బెల్లంకొండ సాయిశ్రీనివాస్ బాలీవుడ్ డెబ్యూ ఛత్రపతి రీమేక్ షూటింగ్ ఎప్పుడో పూర్తయినా విడుదల మాత్రం అదిగో ఇదిగో అంటూ ఇప్పటిదాకా వాయిదా వేస్తూ వచ్చారు. టైటిల్ వేరే నిర్మాత దగ్గర ఉండటమే దీనికి కారణమని తర్వాత బయట పడింది. ఎలాగోలా భారీ మొత్తాన్ని ఇచ్చి ఆ పేరుని స్వంతం చేసుకున్న పెన్ స్టూడియోస్ ఎట్టకేలకు రిలీజ్ డేట్ ని ప్రకటించింది.
మే 12న థియేటర్లలో రాబోతున్నట్టు హీరో ముఖం చూపించకుండా కొత్త పోస్టర్ వదిలింది. దీనికి వివి వినాయక్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. విజయేంద్రప్రసాద్ కొన్ని కీలకమార్పులు చేశారు
ఈ విషయంలో ఛత్రపతి బృందం చాలా తెలివిగా ప్లాన్ చేసుకుంది. మే 12న చెప్పుకోదగ్గ బాలీవుడ్ రిలీజులు ఏమీ లేవు. దానికి రెండు వారాల ముందు ఆపై టూ వీక్స్ తర్వాత మొత్తం ఖాళీనే.
తెలుగులో నాగ చైతన్య కస్టడీ, తేజ సజ్జ హనుమాన్ లు ఉన్నాయి కానీ ఛత్రపతి హిందీకి తెలుగు మార్కెట్ తో పెద్దగా పని లేదు కాబట్టి కేవలం నార్త్ నే లక్ష్యంగా పెట్టుకోబోతున్నారు. ఆ కోణంలో చూస్తే సాయిశ్రీనివాస్ కు మంచి డేట్ దొరికింది. కంటెంట్ కనక మాస్ ని మెప్పిస్తే ఆటోమేటిక్ గా వసూళ్లు వచ్చేస్తాయి. కాకపోతే ప్రభాస్ ని చూసిన కళ్ళతో సూపర్ అనిపించుకోవడం సులభం కాదు.
కేవలం దీనికోసమే బెల్లం హీరో మూడేళ్లు త్యాగం చేశాడు. బాడీ బిల్డ్ చేయడంతో పాటు ముంబైలోనే మకాం పెట్టేశాడు. యూట్యూబ్ లో డబ్బింగ్ వెర్షన్ అందుబాటులో ఉన్నా సరే కోరిమరీ ఛత్రపతి చేయడం వెనుక కామెంట్స్ చాలానే వచ్చాయి. అసలే హిందీలో ఈ మధ్య వచ్చిన రీమేక్స్ అన్నీ రివర్స్ అవుతున్నాయి. షెహజాదా, సెల్ఫీలాంటివి పేరున్న యాక్టర్లు స్టార్లు ఉన్నా బోల్తా కొట్టాయి. ఈ నేపథ్యంలో సాయి శ్రీనివాస్ ముందు పెద్ద సవాలే ఉంది. మిలియన్ల కొద్ది ప్రేక్షకులు ఆన్లైన్ లో, టీవీలో చూసిన సినిమాతో పరిచయం కాబోతున్నాడు. అతని నమ్మకం ఏ స్థాయిలో నిలబడుతుందో చూడాలి.
This post was last modified on March 27, 2023 1:16 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…