బాలీవుడ్లో సక్సెస్ రేట్ ఎంతగా పడిపోయిందో తెలిసిందే. కరోనా తర్వాత బాగా దెబ్బ తిన్న ఆ ఇండస్ట్రీలో పెద్ద హిట్లు అందుకున్న హీరోలు చాలామంది. అందులోనూ వరుసగా రెండు హిట్లు అందుకున్న హీరోలైతే ఒక్కరూ లేరు. ‘సూర్యవంశీ’తో హిట్ కొట్టిన అక్షయ్.. ఆ తర్వాత వరుసగా పరాజయాలు ఎదుర్కొన్నాడు. ‘భూల్ భులయియా-2’తో సక్సెస్ సాధించిన కార్తీక్ ఆర్యన్.. ‘షెజాదా’తో బోల్తా కొట్టాడు.
రణబీర్ సింగ్ ‘బ్రహ్మాస్త్ర’తో ఓ మోస్తరు సక్సెస్ అందుకుని, తర్వాత ‘తూ ఝూటి.. మై మక్కర్’తో అలాంటి ఫలితమే అందుకున్నాడు. ‘పఠాన్’తో బ్లాక్ బస్టర్ కొట్టిన షారుఖ్.. ‘జవాన్’తో ఎలాంటి పలితాన్ని అందుకుంటాడో చూడాలి. కొవిడ్ తర్వాత వరుసగా రెండు సూపర్ హిట్లు కొట్టిన హీరోలైతే బాలీవుడ్లో ఎవ్వరూ లేరు. ఇప్పుడు ఆ రికార్డును అజయ్ దేవగణ్ సొంతం చేసుకునేలా ఉన్నాడు.
అజయ్ ఆల్రెడీ గత ఏడాది ‘దృశ్యం-2’తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇప్పుడు ఆయన కొత్త సినిమా ‘భోళా’ సూపర్ హిట్ టాక్తో మొదలైంది. ఇది తమిళ బ్లాక్ బస్టర్ ‘ఖైదీ’కి రీమేక్. దీన్ని హిందీలో చాలా వరకు మార్చి స్వీయ దర్శకత్వంలో తెరకెెక్కించాడు అజయ్. ఈ చిత్రం త్రీడీలో తెరకెక్కడం విశేషం. ఈ రోజే భారీ అంచనాల మధ్య వచ్చిన ‘భోళా’కు సూపర్ హిట్ టాక్ వస్తోంది.
సమీక్షకులే కాక.. సామాన్య ప్రేక్షకులు కూడా సినిమాను కొనియాడుతున్నారు. పక్కా పైసా వసూల్ ఎంటర్టైనర్ అంటున్నారు. తమిళంతో పోలిస్తే హిందీలో చేసిన మార్పులు బాగానే వర్కవుట్ అయ్యాయంటున్నారు. అమలా పాల్తో ముడిపడ్డ ఫ్లాష్ బ్యాక్ సినిమాకు ఆకర్షణగా మారిందట. త్రీడీలో యాక్షన్ ఘట్టాలు చాలా బాగా వచ్చాయట. సినిమా కల్ట్ మూవీ అని ఎవరూ అనట్లేదు కానీ.. పక్కా పైసా వసూల్ ఎంటర్టైనర్ అని తీర్మానిస్తున్న నేపథ్యంలో అజయ్ ఖాతాలో మరో సూపర్ హిట్ జమ అయ్యేలాగే ఉంది.
This post was last modified on March 30, 2023 12:14 pm
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై అనుచిత వ్యాఖలు చేసిన అంబటి రాంబాబును, గుంటూరులోని తన నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…