Movie News

అవతార్ రేంజులో బ్రహ్మాస్త్ర తీస్తారా

విజువల్ ఎఫెక్ట్స్ తో కూడుకున్న భారీ బడ్జెట్ సినిమా తీయడానికి సమయం అవసరమే కానీ మరీ ఏళ్లకేళ్లు ముందే నిర్ణయించుకుని ప్రకటించడం మాత్రం అరుదే. రాజమౌళి బాహుబలి, ఆర్ఆర్ఆర్ లు ఫలానా టైంకి పూర్తి చేస్తాననే మాటకు వివిధ కారణాల వల్ల కట్టుబడలేకపోయినా ప్రపంచవ్యాప్తంగా వాటికొచ్చిన గుర్తింపు చూసుకుంటే ఆ మాత్రం సమయం అవసరమే అనిపిస్తుంది. ఇప్పుడు బ్రహ్మస్త్ర దర్శకుడు అయాన్ ముఖర్జీ ఇదే సూత్రం పాటిస్తానంటున్నాడు. గత ఏడాది రిలీజైన పార్ట్ 1 భారీ వసూళ్లతో బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.

ఉత్తరాది వైపు బ్రహ్మాండంగా ఆడింది కానీ మన సైడ్ ఆ రేంజ్ స్పందన దక్కని మాట వాస్తవం. జక్కన్న సినిమాలను తలదన్నెల్లా పేరు తెస్తుందని నిర్మాత కరణ్ జోహార్ ఊహించాడు కానీ అది జరగలేదు. తాజాగా బ్రహ్మాస్త్ర రెండు మూడు భాగాలకు సంబంధించిన రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్లు ఇచ్చేశారు. బ్రహ్మాస్త్ర పార్ట్ 2 డిసెంబర్ 2026 రానుండగా ఒక ఏడాది గ్యాప్ తో చివరి ఘట్టం అదే నెల 2027లో విడుదల కానుంది. వీటికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని, ఎవరూ ఊహించని రీతిలో గొప్పగా దీన్ని తీస్తానని అయాన్ ముఖర్జీ హామీ ఇచ్చేశారు. ఒకేసారి వీటిని షూట్ చేయబోతున్నారు.

అంతా బాగానే ఉంది కానీ అవతార్ రేంజ్ లో రెండు భాగాలకు అయిదేళ్ల గడువు తీసుకోవడం అనూహ్యం. మాములుగా సీక్వెల్స్ కు రెండేళ్లకు మించి క్రేజ్ ఉండదు. బాహుబలి, కెజిఎఫ్, పుష్పలు ఆ సూత్రాన్ని అనుసరించే హైప్ ని నిలబెట్టుకున్నాయి. కానీ బ్రహ్మస్త్ర ఏకంగా మొత్తం అయిదు సంవత్సరాలు తీసుకోవడం విచిత్రం. అవతార్ కోసం జేమ్స్ క్యామరూన్ మాత్రమే ఇలా డేట్లను ఇచ్చారు. బహుశా అయాన్ ఆయన్నే స్ఫూర్తిగా తీసుకున్నాడేమో. రన్బీర్ కపూర్ అలియా భట్ జంటగా నటిస్తున్న ఈ ఫాంటసీ థ్రిల్లర్ లో అమితాబ్ తదితరులు కొనసాగబోతున్నారు.

This post was last modified on April 4, 2023 2:28 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మహేష్ అభిమానులకు హరీష్ సారి

సోషల్ మీడియాలో చాలా అలెర్ట్ గా ఉండాలి. ముఖ్యంగా సెలబ్రిటీలు బిజీగా షెడ్యూల్స్ లో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా…

25 minutes ago

కొత్త శుక్రవారం గంగార్పణం అవుతోంది

థియేటర్లకు సరైన సినిమాలు వస్తే రావడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. ఎటొచ్చి వాళ్ళను కనీస స్థాయిలో మెప్పించే కంటెంట్ ఉన్నవి…

33 minutes ago

టికెట్ ఇచ్చినా పట్టించుకోలేదా?

తెలంగాణలో రెండు రాజ్య‌స‌భ స్థానాల‌కు పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థులు అభిషేక్ మ‌ను సింఘ్వీ, వేం న‌రేందర్ రెడ్డిలు..…

4 hours ago

ఏపీలో హోటల్స్… ఇబ్బంది లేనట్టేనా?

వంటగ్యాస్ కొరత కారణంగా దేశవ్యాప్తంగా చిన్న హోటళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. హోటళ్లకు సరఫరా అయ్యే కమర్షియల్ సిలిండర్ల పంపిణీని…

7 hours ago

ఏపీలో స్పెషల్ ఆఫీసర్ల పాలన.. ఎక్కడంటే!

రాష్ట్రంలోని పలు మున్సిపల్ సంస్థల్లో పాలకవర్గాల గడువు ముగియడంతో అక్కడ స్పెషల్ ఆఫీసర్ల పాలన అమల్లోకి రానుంది. మున్సిపల్ కార్పొరేషన్లు,…

7 hours ago

డైరెక్ట‌ర్ హైప్ ఇస్తుంటే… నాగ్ ఫ్యాన్స్‌కు టెన్ష‌న్‌

టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున వ‌రుస‌గా త‌మిళ న‌టులు, టెక్నీషియ‌న్ల‌తో ప‌ని చేస్తున్నాడు. గ‌త ఏడాది ధ‌నుష్‌తో క‌లిసి…

10 hours ago