సీనియర్ దర్శక నిర్మాత వైవీఎస్ చౌదరి రూపొందించిన సూపర్ హిట్ సినిమా ‘లాహిరి లాహిరి లాహిరిలో’ గుర్తుందా? అందులో హరికృష్ణ సహా చాలా మంది టాలీవుడ్ సీనియర్ నటీనటులు ముఖ్య పాత్రలు పోషించగా.. అంకితకు జోడీగా ఉత్తరాది కుర్రాడు ఆదిత్య ఓం నటించాడు. జేడీ చక్రవర్తి తరహాలో ఎప్పుడూ గడ్డంతో కనిపిస్తూ కొంత కాలం టాలీవుడ్లో బాగానే సందడి చేశాడు ఆదిత్య.
‘లాహిరి లాహిరి లాహిరిలో’ తర్వాత ‘ధనలక్ష్మీ ఐ లవ్యూ’ సహా కొన్ని చిత్రాల్లో నటించిన అతను.. ఆపై దర్శకుడిగా కూడా మారి ఓ సినిమాను రూపొందించాడు. కానీ ఉన్నట్లుండి అతను టాలీవుడ్ నుంచి అంతర్ధానం అయిపోయాడు. చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు ఇప్పుడు అతను ‘దహనం’ అనే సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు. మూర్తి స్థాయి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆరు అంతర్జాతీయ అవార్డులు అందుకోవడం విశేషం.
‘దహనం’ రిలీజ్ సందర్భ:గా మీడియాను కలిసిన ఆదిత్య.. టాలీవుడ్లో అవకాశాలు తగ్గిపోయాక తాను డిప్రెషన్లోకి వెళ్లిపోయినట్లు వెల్లడించాడు. ఒక దశలో రోజుకు 60 సిగరెట్లు తాగేవాడినని, విపరీతంగా మద్యపానం చేసేవాడినని అతను చెప్పడం విశేషం. కానీ తర్వాత ఆ దురలవాట్లకు దూరమైనట్లు వెల్లడించాడు.
“నా కెరీర్లో అనుకోకుండా విరామం వచ్చింది. డిప్రెషన్ అందరి జీవితాల్లోనూ ఉండేదే. నేను కూడా దాన్ని ఎదుర్కొన్నా. రోజుకు 60 సిగరెట్లు తాగా. మద్యం కూడా తాగా. కానీ నా కుటుంబ సభ్యుల సహకారంతో ఆ దశను అధిగమించా. 2017లో ఒక రోజు నిద్ర లేచి ఇక సిగరెట్ తాగకూడదు, మందు ముట్టకూడదు అని బలంగా నిర్ణయించుకున్నా. దానికి కట్టుబడే ఉన్నా. మళ్లీ ఆరోగ్యవంతుడిని అయ్యా. కెరీర్లో చాలా గ్యాప్ రావడంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొన్నా. నువ్వింకా బతికే ఉన్నావా అని చాలామంది కామెంట్ చేశారు” అని ఆదిత్య తెలిపాడు.
This post was last modified on April 2, 2023 8:34 am
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…