బెల్లంకొండ సాయిశ్రీనివాస్ బాలీవుడ్ డెబ్యూ ఛత్రపతి రీమేక్ షూటింగ్ ఎప్పుడో పూర్తయినా విడుదల మాత్రం అదిగో ఇదిగో అంటూ ఇప్పటిదాకా వాయిదా వేస్తూ వచ్చారు. టైటిల్ వేరే నిర్మాత దగ్గర ఉండటమే దీనికి కారణమని తర్వాత బయట పడింది. ఎలాగోలా భారీ మొత్తాన్ని ఇచ్చి ఆ పేరుని స్వంతం చేసుకున్న పెన్ స్టూడియోస్ ఎట్టకేలకు రిలీజ్ డేట్ ని ప్రకటించింది.
మే 12న థియేటర్లలో రాబోతున్నట్టు హీరో ముఖం చూపించకుండా కొత్త పోస్టర్ వదిలింది. దీనికి వివి వినాయక్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. విజయేంద్రప్రసాద్ కొన్ని కీలకమార్పులు చేశారు
ఈ విషయంలో ఛత్రపతి బృందం చాలా తెలివిగా ప్లాన్ చేసుకుంది. మే 12న చెప్పుకోదగ్గ బాలీవుడ్ రిలీజులు ఏమీ లేవు. దానికి రెండు వారాల ముందు ఆపై టూ వీక్స్ తర్వాత మొత్తం ఖాళీనే.
తెలుగులో నాగ చైతన్య కస్టడీ, తేజ సజ్జ హనుమాన్ లు ఉన్నాయి కానీ ఛత్రపతి హిందీకి తెలుగు మార్కెట్ తో పెద్దగా పని లేదు కాబట్టి కేవలం నార్త్ నే లక్ష్యంగా పెట్టుకోబోతున్నారు. ఆ కోణంలో చూస్తే సాయిశ్రీనివాస్ కు మంచి డేట్ దొరికింది. కంటెంట్ కనక మాస్ ని మెప్పిస్తే ఆటోమేటిక్ గా వసూళ్లు వచ్చేస్తాయి. కాకపోతే ప్రభాస్ ని చూసిన కళ్ళతో సూపర్ అనిపించుకోవడం సులభం కాదు.
కేవలం దీనికోసమే బెల్లం హీరో మూడేళ్లు త్యాగం చేశాడు. బాడీ బిల్డ్ చేయడంతో పాటు ముంబైలోనే మకాం పెట్టేశాడు. యూట్యూబ్ లో డబ్బింగ్ వెర్షన్ అందుబాటులో ఉన్నా సరే కోరిమరీ ఛత్రపతి చేయడం వెనుక కామెంట్స్ చాలానే వచ్చాయి. అసలే హిందీలో ఈ మధ్య వచ్చిన రీమేక్స్ అన్నీ రివర్స్ అవుతున్నాయి. షెహజాదా, సెల్ఫీలాంటివి పేరున్న యాక్టర్లు స్టార్లు ఉన్నా బోల్తా కొట్టాయి. ఈ నేపథ్యంలో సాయి శ్రీనివాస్ ముందు పెద్ద సవాలే ఉంది. మిలియన్ల కొద్ది ప్రేక్షకులు ఆన్లైన్ లో, టీవీలో చూసిన సినిమాతో పరిచయం కాబోతున్నాడు. అతని నమ్మకం ఏ స్థాయిలో నిలబడుతుందో చూడాలి.
This post was last modified on March 27, 2023 1:16 pm
ఉమ్మడి కృష్ణాజిల్లాలోని గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు.. సత్తా చాటుకున్నారు. సాధారణ అభివృద్ధి పనులతో పాటు.. ఎవరూ ఊహించని…
నిన్న విడుదలైన బైకర్ కు పబ్లిక్ టాక్, రివ్యూస్ డీసెంట్ గా ఉన్నాయి. సినిమా చూస్తే నిరాశపడరనే అభిప్రాయం అధిక…
నిన్న విడుదలైన రాకాస, బైకర్ రెండు సినిమాలకు నెగటివ్ రెస్పాన్స్ రాలేదు. అత్యద్భుతంగా ఉన్నాయని కాదు కానీ ఒకసారి చూడొచ్చనే…
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా ఉన్న రాయపాటి శైలజ త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేయనున్నారా? అంటే…
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు.. ఏపీ సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి.. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న సునీల్కు రఘురామకు…
టీడీపీలో నాయకులు.. చంద్రబాబు కనుసన్నల్లోనే మెలుగుతున్నారా? ఆయన చెప్పినట్టే చేస్తున్నారా? అంటే.. మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…