Movie News

బాలీవుడ్ రాజకీయాలపై ప్రియాంక హాట్ కామెంట్స్

ప్రపంచ స్థాయిలో అందాల కిరీటం అందుకున్న ప్రతి ఒక్కరూ సినిమాల వైపు చూడాల్సిందే. కానీ ఆ నేపథ్యంతో వచ్చిన ప్రతి ఒక్కరూ సినిమాల్లో సక్సెస్ అవుతారన్న గ్యారెంటీ లేదు. ఐశ్వర్యారాయ్ తర్వాత బాలీవుడ్లో అలా ఆధిపత్యం చలాయించిన హీరోయిన్.. ప్రియాంక చోప్రానే. కెరీర్ ఆరంభంలో కొంత ఇబ్బంది పడ్డప్పటికీ తర్వాత పెద్ద రేంజికే వెళ్లింది ప్రియాంక.

హాలీవుడ్ సినిమాలు, టీవీ షోల్లో సైతం ఆమె నటించే స్థాయికి ఎదిగింది. చివరికి హాలీవుడ్ నటుడైన నికో జోనాస్‌ను పెళ్లి కూడా చేసుకుంది. ఐతే ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కెరీర్లో ఒక దశలో తాను పడ్డ బాధలు అన్నీ ఇన్నీ కావని.. తనకు వ్యతిరేకంగా చాలామంది కుట్రలు చేశారని వాపోయింది ప్రియాంక.

ఈ కష్టాలపై ప్రియాంక ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “బాలీవుడ్లో కొందరు నన్ను ఒక మూలకు నెట్టేయడానికి ప్రయత్నించారు. నాకు అవకాశాలు రాకుండా చేయడానికి ఒక గ్రూప్ ఏర్పాటైందని నాకు తెలిసింది. ఒక దశలో సినిమా రాజకీయాలను తట్టుకోవడం నా వల్ల కాదనిపించింది. ఇక లాభం లేదని నేను బాలీవుడ్‌‌కు బ్రేక్ ఇవ్వాలని అనుకున్నా” అని చెప్పింది.

తాను హాలీవుడ్‌కు వెళ్లడం గురించి ప్రియాంక స్పందిస్తూ.. “ప్రస్తుత నా మేనేజర్ అంజులా ఆచార్య ఓ మ్యూజిక్ వీడియోలో నన్ను చూసి మీకు వరల్డ్ మ్యూజిక్ మీద ఆసక్తి ఉందా అని అడిగాడు. నేను ఓకే చెప్పి యుఎస్ వెళ్లాను. అలా ఓ కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టా. మంచి మంచి అవకాశాలు వచ్చాయి” అని ప్రియాంక తెలిపింది. ప్రస్తుతం ప్రియాంక చేతిలో ఉన్నవన్నీ దాదాపు హాలీవుడ్ ప్రాజెక్టులే. హిందీలో ‘జీలే జరా’ అనే సినిమా మాత్రం ఆమె చేయాల్సి ఉంది.

Satya

Recent Posts

అంచనాల ఒత్తిడిని ‘రామాయణ’ తట్టుకుంటుందా

ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…

2 hours ago

లవ్ స్టోరీ భయపడాల్సిన పని లేదు

ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…

3 hours ago

అయ్యగారి జోరు అదిరింది

పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…

4 hours ago

మ్యూజిక్ చిచ్చు పెట్టిన ‘గాడ్ ఆఫ్ వార్’

తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…

5 hours ago

ఎట్టకేలకు బూత్ స్థాయిపై జనసేన కన్ను

బూత్ స్థాయిలో బ‌లోపేతం అయ్యే దిశ‌గా జ‌న‌సేన క‌స‌ర‌త్తు షురూ చేసింది. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

6 hours ago

రాజధాని భూముల రచ్చలో నిజమేంటి..?

ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…

7 hours ago