మెగా బ్రదర్స్ ఇద్దరూ కరోనా విజృంభిస్తున్న టైములో నో షూటింగ్ అంటూ ఫిక్స్ అయిపోయారు. చిరంజీవి గడ్డం, మీసాలు తీసేసి యంగ్ గా కనిపిస్తూ వుంటే, పవన్ గడ్డం, మీసాలు పెంచేసి మళ్ళీ ఎన్నికల అనంతరం లుక్ కి మారిపోయాడు. ఇదిలా వుంటే, ఈ ఏడాది చివరి వరకు షూటింగ్ కి ససేమీరా అని మెగా బ్రదర్స్ ఇద్దరూ తేల్చేయడంతో… సంక్రాంతికి వస్తుందని భావిస్తున్న వకీల్ సాబ్ ఇక అప్పుడు రాదని తేలిపోయింది.
తిరిగి షూటింగ్ మొదలు పెట్టిన తర్వాత తాపీగా అన్నీ చేసుకుని వచ్చే వేసవిలో విడుదల చేయవచ్చని పవన్ డిసైడ్ అయ్యాడు. అలాగే చిరంజీవి కూడా ఆచార్య సినిమా వచ్చే వేసవి చివర్లో విడుదలయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అప్పటికి కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టి, వాక్సిన్ కూడా వచ్చేస్తుందని, మళ్ళీ జనం మాములుగా సినిమాలకు వస్తారని భావిస్తున్నారు. అందుకే పెద్ద సినిమాలకు 2021 వేసవి బెస్ట్ టైం అని ట్రేడ్ లో కూడా చెప్పుకుంటున్నారు.
అదేంటో సమంతకు భలే కలిసి వస్తోంది. మా ఇంటి బంగారంకు తొలి రోజు బాగానే ఉందనే టాక్ వచ్చింది కానీ…
'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…
ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…
ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…
అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్డమ్ పరిస్థితి మాత్రం…