కథానాయికలుగా ఒక ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాక హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేయాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఇంతకుముందులాగా కెరీర్ ముగింపు దశలోనే ఆ తరహా చిత్రాలు చేయడం లేదు ఇప్పటి హీరోయిన్లు. ఓవైపు స్టార్ హీరోల సరసన పెద్ద సినిమాల్లో గ్లామర్ రోల్స్ చేస్తూనే మరోవైపు హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తున్నారు.
కొంచెం ముందుతరంలో అనుష్క, సమంత, కాజల్, తమన్నా.. ఇలా చాలామంది టాలీవుడ్ హీరోయిన్లు కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో నటించారు. ఇప్పుడు ఈ జాబితాలోకి రష్మిక మందన్నా కూడా చేరుతోంది. ఇప్పటిదాకా పలు భాషల్లో హీరోల పక్కన జోడీగానే నటిస్తూ వచ్చిన రష్మిక.. తొలిసారి తనే లీడ్ రోల్లో సినిమా చేయబోతోంది. ఆ సినిమా సోమవారమే ప్రారంభోత్సవం జరుపుకుంది.
తమిళంలో ప్రముఖ ప్రొడక్షన్ హౌజ్ అయిన డ్రీమ్ వారియర్ పిక్చర్స్.. రష్మిక తొలి లేడీ ఓరియెంటెడ్ సినిమాను ప్రొడ్యూస్ చేస్తోంది. ‘రెయిన్బో’ టైటిల్తో రానున్న ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు భాషల్లో ఒకేసారి తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని శాంతరూబన్ అనే కొత్త దర్శకుడు రూపొందించనున్నాడు. అతను ఇంతకుముందు షార్ట్ ఫిలిమ్స్ తీశాడు. ఒక యునీక్ సబ్జెక్టుతో ఈ చిత్రం తెరకెక్కనుందట. ఖాకి, ఖైదీ సహా తమిళంలో పలు చత్రాలను నిర్మించిన డ్రీమ్ వారియర్స్ అధినేతలు ఎస్.ఆర్.ప్రభు, సురేష్ బాబులకిది 30వ సినిమా. కొంచెం పెద్ద బడ్జెట్లోనే సినిమాను నిర్మించబోతున్నారట.
జాతీయ స్థాయిలో మంచి ఫాలోయింగ్ ఉన్న రష్మిక.. తొలిసారి నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ మూవీ కావడంతో ఇది ప్రత్యేకంగానే ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం రష్మిక తెలుగులో పుష్ప-2తో పాటు నితిన్-వెంకీ కుడుముల సినిమాలోనూ నటిస్తోంది. హిందీలో రణబీర్ కపూర్ సరసన సందీప్ రెడ్డి రూపొందిస్తున్న యానిమల్లోనూ కథానాయికగా చేస్తోంది.
This post was last modified on April 3, 2023 11:38 am
ఎన్నికల రాజకీయాల్లో ఆరితేరిన ప్రధాని నరేంద్ర మోడీ.. సమయం.. సందర్భంతోపాటు సెంటిమెంటుకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. సాధారణ ప్రజలకు అత్యంతచేరువ…
రెండేళ్ల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సూపర్ 6 పేరిట ఇచ్చిన హామీలు బాగా…
ఏపీలో కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ ఇప్పుడు కేరళకు కూడా విస్తరించింది. తాజాగా ఆ పార్టీ విస్తరణపై…
చిన్న స్థాయి హీరోయిన్లు, టీవీ ఆర్టిస్టులు తమ సోషల్ మీడియా అకౌంట్లను సబ్స్క్రిప్షన్ మోడ్లోకి మార్చి, వాటి ద్వారా హాట్…
టాలీవుడ్ సినీ ప్రియులు అంత సులభంగా మర్చిపోలేని ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాల్లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా ఒకటి. సిద్దార్థ్, త్రిష జంటగా…
రాకా.. ప్రస్తుతం ఇండియాలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీస్లో ఒకటి. పుష్ప-2 లాంటి సెన్సేషనల్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్…