సినీ కుటుంబంలో అబ్బాయిలందరూ ఆటోమేటిగ్గా హీరోలైపోతారు. అమ్మాయిల సంగతి మాత్రం చెప్పలేం. మెగా కుటుంబంలోని అమ్మాయిల సంగతి చూస్తే.. కొణిదెల నిహారిక కథానాయికగా అడుగు పెట్టింది. కానీ సక్సెస్ కాలేక వెనక్కి వెళ్లిపోయింది. సుశ్మిత స్టైలిస్ట్గా, ప్రొడ్యూసర్గా తన ప్రయత్నాలేవో చేస్తోంది.
ఇక ఆ కుటుంబం నుంచి అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న అమ్మాయి అల్లు అర్హనే. అల్లు అర్జున్ ముద్దుల తనయురాలైన అర్హది చిన్న వయసే. కానీ అప్పుడే ఆమె తెరంగేట్రం చేసేస్తోంది. ‘శాకుంతలం’ సినిమాలో అర్హ కీలక పాత్రలో మెరవబోతున్న సంగతి తెలిసిందే. టీజర్లో ఆమె సింహాం మీద వస్తున్న దృశ్యం హైలైట్ అయింది. సినిమాలో తన స్క్రీన్ ప్రెజెన్స్, ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఐతే ఈ సినిమాలో లీడ్ రోల్ చేసిన సమంత.. అర్హకు మంచి ఎలివేషనే ఇచ్చింది.
అల్లు అర్హ బోర్న్ సూపర్ స్టార్ అని సమంత ఎలివేషన్ ఇవ్వడం విశేషం. ‘‘అల్లు అర్హ తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. ఈ విషయంలో తన తల్లిదండ్రులను అభినందించాలి. ఎంత పెద్ద డైలాగైనా చాలా తేలికగా చెప్పేస్తుంది. తన సీన్ వచ్చినపుడల్లా నాకు చాలా ముచ్చటేసి తెలియకుండానే నవ్వుకునేదాన్ని. మొదటి రోజు షూటింగ్లో వంద మంది చైల్డ్ ఆర్టిస్టులు ఉన్నా.. అంతమందిలో అర్హ ఎలాంటి భయం లేకుండా తన డైలాగులను ధైర్యంగా చెప్పేసింది. అర్హకు నటనలో శిక్షణ అవసరం లేదు. తను పుట్టుకతోనే సూపర్ స్టార్’’ అని సామ్ పేర్కొంది. శాకుంతలం ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on March 27, 2023 6:28 am
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…