Movie News

తమన్ మీద పెరుగుతున్న ఒత్తిడి

టాలీవుడ్ మోస్ట్ బిజీ అండ్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరయ్యా అంటే ముందు వినిపించే పేరు తమన్. మొన్నటిదాకా దేవిశ్రీ ప్రసాద్ కూడా ఉండేవాడు కానీ అడపాదడపా హిట్లే కానీ పెద్దగా చెప్పుకునే ఆల్బమ్స్ ఇవ్వకపోవడంతో ఆయన రెమ్యునరేషన్ భరించే వాళ్ళు తప్ప ఇంకెవరూ సాహసం చేయడం లేదు. కానీ తమన్ కేసు వేరు. టాప్ లీగ్ లో ఉన్న అగ్ర తారలందరూ అతనే కావాలని కోరి మరీ తీసుకుంటున్నారు.

ఒక్క పవన్ కళ్యాణ్ కే వరసగా నాలుగు సినిమాలు చేయాల్సి రావడాన్ని బట్టి చెప్పొచ్చు డిమాండ్ ఏ స్థాయిలో పెరుగుతుందో. టాప్ బ్యానర్స్ ఏవి వచ్చినా నో అనకుండా ఒప్పేసుకుంటున్న తమన్ ఆ కారణంగానే క్వాలిటీ తగ్గించేస్తున్నాడనే కామెంట్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. మొన్న సంక్రాంతికి రిలీజైన వారసుడులో ఒక పాట మాత్రమే ఛార్ట్ బస్టర్ అయ్యింది.

వీరసింహారెడ్డికి అఖండ స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. ముఖ్యంగా బిజిఎం అంచనాలు అందుకోలేదు. ఇటీవలే ఫస్ట్ లుక్ విడుదల చేసిన ఎస్ఎస్ఎంని 28కి సంబంధించిన కంపోజింగ్ చాలా నెమ్మదిగా సాగుతోందని ఈ కారణంగానే మహేష్ బాబు కొంత అసంతృప్తిగా ఉన్నట్టు గుసగుసలు మొదలయ్యాయి. ఆల్రెడీ ఇచ్చిన కొన్ని ట్యూన్స్ నచ్చలేదట.

గేమ్ చేంజర్, వినోదయ సితం రీమేక్, ఓజి, మహేష్ 28 ఇలా క్రేజీ ప్రాజెక్టులన్నీ తమన్ చేతిలోనే ఉన్నాయి. ఒకపక్క ఇంత టైట్ షెడ్యూల్ లో ఉండి కూడా తమన్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ కోసం రోజుల తరబడి విలువైన సమయాన్ని ఖర్చు పెట్టుకున్నాడనే విమర్శ కూడా చక్కర్లు కొడుతోంది. యాక్టర్లు ఎక్కువగా ఆడే ఆ మ్యాచ్ లో అఖిల్ తో సమానంగా తమన్ చాలా హడావిడి చేశాడు. కప్పు గెలిచారు కానీ దాని వల్ల టాలీవుడ్ కు ఒరిగేది ఏమి లేదు. అనిరుద్ రవిచందర్ తెలుగులో దూసుకురావాలని చూస్తున్న తరుణంలో తమన్ ఇకపై బెస్ట్ కాదు ఆల్ టైం గ్రేట్ ఇవ్వాల్సిందే

This post was last modified on March 28, 2023 1:43 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

2 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

2 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

4 hours ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

4 hours ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

5 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

5 hours ago