Movie News

అందరూ తగ్గిస్తుంటే ఆమె మాత్రం..

లాక్ డౌన్ వల్ల దారుణంగా దెబ్బ తిన్న రంగాల్లో ఫిలిం ఇండస్ట్రీ ఒకటి. నిర్మాతల కష్టం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆల్రెడీ పూర్తి చేసిన సినిమాలు విడుదలకు నోచుకోక వడ్డీల భారం పెరిగిపోతోంది. చిత్రీకరణ మధ్యలో ఉన్న సినిమాల బడ్జెట్టూ పెరిగిపోతోంది. లాక్ డౌన్ వేళ స్టాఫ్‌ను మెయింటైన్ చేయడం తలకు మించిన భారంగా మారిపోయింది. చిత్రీకరణలకు అనుమతులిచ్చినా.. అనేక పరిమితుల మధ్య, అదనంగా ఖర్చు పెట్టుకుని షూటింగ్స్ చేయడమూ కష్టంగా ఉంది. దీంతో నిర్మాతలు పూర్తిగా మునిగిపోయే పరిస్థితికి వచ్చారు. ఇది చూసి వివిధ ఇండస్ట్రీల్లో నటీనటులు, టెక్నీషియన్లు పరిస్థితులు చక్కబడే వరకు పారితోషకాలు తగ్గించుకోవడంపై చర్చలు నడుస్తున్నాయి. కోలీవుడ్లో ఇప్పటికే ఈ మేరకు నిర్ణయం కూడా జరిగినట్లు వార్తలొచ్చాయి. కొందరు ఆర్టిస్టులు స్వచ్ఛందంగా పారితోషకాలు తగ్గిస్తున్నారు కూడా.

టాలీవుడ్లోనూ ఇది అమలు చేయక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. ఐతే నిర్మాతలు పారితోషకాలు తగ్గించడం గురించి ఆలోచిస్తుంటే.. ఇలాంటి సమయంలో ఓ కథానాయిక తన పారితోషకాన్ని మరింత పెంచినట్లు వార్తలొస్తుండటం విశేషం. ఆ హీరోయిన్ మరెవరో కాదు.. ప్రస్తుత టాలీవుడ్ నంబర్ వన్ అనదగ్గ పూజా హెగ్డే. అరవింద సమేత, వాల్మీకి, అల వైకుంఠపురములో.. ఇలా వరుస సక్సెస్‌లతో పూజ డిమాండ్ మామూలుగా లేదిప్పుడు. కొన్నేళ్ల వరకు ఆమె డైరీ ఖాళీగా లేదు. టాలీవుడ్లోనే కాక బాలీవుడ్లోనూ ఆమెకు భారీ ఆఫర్లు వస్తున్నాయి. ఈ డిమాండ్ చూసి… ఆమె తన పారితోషకాన్ని అర కోటి పెంచేసిందట. ఇంతకుముందు రూ.1.5 కోట్లు పుచ్చుకుంటున్న ఆమె.. ఇప్పుడు రూ.2 కోట్లు డిమాండ్ చేస్తోందట. పూజకు ఉన్న క్రేజ్, డిమాండ్, ఆమె వల్ల సినిమాకు జరిగే మేలు.. ఇలా అన్నీ చూసుకుని అడిగినంత ఇవ్వడానికి నిర్మాతలు కూడా వెనుకాడట్లేదని సమాచారం.

This post was last modified on July 31, 2020 1:52 am

Share
Show comments
Published by
suman

Recent Posts

సమంతా ఇంత మాస్ గా వుందేంటి

తెరమీద మళ్ళీ ఎప్పుడు కనిపిస్తుందాని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న సమంత కొత్త సినిమా తాలూకు ప్రకటన వచ్చేసింది. ఇన్స్ టాలో…

9 mins ago

రజని – కమల్ – చరణ్ ఒకే వేదికపై

కమల్ హాసన్ అభిమానులతో పాటు రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న భారతీయుడు 2కి దారి సుగమం అవుతోంది. జూన్…

15 mins ago

అమరావతి పోయినా విశాఖ వస్తుందని జగన్ నమ్మకమా?

ఏపీ రాజ‌ధాని ఏది?  అంటే.. ఇప్పుడు చెప్పుకొనే ప‌రిస్థితి లేదు. 2019కి ముందు వ‌ర‌కు రాజ‌ధాని అమ‌రావతి అని చెప్పుకొనే…

4 hours ago

గూగుల్ యాడ్స్ కే గుమ్మరించారు

దేశంలో అధికారం దక్కించుకుని హ్యాట్రిక్ కొట్టేందుకు 2018 నుండి ఇప్పటి వరకు అధికార బీజేపీ పార్టీ కేవలం గూగుల్ ప్రకటనల కోసం గుమ్మరించిన…

4 hours ago

ఏజెంట్ గారూ ఇప్పటికైనా కరుణించండి

సరిగ్గా ఏడాది క్రితం ఇదే ఏప్రిల్ 28న భారీ అంచనాల మధ్య ఏజెంట్ విడుదలైన విషయం అక్కినేని అభిమానులు అంత…

4 hours ago

కల్కి నిర్ణయం ఆషామాషీ కాదు

అందరికీ ముందే లీకైపోయిన కల్కి 2898 ఏడి విడుదల తేదీని జూన్ 27 ప్రకటించడం ఆశ్చర్యం కలిగించలేదు కానీ వేసవి…

4 hours ago