సీనియర్ దర్శక నిర్మాత వైవీఎస్ చౌదరి రూపొందించిన సూపర్ హిట్ సినిమా ‘లాహిరి లాహిరి లాహిరిలో’ గుర్తుందా? అందులో హరికృష్ణ సహా చాలా మంది టాలీవుడ్ సీనియర్ నటీనటులు ముఖ్య పాత్రలు పోషించగా.. అంకితకు జోడీగా ఉత్తరాది కుర్రాడు ఆదిత్య ఓం నటించాడు. జేడీ చక్రవర్తి తరహాలో ఎప్పుడూ గడ్డంతో కనిపిస్తూ కొంత కాలం టాలీవుడ్లో బాగానే సందడి చేశాడు ఆదిత్య.
‘లాహిరి లాహిరి లాహిరిలో’ తర్వాత ‘ధనలక్ష్మీ ఐ లవ్యూ’ సహా కొన్ని చిత్రాల్లో నటించిన అతను.. ఆపై దర్శకుడిగా కూడా మారి ఓ సినిమాను రూపొందించాడు. కానీ ఉన్నట్లుండి అతను టాలీవుడ్ నుంచి అంతర్ధానం అయిపోయాడు. చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు ఇప్పుడు అతను ‘దహనం’ అనే సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు. మూర్తి స్థాయి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆరు అంతర్జాతీయ అవార్డులు అందుకోవడం విశేషం.
‘దహనం’ రిలీజ్ సందర్భ:గా మీడియాను కలిసిన ఆదిత్య.. టాలీవుడ్లో అవకాశాలు తగ్గిపోయాక తాను డిప్రెషన్లోకి వెళ్లిపోయినట్లు వెల్లడించాడు. ఒక దశలో రోజుకు 60 సిగరెట్లు తాగేవాడినని, విపరీతంగా మద్యపానం చేసేవాడినని అతను చెప్పడం విశేషం. కానీ తర్వాత ఆ దురలవాట్లకు దూరమైనట్లు వెల్లడించాడు.
“నా కెరీర్లో అనుకోకుండా విరామం వచ్చింది. డిప్రెషన్ అందరి జీవితాల్లోనూ ఉండేదే. నేను కూడా దాన్ని ఎదుర్కొన్నా. రోజుకు 60 సిగరెట్లు తాగా. మద్యం కూడా తాగా. కానీ నా కుటుంబ సభ్యుల సహకారంతో ఆ దశను అధిగమించా. 2017లో ఒక రోజు నిద్ర లేచి ఇక సిగరెట్ తాగకూడదు, మందు ముట్టకూడదు అని బలంగా నిర్ణయించుకున్నా. దానికి కట్టుబడే ఉన్నా. మళ్లీ ఆరోగ్యవంతుడిని అయ్యా. కెరీర్లో చాలా గ్యాప్ రావడంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొన్నా. నువ్వింకా బతికే ఉన్నావా అని చాలామంది కామెంట్ చేశారు” అని ఆదిత్య తెలిపాడు.
This post was last modified on April 2, 2023 8:34 am
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో వారమే సమయం ఉంది. ఈ ఎన్నికలు ఇటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్కు, అటు ప్రతిపక్ష…
‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్టో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇండియాలో అత్యంత ఆదరణ పొందిన…
ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం భారీ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా జగన్ ప్రబుత్వం అమలు చేస్తున్న పథకాలను ఎన్నికల…
రాజమండ్రిలో నిర్వహించిన కూటమి పార్టీల(జనసేన-బీజేపీ-టీడీపీ) ఎన్నికల ప్రచార సభ 'ప్రజాగళం'లో చంద్రబాబు పాల్గొన లేక పోయారు. ఆయన వేరే సభలో…
మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు రానుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే కేంద్రంలోనూ…