. ఏపీ సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి.. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న సునీల్కు రఘురామకు…
టీడీపీలో నాయకులు.. చంద్రబాబు కనుసన్నల్లోనే మెలుగుతున్నారా? ఆయన చెప్పినట్టే చేస్తున్నారా? అంటే.. మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…
అవకాశాలు.. అదృష్టాలు.. పదే పదే రావని అంటారు. అవి వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునేందుకు వ్యక్తులైనా పార్టీలైనా.. ఎవరైనా సరే..…
ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…
ఎన్నికలు సమీపిస్తున్నపుడు కొందరు రాజకీయ నాయకులకు ఎలివేషన్లు ఇస్తూ సినిమాలు వస్తుంటాయి. అలాగే కొందరు నేతలను టార్గెట్ చేస్తూ మూవీస్…
ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చర్చకు వస్తున్నాయి.…