తెలుగు స్టార్ హీరోలకు ముందు నుంచి తమిళ దర్వకులంటే మోజే. కానీ అక్కడి దర్శకులు మన హీరోలకు ఎక్కువగా ఫెయిల్యూర్లే అందించారు. తమిళంలో బ్లాక్బస్టర్ల మీద బ్లాక్బస్టర్లు కొట్టిన మురుగదాస్ సైతం తెలుగులో రెండు ఫెయిల్యూర్ సినిమాలే ఇచ్చాడు. చిరంజీవితో చేసిన స్టాలిన్ అయినా కాస్త పర్వాలేదు కానీ.. మహేష్ బాబుతో ఆయన తీసిన స్పైడర్ మాత్రం పెద్ద డిజాస్టరే అయింది.
మురుగదాస్ టాప్ ఫాంలో ఉండగా చేసిన ఈ సినిమా అంచనాలను అందుకోలేక ఘోరంగా దెబ్బ తింది. మురుగదాస్ పతనం కూడా ఈ సినిమాతోనే మొదలై, ఆ తర్వాత ఒక్క సక్సెస్ ఫుల్ సినిమా కూడా అందించలేకపోయాడు. ప్రస్తుతం ఆయన సినిమానే చేయకుండా ఖాళీగా ఉన్నాడు. ఐతే తన నిర్మాణంలో తెరకెక్కిన 1947 అనే సినిమా తెలుగు వెర్షన్ ప్రమోషన్ల కోసం హైదరాబాద్కు వచ్చిన మురుగదాస్.. స్పైడర్ ఫెయిల్యూర్ గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిచ్చాడు.
రీమేక్ సినిమాలను పక్కన పెడితే.. హిట్, ప్లాప్ అని తేడా లేకుండా ప్రతి సినిమాకూ ఒకేలా కష్టపడతామని.. స్పైడర్ విషయంలోనూ అలాగే కష్టపడ్డామని మురుగదాస్ తెలిపాడు. ప్రేక్షకుల అంచనాలు, దర్శకుల క్రియేటివిటీ కలిసినపుడు హిట్ సినిమా వస్తుందని.. అలా కానపుడు ఫెయిల్యూర్ ఎదురవుతుందని మురుగదాస్ అన్నాడు.
స్పైడర్ ఫెయిల్యూర్ తనను నిరాశకు గురి చేసిందని, మహేష్ బాబుకు హిట్ ఇవ్వలేకపోయానే అని బాధ పడ్డానని.. కానీ మహేష్తో మళ్లీ కచ్చితంగా సినిమా చేస్తానని, హిట్ కొడతానని మురుగదాస్ ధీమా వ్యక్తం చేశాడు. ఇక అల్లు అర్జున్తో సినిమా చేసే విషయమై మాట్లాడుతూ.. ప్రతి దర్శకుడూ పది మంది హీరోలను కలుస్తాడని, అలాగే హీరో కూడా పదిమంది దర్శకులను మీట్ అవుతాడని.. కానీ ఎవరితో సినిమా కుదురుతుందో చెప్పలేమని.. అల్లు అర్జున్తో తన సినిమా చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయని మురుగదాస్ తెలిపాడు.
This post was last modified on April 2, 2023 8:47 am
సరిగ్గా వారం రోజుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేస్తాడు. థియేటర్ యజమానులు ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నారు. కేవలం…
ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు…
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…