Movie News

సమంతపై సోషల్ మీడియా ఎటాక్

సినిమాల పరంగా కానీ, వ్యక్తిగత జీవితం విషయంలో కానీ.. సమంత ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. నాగచైతన్య నుంచి విడిపోయాక ఆమె వ్యక్తిగత జీవితం గురించి జరిగిన చర్చ అంతా ఇంతా కాదు. విడాకులు అనేది పూర్తిగా వ్యక్తిగత విషయం అయినా.. అందులో ఇద్దరి పాత్ర ఉన్నప్పటికీ.. సమంత మాత్రం ఈ విషయంలో సోషల్ మీడియాకు బాగా టార్గెట్ అయింది.

విడాకులను ఉద్దేశించి సోషల్ మీడియాలో ఆమె పెట్టిన ఇన్‌డైరెక్ట్ పోస్టులు.. అలాగే ‘ఊ అంటావా ఊహూ అంటావా’ లాంటి ఐటెం సాంగ్ చేయడం వల్ల ఆమె నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొంది. కానీ వాటిని పెద్దగా పట్టించుకోకుండా తనకు నచ్చిన తరహాలో ఆమె ముందుకు వెళ్లిపోతోంది. ఐతే సామ్ మరోసారి తన విడాకుల గురించి.. సోషల్ మీడియాలో తనకు ఎదురయ్యే హేట్రెడ్ గురించి చేసిన వ్యాఖ్యలు మళ్లీ పెద్ద చర్చకు దారి తీశాయి.

పెళ్లి విషయంలో తాను నూటికి నూరు శాతం చేయాల్సిందంతా చేశానని.. కానీ అది వర్కవుట్ కాలేదని.. కానీ విడాకులకు సంబంధించి తాను సోషల్ మీడియాలో చాలా వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వచ్చిందని.. అలాగే ‘ఊ అంటావా ఊహూ అంటావా’ పాట చేయడం విషయంలోనూ అభ్యంతరాలు తప్పలేదని ఆమె.. తాను తప్పు చేయనపుడు ఎందుకు భయపడాలి, వెనక్కి తగ్గాలి అని ఆమె ప్రశ్నించింది.

ఐతే ఈ కామెంట్ల విషయంలో సోషల్ మీడియా జనాలు మళ్లీ సమంతను టార్గెట్ చేస్తున్నారు. తన కొత్త చిత్రం ‘శాకుంతలం’కు హైప్ తెచ్చేందుకే సమంత ఈ కామెంట్లు చేసిందని ఆమెను విమర్శిస్తున్నారు. తన సినిమాల రిలీజ్ టైంలో సమంత కావాలనే విడాకులు, సోషల్ మీడియా హేట్రెడ్ విషయంలో అతిగా స్పందిస్తోందని.. విక్టిమ్ కార్డ్ ప్లే చేయడం ద్వారా సినిమాలకు ప్రయోజనం చేకూర్చాలని చూస్తోందని.. మిగతా సమయాల్లో కాకుండా కేవలం తన సినిమాలు రిలీజవుతున్నపుడే ఈ రకమైన కామెంట్లు చేయడంలో ఆమెకు వేరే ఉద్దేశాలు ఉన్నాయని ఒక వర్గం సమంతను అదే పనిగా టార్గెట్ చేస్తుండటం గమనార్హం.

This post was last modified on March 31, 2023 11:09 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

50 minutes ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

1 hour ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

2 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

3 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

3 hours ago

రాంబాబు రావడమే ఆలస్యం

మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…

3 hours ago