ఏడాదిన్నర కిందట పెద్ద కష్టమే వచ్చి పడింది సాయిధరమ్తేజ్కు. అతను హైదరాబాద్లో బైక్ మీద వెళ్తూ జారి పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో కొన్ని వారాల పాటు ఉన్న అతను.. పూర్తిగా కోలుకుని బయటికి రావడానికి చాలా నెలలే పట్టింది. అలా కోలుకుని వచ్చాక చేసిన సినిమా.. ‘విరూపాక్ష’. తేజు ఆసుపత్రిలో ఉండగానే రిలీజైన ‘రిపబ్లిక్’ సినిమా సరిగా ఆడలేదు. తేజు మీద ఉన్న సింపతీ కూడా అప్పుడు పెద్దగా వర్కవుట్ కాలేదు. ఇప్పుడు ‘విరూపాక్ష’ పరిస్థితి ఏమవుతుందో చూడాలి.
ఐతే ఈ నెల 21న రిలీజవుతున్న ఈ చిత్రాన్ని తన మీద జాలితో చూడొద్దు అంటున్నాడు తేజు. ప్రేక్షకుల నుంచి తాను కోరుకునేది జాలి కాదని.. ప్రేమ అని అతనన్నాడు. మంచి సినిమాతో వస్తున్నానని.. ఇది అందరినీ అలరించే థ్రిల్లర్ సినిమా అని.. మంచి సినిమాను ప్రేమతో ఆదరించాలని అతను వ్యాఖ్యానించాడు.
‘విరూపాక్ష’ ఎలా మొదలైంది, సినిమా ఎలా వచ్చింది అతను వివరిస్తూ.. “2019లో సుకుమార్ గారు ఒకసారి ఫోన్ చేసి ఒక కథ ఉంది, నువ్వు వింటే తప్పకుండా చేస్తావు అన్నారు. ఆయన అసిస్టెంట్ కార్తీక్ దండు వచ్చి నాకు కథ చెప్పాడు. అది వినగానే బ్లాక్ బస్టర్ అవుతుందన్న నమ్మకం కలిగి ఈ సినిమా చేశా. త్వరలోనే నా నమ్మకం నిజం అవుతుంది. మంచి థ్రిల్లర్ సినిమా ఇది. గొప్పగా ఉంటుంది. కథ వింటున్నపుడు ఏమనిపించిందో డబ్బింగ్ చెబుతూ సినిమా చూస్తే అదే ఫీలింగ్ కలిగింది. అంత పర్ఫెక్ట్గా సినిమా తీశాడు కార్తీక్. ఏప్రిల్ 21న సినిమా వస్తోంది. దయచేసి అందరూ థియేటర్లకు వచ్చి సినిమా చూడండి. నేను ఎవరి నుంచీ జాలిని కోరుకోవట్లేదు. ప్రేమను ఆశిస్తున్నా. మీ అంచనాలను మించి సినిమా ఉంటుంది” అని తేజు అన్నాడు. ‘విరూపాక్ష’లో తేజు సరసన మలయాళ హీరోయిన్ సంయుక్త నటించింది.
This post was last modified on April 3, 2023 1:42 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…