ఏడు నెలల దూరంలో ఉండగానే దసరా పండగ టాలీవుడ్ బాక్సాఫీస్ ని వేడెక్కిస్తోంది. సంక్రాంతి రేంజ్ లో నువ్వా నేనా అంటూ స్టార్ హీరోల సినిమాలు తలపడబోతున్నాయి. తాజాగా బాలకృష్ణ – దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ చిత్రం విజయదశమికి ఆయుధపూజ జరుపుకోబోతోందంటూ ఓ కొత్త పోస్టర్ తో అధికారిక ప్రకటన ఇచ్చారు.
అది అక్టోబర్ 20 లేదా 21 అనే స్పష్టత ఇవ్వలేదు కానీ రెండు డేట్లలో ఒకటి ఖాయంగా ఉండబోతోంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల ప్రత్యేక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. సీరియస్ లుక్ తో వెనుక దుర్గాదేవి శత్రుసంహారం చేస్తున్న విగ్రహాన్ని బ్యాక్ గ్రౌండ్ లో పెట్టడం చూస్తే అనిల్ రావిపూడి తన రెగ్యులర్ కామెడీ స్టైల్ కి భిన్నంగా ఏదో పవర్ ఫుల్ సెటప్ ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది.
అఖండ, వీరసింహారెడ్డి తర్వాత తమన్ వరసగా బాలయ్యతో పని చేస్తున్న మూడో కాంబో ఇది. ఇక పోటీ విషయానికి వస్తే రవితేజ టైగర్ నాగేశ్వరరావు రెండు రోజుల క్రితమే పండక్కు వస్తున్నామని చెప్పింది. రామ్ బోయపాటిలు ఆల్రెడీ లాక్ చేసుకున్నారు. ఇవి కాకుండా విజయ్ లోకేష్ కనగరాజ్ లియో మీద తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి క్రేజ్ ఉంది
ఎవరు డ్రాప్ అవుతారు ఎవరు నిలుస్తారనేది ఇప్పుడే చెప్పలేం కానీ ఇంత హైప్ ఉన్న సినిమాలు ఒకేసారి దసరాకు తలపడటం మాత్రం అరుదే. సంక్రాంతికి ఆల్రెడీ రిజర్వేషన్స్ అయ్యాయి కాబట్టి విజయదశమి కంటే వేరే ఆప్షన్ లేదు. దీపావళికి తెలుగు మార్కెట్ లో అంతగా వర్కౌట్ అవ్వదు. అందుకే అందరూ దసరా మీద గురి పెడుతున్నారు. వరస సక్సెస్ లతో మంచి ఊపుమీదున్న బాలయ్య 2023లో రెండుసార్లు అభిమానులను అలరించబోతున్నారు. ప్రస్తుతం షూటింగ్ మంచి స్వింగ్ లో ఉంది. ఆగస్ట్ లోగా మొత్తం పూర్తి చేసేలా ప్లాన్ చేసుకున్నారు.
This post was last modified on March 31, 2023 2:23 pm
రాజమండ్రిలో నిర్వహించిన కూటమి పార్టీల(జనసేన-బీజేపీ-టీడీపీ) ఎన్నికల ప్రచార సభ 'ప్రజాగళం'లో చంద్రబాబు పాల్గొన లేక పోయారు. ఆయన వేరే సభలో…
మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు రానుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే కేంద్రంలోనూ…
ఆంధ్రప్రదేశ్లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…
కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…