Movie News

అందరూ తగ్గిస్తుంటే ఆమె మాత్రం..

లాక్ డౌన్ వల్ల దారుణంగా దెబ్బ తిన్న రంగాల్లో ఫిలిం ఇండస్ట్రీ ఒకటి. నిర్మాతల కష్టం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆల్రెడీ పూర్తి చేసిన సినిమాలు విడుదలకు నోచుకోక వడ్డీల భారం పెరిగిపోతోంది. చిత్రీకరణ మధ్యలో ఉన్న సినిమాల బడ్జెట్టూ పెరిగిపోతోంది. లాక్ డౌన్ వేళ స్టాఫ్‌ను మెయింటైన్ చేయడం తలకు మించిన భారంగా మారిపోయింది. చిత్రీకరణలకు అనుమతులిచ్చినా.. అనేక పరిమితుల మధ్య, అదనంగా ఖర్చు పెట్టుకుని షూటింగ్స్ చేయడమూ కష్టంగా ఉంది. దీంతో నిర్మాతలు పూర్తిగా మునిగిపోయే పరిస్థితికి వచ్చారు. ఇది చూసి వివిధ ఇండస్ట్రీల్లో నటీనటులు, టెక్నీషియన్లు పరిస్థితులు చక్కబడే వరకు పారితోషకాలు తగ్గించుకోవడంపై చర్చలు నడుస్తున్నాయి. కోలీవుడ్లో ఇప్పటికే ఈ మేరకు నిర్ణయం కూడా జరిగినట్లు వార్తలొచ్చాయి. కొందరు ఆర్టిస్టులు స్వచ్ఛందంగా పారితోషకాలు తగ్గిస్తున్నారు కూడా.

టాలీవుడ్లోనూ ఇది అమలు చేయక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. ఐతే నిర్మాతలు పారితోషకాలు తగ్గించడం గురించి ఆలోచిస్తుంటే.. ఇలాంటి సమయంలో ఓ కథానాయిక తన పారితోషకాన్ని మరింత పెంచినట్లు వార్తలొస్తుండటం విశేషం. ఆ హీరోయిన్ మరెవరో కాదు.. ప్రస్తుత టాలీవుడ్ నంబర్ వన్ అనదగ్గ పూజా హెగ్డే. అరవింద సమేత, వాల్మీకి, అల వైకుంఠపురములో.. ఇలా వరుస సక్సెస్‌లతో పూజ డిమాండ్ మామూలుగా లేదిప్పుడు. కొన్నేళ్ల వరకు ఆమె డైరీ ఖాళీగా లేదు. టాలీవుడ్లోనే కాక బాలీవుడ్లోనూ ఆమెకు భారీ ఆఫర్లు వస్తున్నాయి. ఈ డిమాండ్ చూసి… ఆమె తన పారితోషకాన్ని అర కోటి పెంచేసిందట. ఇంతకుముందు రూ.1.5 కోట్లు పుచ్చుకుంటున్న ఆమె.. ఇప్పుడు రూ.2 కోట్లు డిమాండ్ చేస్తోందట. పూజకు ఉన్న క్రేజ్, డిమాండ్, ఆమె వల్ల సినిమాకు జరిగే మేలు.. ఇలా అన్నీ చూసుకుని అడిగినంత ఇవ్వడానికి నిర్మాతలు కూడా వెనుకాడట్లేదని సమాచారం.

This post was last modified on July 31, 2020 1:52 am

Share
Show comments
Published by
suman

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

2 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

6 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

7 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

8 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

9 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

9 hours ago