జూనియర్ ఎన్టీఆర్ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ ప్యాన్ ఇండియా మూవీ మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఎగ్జైట్ మెంట్ ని చూసి చెప్పొచ్చు. ఏడాదికి పైగా నిరీక్షణకు తెరదించుతూ ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టడం, సెట్లో తారక్ అడుగు పెట్టిన వీడియోకు భారీ స్పందన రావడం అభిమానులను సంతోషంలో ముంచెత్తింది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ టాలీవుడ్ కు దీని ద్వారానే పరిచయం కానుండగా కొంత గ్యాప్ తర్వాత అనిరుద్ రవిచందర్ తెలుగు సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు.
ఇందులో మెయిన్ విలన్ గా సైఫ్ అలీఖాన్ నటించబోతున్నాడనే వార్త గత కొన్ని నెలలుగా చక్కర్లు కొడుతూనే ఉంది. యూనిట్ అధికారికంగా ధృవీకరించకపోయినా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అనే రీతిలో కథనాలు వచ్చాయి. లేటెస్ట్ ముంబై అప్డేట్ ప్రకారం సైఫ్ పలు దఫాల చర్చల తర్వాత నో అన్నాడట. కారణాలు ఖచ్చితంగా తెలియకపోయినా చాలా బల్క్ డేట్లు అడగడంతో తాను ఒప్పుకున్న ఇతర హిందీ సినిమాలకు ఇబ్బందవుతుందేమోననే ఉద్దేశంతో సున్నితంగా తిరస్కరించాడని సమాచారం. ఇది ప్రకాష్ రాజ్ లేదా శ్రీకాంత్ ఇద్దరిలో ఒకరికి ఇచ్చిన క్యారెక్టరేనని ఇంకో వెర్షన్ వినిపిస్తోంది.
ఆది పురుష్ లో పది తలల రావణాసురుడిగా చేసిన సైఫ్ అలీఖాన్ కు దాని గెటప్ విషయంలో నెగటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఇది తనకు సంబంధం లేని వ్యవహారమే అయినా దక్షిణాది ప్రేక్షకులకు నేరుగా పరిచయం కావడం కోసం ఎదురు చూస్తున్న సైఫ్ ని ఈ స్పందన సంతోషపెట్టలేదు. దీని సంగతలా ఉంచితే పలు జాతీయ అంతర్జాతీయ సాంకేతిక నిపుణులు చేస్తున్న ఎన్టీఆర్ 30 విడుదలకు సరిగ్గా ఏడాది సమయం ఉంది. ఆచార్య గాయం మానాలనే కసితో కొరటాల శివ ఈ ప్రాజెక్టు మీద పని చేస్తున్నారు. అరవింద సమేత వీరరాఘవ తర్వాత ఏకంగా అయిదేళ్ల గ్యాప్ తో సోలో హీరోగా తారక్ చేస్తున్న మూవీ ఇది.
This post was last modified on April 4, 2023 12:42 pm
టాలీవుడ్ లోనే కాదు బయట రాష్ట్రాల్లో కూడా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అంటే ఒక బ్రాండ్. తీసింది కేవలం…
‘హనుమాన్’ సినిమాతో రెండున్నరేళ్ల ముందు దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎంతటి సంచలనం రేపాడో తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో ఈ…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో రాజమౌళి, అనిల్ రావిపూడిలను పక్కన పెడితే డిజాస్టర్లు లేని దర్శకులు లేరు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్…
ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ కాక డిజాస్టర్లుగా నిలిచిపోయిన సినిమాలు ఇప్పుడు రీ రిలీజ్ టైంలో అద్భుతాలు చేయడం చూస్తూనే…
అందం అభినయం రెండూ ఉన్న కియారా అద్వానీతో అదృష్టం దోబూచులాడుతోంది. ఒకదశలో కరీనా కపూర్ ఎంజాయ్ చేసిన స్టార్ డం…
ఏపీ సీఎం చంద్రబాబు కీలక విషయాన్ని ప్రజలతో పంచుకున్నారు. 30 ఏళ్ల కిందట తాను చేసిన శంకు స్థాపన తాలూకు…