జూనియర్ ఎన్టీఆర్ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ ప్యాన్ ఇండియా మూవీ మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఎగ్జైట్ మెంట్ ని చూసి చెప్పొచ్చు. ఏడాదికి పైగా నిరీక్షణకు తెరదించుతూ ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టడం, సెట్లో తారక్ అడుగు పెట్టిన వీడియోకు భారీ స్పందన రావడం అభిమానులను సంతోషంలో ముంచెత్తింది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ టాలీవుడ్ కు దీని ద్వారానే పరిచయం కానుండగా కొంత గ్యాప్ తర్వాత అనిరుద్ రవిచందర్ తెలుగు సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు.
ఇందులో మెయిన్ విలన్ గా సైఫ్ అలీఖాన్ నటించబోతున్నాడనే వార్త గత కొన్ని నెలలుగా చక్కర్లు కొడుతూనే ఉంది. యూనిట్ అధికారికంగా ధృవీకరించకపోయినా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అనే రీతిలో కథనాలు వచ్చాయి. లేటెస్ట్ ముంబై అప్డేట్ ప్రకారం సైఫ్ పలు దఫాల చర్చల తర్వాత నో అన్నాడట. కారణాలు ఖచ్చితంగా తెలియకపోయినా చాలా బల్క్ డేట్లు అడగడంతో తాను ఒప్పుకున్న ఇతర హిందీ సినిమాలకు ఇబ్బందవుతుందేమోననే ఉద్దేశంతో సున్నితంగా తిరస్కరించాడని సమాచారం. ఇది ప్రకాష్ రాజ్ లేదా శ్రీకాంత్ ఇద్దరిలో ఒకరికి ఇచ్చిన క్యారెక్టరేనని ఇంకో వెర్షన్ వినిపిస్తోంది.
ఆది పురుష్ లో పది తలల రావణాసురుడిగా చేసిన సైఫ్ అలీఖాన్ కు దాని గెటప్ విషయంలో నెగటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఇది తనకు సంబంధం లేని వ్యవహారమే అయినా దక్షిణాది ప్రేక్షకులకు నేరుగా పరిచయం కావడం కోసం ఎదురు చూస్తున్న సైఫ్ ని ఈ స్పందన సంతోషపెట్టలేదు. దీని సంగతలా ఉంచితే పలు జాతీయ అంతర్జాతీయ సాంకేతిక నిపుణులు చేస్తున్న ఎన్టీఆర్ 30 విడుదలకు సరిగ్గా ఏడాది సమయం ఉంది. ఆచార్య గాయం మానాలనే కసితో కొరటాల శివ ఈ ప్రాజెక్టు మీద పని చేస్తున్నారు. అరవింద సమేత వీరరాఘవ తర్వాత ఏకంగా అయిదేళ్ల గ్యాప్ తో సోలో హీరోగా తారక్ చేస్తున్న మూవీ ఇది.
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…