సీనియర్ దర్శక నిర్మాత వైవీఎస్ చౌదరి రూపొందించిన సూపర్ హిట్ సినిమా ‘లాహిరి లాహిరి లాహిరిలో’ గుర్తుందా? అందులో హరికృష్ణ సహా చాలా మంది టాలీవుడ్ సీనియర్ నటీనటులు ముఖ్య పాత్రలు పోషించగా.. అంకితకు జోడీగా ఉత్తరాది కుర్రాడు ఆదిత్య ఓం నటించాడు. జేడీ చక్రవర్తి తరహాలో ఎప్పుడూ గడ్డంతో కనిపిస్తూ కొంత కాలం టాలీవుడ్లో బాగానే సందడి చేశాడు ఆదిత్య.
‘లాహిరి లాహిరి లాహిరిలో’ తర్వాత ‘ధనలక్ష్మీ ఐ లవ్యూ’ సహా కొన్ని చిత్రాల్లో నటించిన అతను.. ఆపై దర్శకుడిగా కూడా మారి ఓ సినిమాను రూపొందించాడు. కానీ ఉన్నట్లుండి అతను టాలీవుడ్ నుంచి అంతర్ధానం అయిపోయాడు. చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు ఇప్పుడు అతను ‘దహనం’ అనే సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు. మూర్తి స్థాయి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆరు అంతర్జాతీయ అవార్డులు అందుకోవడం విశేషం.
‘దహనం’ రిలీజ్ సందర్భ:గా మీడియాను కలిసిన ఆదిత్య.. టాలీవుడ్లో అవకాశాలు తగ్గిపోయాక తాను డిప్రెషన్లోకి వెళ్లిపోయినట్లు వెల్లడించాడు. ఒక దశలో రోజుకు 60 సిగరెట్లు తాగేవాడినని, విపరీతంగా మద్యపానం చేసేవాడినని అతను చెప్పడం విశేషం. కానీ తర్వాత ఆ దురలవాట్లకు దూరమైనట్లు వెల్లడించాడు.
“నా కెరీర్లో అనుకోకుండా విరామం వచ్చింది. డిప్రెషన్ అందరి జీవితాల్లోనూ ఉండేదే. నేను కూడా దాన్ని ఎదుర్కొన్నా. రోజుకు 60 సిగరెట్లు తాగా. మద్యం కూడా తాగా. కానీ నా కుటుంబ సభ్యుల సహకారంతో ఆ దశను అధిగమించా. 2017లో ఒక రోజు నిద్ర లేచి ఇక సిగరెట్ తాగకూడదు, మందు ముట్టకూడదు అని బలంగా నిర్ణయించుకున్నా. దానికి కట్టుబడే ఉన్నా. మళ్లీ ఆరోగ్యవంతుడిని అయ్యా. కెరీర్లో చాలా గ్యాప్ రావడంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొన్నా. నువ్వింకా బతికే ఉన్నావా అని చాలామంది కామెంట్ చేశారు” అని ఆదిత్య తెలిపాడు.
This post was last modified on April 2, 2023 8:34 am
ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…
వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం…
ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…
గజ్వేల్ నియోజకవర్గం.. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కంచుకోట. అయితే.. ఇక్కడే పాగా వేయాలని.. వచ్చే…
తమిళంలో డెబ్యూతోనే సూపర్ హిట్ అందుకున్న సుహాస్ గురించి చెన్నై మండాడి సక్సెస్ మీట్ లో దర్శకుడు చేసిన కామెంట్స్…
అక్టోబర్ 2 ఆదర్శ కుటుంబం ఏకె 47 వస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం కానీ సందీప్ కిషన్ సిగ్మా రిలీజవుతోంది.…