బాలీవుడ్లో సక్సెస్ రేట్ ఎంతగా పడిపోయిందో తెలిసిందే. కరోనా తర్వాత బాగా దెబ్బ తిన్న ఆ ఇండస్ట్రీలో పెద్ద హిట్లు అందుకున్న హీరోలు చాలామంది. అందులోనూ వరుసగా రెండు హిట్లు అందుకున్న హీరోలైతే ఒక్కరూ లేరు. ‘సూర్యవంశీ’తో హిట్ కొట్టిన అక్షయ్.. ఆ తర్వాత వరుసగా పరాజయాలు ఎదుర్కొన్నాడు. ‘భూల్ భులయియా-2’తో సక్సెస్ సాధించిన కార్తీక్ ఆర్యన్.. ‘షెజాదా’తో బోల్తా కొట్టాడు.
రణబీర్ సింగ్ ‘బ్రహ్మాస్త్ర’తో ఓ మోస్తరు సక్సెస్ అందుకుని, తర్వాత ‘తూ ఝూటి.. మై మక్కర్’తో అలాంటి ఫలితమే అందుకున్నాడు. ‘పఠాన్’తో బ్లాక్ బస్టర్ కొట్టిన షారుఖ్.. ‘జవాన్’తో ఎలాంటి పలితాన్ని అందుకుంటాడో చూడాలి. కొవిడ్ తర్వాత వరుసగా రెండు సూపర్ హిట్లు కొట్టిన హీరోలైతే బాలీవుడ్లో ఎవ్వరూ లేరు. ఇప్పుడు ఆ రికార్డును అజయ్ దేవగణ్ సొంతం చేసుకునేలా ఉన్నాడు.
అజయ్ ఆల్రెడీ గత ఏడాది ‘దృశ్యం-2’తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇప్పుడు ఆయన కొత్త సినిమా ‘భోళా’ సూపర్ హిట్ టాక్తో మొదలైంది. ఇది తమిళ బ్లాక్ బస్టర్ ‘ఖైదీ’కి రీమేక్. దీన్ని హిందీలో చాలా వరకు మార్చి స్వీయ దర్శకత్వంలో తెరకెెక్కించాడు అజయ్. ఈ చిత్రం త్రీడీలో తెరకెక్కడం విశేషం. ఈ రోజే భారీ అంచనాల మధ్య వచ్చిన ‘భోళా’కు సూపర్ హిట్ టాక్ వస్తోంది.
సమీక్షకులే కాక.. సామాన్య ప్రేక్షకులు కూడా సినిమాను కొనియాడుతున్నారు. పక్కా పైసా వసూల్ ఎంటర్టైనర్ అంటున్నారు. తమిళంతో పోలిస్తే హిందీలో చేసిన మార్పులు బాగానే వర్కవుట్ అయ్యాయంటున్నారు. అమలా పాల్తో ముడిపడ్డ ఫ్లాష్ బ్యాక్ సినిమాకు ఆకర్షణగా మారిందట. త్రీడీలో యాక్షన్ ఘట్టాలు చాలా బాగా వచ్చాయట. సినిమా కల్ట్ మూవీ అని ఎవరూ అనట్లేదు కానీ.. పక్కా పైసా వసూల్ ఎంటర్టైనర్ అని తీర్మానిస్తున్న నేపథ్యంలో అజయ్ ఖాతాలో మరో సూపర్ హిట్ జమ అయ్యేలాగే ఉంది.
This post was last modified on March 30, 2023 12:14 pm
మాములుగా స్టార్ హీరోల విషయంలో కంబ్యాక్, సెకండ్ ఇన్నింగ్స్ పదాలు సాధారణంగా వినిపిస్తూ ఉంటాయి. ఏదైనా గ్యాప్ వచ్చినప్పుడు లేదా…
బాక్సాఫీస్ కు ఈ ఏడాది సంక్రాంతి, ఉగాది తర్వాత అత్యంత కీలకమైన సీజన్ ఆగస్ట్ 15 స్వాతంత్ర దినోత్సవం. లాంగ్…
నితిన్ లేటెస్ట్ రిలీజ్ రాబిన్ హుడ్ బాక్సాఫీస్ ఫలితం చేదుగా వచ్చేసింది. ఎడతెరిపి లేకుండా ప్రమోషన్లు చేసినా, డేవిడ్ వార్నర్…
టాలీవుడ్ శ్రీవల్లిగా అభిమానులను సంపాదించుకున్న రష్మిక మందన్న మూడు బ్లాక్ బస్టర్లు యానిమల్, పుష్ప 2 ది రూల్, ఛావాలతో…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ ఆదివారం సాగర నగరం విశాఖపట్టణం…
ఏపీ వాణిజ్య రాజధానిగా పేరుగాంచిన విశాఖపట్టణం… గతంలో ఎలా ఉందో, భవిష్యత్తులోనూ అలాగే ఉండనుంది. వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం…