మెగా బ్రదర్స్ ఇద్దరూ కరోనా విజృంభిస్తున్న టైములో నో షూటింగ్ అంటూ ఫిక్స్ అయిపోయారు. చిరంజీవి గడ్డం, మీసాలు తీసేసి యంగ్ గా కనిపిస్తూ వుంటే, పవన్ గడ్డం, మీసాలు పెంచేసి మళ్ళీ ఎన్నికల అనంతరం లుక్ కి మారిపోయాడు. ఇదిలా వుంటే, ఈ ఏడాది చివరి వరకు షూటింగ్ కి ససేమీరా అని మెగా బ్రదర్స్ ఇద్దరూ తేల్చేయడంతో… సంక్రాంతికి వస్తుందని భావిస్తున్న వకీల్ సాబ్ ఇక అప్పుడు రాదని తేలిపోయింది.
తిరిగి షూటింగ్ మొదలు పెట్టిన తర్వాత తాపీగా అన్నీ చేసుకుని వచ్చే వేసవిలో విడుదల చేయవచ్చని పవన్ డిసైడ్ అయ్యాడు. అలాగే చిరంజీవి కూడా ఆచార్య సినిమా వచ్చే వేసవి చివర్లో విడుదలయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అప్పటికి కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టి, వాక్సిన్ కూడా వచ్చేస్తుందని, మళ్ళీ జనం మాములుగా సినిమాలకు వస్తారని భావిస్తున్నారు. అందుకే పెద్ద సినిమాలకు 2021 వేసవి బెస్ట్ టైం అని ట్రేడ్ లో కూడా చెప్పుకుంటున్నారు.
This post was last modified on July 30, 2020 10:55 am
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…