బెల్లంకొండ సాయిశ్రీనివాస్ బాలీవుడ్ డెబ్యూ ఛత్రపతి రీమేక్ షూటింగ్ ఎప్పుడో పూర్తయినా విడుదల మాత్రం అదిగో ఇదిగో అంటూ ఇప్పటిదాకా వాయిదా వేస్తూ వచ్చారు. టైటిల్ వేరే నిర్మాత దగ్గర ఉండటమే దీనికి కారణమని తర్వాత బయట పడింది. ఎలాగోలా భారీ మొత్తాన్ని ఇచ్చి ఆ పేరుని స్వంతం చేసుకున్న పెన్ స్టూడియోస్ ఎట్టకేలకు రిలీజ్ డేట్ ని ప్రకటించింది.
మే 12న థియేటర్లలో రాబోతున్నట్టు హీరో ముఖం చూపించకుండా కొత్త పోస్టర్ వదిలింది. దీనికి వివి వినాయక్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. విజయేంద్రప్రసాద్ కొన్ని కీలకమార్పులు చేశారు
ఈ విషయంలో ఛత్రపతి బృందం చాలా తెలివిగా ప్లాన్ చేసుకుంది. మే 12న చెప్పుకోదగ్గ బాలీవుడ్ రిలీజులు ఏమీ లేవు. దానికి రెండు వారాల ముందు ఆపై టూ వీక్స్ తర్వాత మొత్తం ఖాళీనే.
తెలుగులో నాగ చైతన్య కస్టడీ, తేజ సజ్జ హనుమాన్ లు ఉన్నాయి కానీ ఛత్రపతి హిందీకి తెలుగు మార్కెట్ తో పెద్దగా పని లేదు కాబట్టి కేవలం నార్త్ నే లక్ష్యంగా పెట్టుకోబోతున్నారు. ఆ కోణంలో చూస్తే సాయిశ్రీనివాస్ కు మంచి డేట్ దొరికింది. కంటెంట్ కనక మాస్ ని మెప్పిస్తే ఆటోమేటిక్ గా వసూళ్లు వచ్చేస్తాయి. కాకపోతే ప్రభాస్ ని చూసిన కళ్ళతో సూపర్ అనిపించుకోవడం సులభం కాదు.
కేవలం దీనికోసమే బెల్లం హీరో మూడేళ్లు త్యాగం చేశాడు. బాడీ బిల్డ్ చేయడంతో పాటు ముంబైలోనే మకాం పెట్టేశాడు. యూట్యూబ్ లో డబ్బింగ్ వెర్షన్ అందుబాటులో ఉన్నా సరే కోరిమరీ ఛత్రపతి చేయడం వెనుక కామెంట్స్ చాలానే వచ్చాయి. అసలే హిందీలో ఈ మధ్య వచ్చిన రీమేక్స్ అన్నీ రివర్స్ అవుతున్నాయి. షెహజాదా, సెల్ఫీలాంటివి పేరున్న యాక్టర్లు స్టార్లు ఉన్నా బోల్తా కొట్టాయి. ఈ నేపథ్యంలో సాయి శ్రీనివాస్ ముందు పెద్ద సవాలే ఉంది. మిలియన్ల కొద్ది ప్రేక్షకులు ఆన్లైన్ లో, టీవీలో చూసిన సినిమాతో పరిచయం కాబోతున్నాడు. అతని నమ్మకం ఏ స్థాయిలో నిలబడుతుందో చూడాలి.
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…