బెల్లంకొండ సాయిశ్రీనివాస్ బాలీవుడ్ డెబ్యూ ఛత్రపతి రీమేక్ షూటింగ్ ఎప్పుడో పూర్తయినా విడుదల మాత్రం అదిగో ఇదిగో అంటూ ఇప్పటిదాకా వాయిదా వేస్తూ వచ్చారు. టైటిల్ వేరే నిర్మాత దగ్గర ఉండటమే దీనికి కారణమని తర్వాత బయట పడింది. ఎలాగోలా భారీ మొత్తాన్ని ఇచ్చి ఆ పేరుని స్వంతం చేసుకున్న పెన్ స్టూడియోస్ ఎట్టకేలకు రిలీజ్ డేట్ ని ప్రకటించింది.
మే 12న థియేటర్లలో రాబోతున్నట్టు హీరో ముఖం చూపించకుండా కొత్త పోస్టర్ వదిలింది. దీనికి వివి వినాయక్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. విజయేంద్రప్రసాద్ కొన్ని కీలకమార్పులు చేశారు
ఈ విషయంలో ఛత్రపతి బృందం చాలా తెలివిగా ప్లాన్ చేసుకుంది. మే 12న చెప్పుకోదగ్గ బాలీవుడ్ రిలీజులు ఏమీ లేవు. దానికి రెండు వారాల ముందు ఆపై టూ వీక్స్ తర్వాత మొత్తం ఖాళీనే.
తెలుగులో నాగ చైతన్య కస్టడీ, తేజ సజ్జ హనుమాన్ లు ఉన్నాయి కానీ ఛత్రపతి హిందీకి తెలుగు మార్కెట్ తో పెద్దగా పని లేదు కాబట్టి కేవలం నార్త్ నే లక్ష్యంగా పెట్టుకోబోతున్నారు. ఆ కోణంలో చూస్తే సాయిశ్రీనివాస్ కు మంచి డేట్ దొరికింది. కంటెంట్ కనక మాస్ ని మెప్పిస్తే ఆటోమేటిక్ గా వసూళ్లు వచ్చేస్తాయి. కాకపోతే ప్రభాస్ ని చూసిన కళ్ళతో సూపర్ అనిపించుకోవడం సులభం కాదు.
కేవలం దీనికోసమే బెల్లం హీరో మూడేళ్లు త్యాగం చేశాడు. బాడీ బిల్డ్ చేయడంతో పాటు ముంబైలోనే మకాం పెట్టేశాడు. యూట్యూబ్ లో డబ్బింగ్ వెర్షన్ అందుబాటులో ఉన్నా సరే కోరిమరీ ఛత్రపతి చేయడం వెనుక కామెంట్స్ చాలానే వచ్చాయి. అసలే హిందీలో ఈ మధ్య వచ్చిన రీమేక్స్ అన్నీ రివర్స్ అవుతున్నాయి. షెహజాదా, సెల్ఫీలాంటివి పేరున్న యాక్టర్లు స్టార్లు ఉన్నా బోల్తా కొట్టాయి. ఈ నేపథ్యంలో సాయి శ్రీనివాస్ ముందు పెద్ద సవాలే ఉంది. మిలియన్ల కొద్ది ప్రేక్షకులు ఆన్లైన్ లో, టీవీలో చూసిన సినిమాతో పరిచయం కాబోతున్నాడు. అతని నమ్మకం ఏ స్థాయిలో నిలబడుతుందో చూడాలి.
This post was last modified on March 27, 2023 1:16 pm
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…