మెగా బ్రదర్స్ ఇద్దరూ కరోనా విజృంభిస్తున్న టైములో నో షూటింగ్ అంటూ ఫిక్స్ అయిపోయారు. చిరంజీవి గడ్డం, మీసాలు తీసేసి యంగ్ గా కనిపిస్తూ వుంటే, పవన్ గడ్డం, మీసాలు పెంచేసి మళ్ళీ ఎన్నికల అనంతరం లుక్ కి మారిపోయాడు. ఇదిలా వుంటే, ఈ ఏడాది చివరి వరకు షూటింగ్ కి ససేమీరా అని మెగా బ్రదర్స్ ఇద్దరూ తేల్చేయడంతో… సంక్రాంతికి వస్తుందని భావిస్తున్న వకీల్ సాబ్ ఇక అప్పుడు రాదని తేలిపోయింది.
తిరిగి షూటింగ్ మొదలు పెట్టిన తర్వాత తాపీగా అన్నీ చేసుకుని వచ్చే వేసవిలో విడుదల చేయవచ్చని పవన్ డిసైడ్ అయ్యాడు. అలాగే చిరంజీవి కూడా ఆచార్య సినిమా వచ్చే వేసవి చివర్లో విడుదలయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అప్పటికి కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టి, వాక్సిన్ కూడా వచ్చేస్తుందని, మళ్ళీ జనం మాములుగా సినిమాలకు వస్తారని భావిస్తున్నారు. అందుకే పెద్ద సినిమాలకు 2021 వేసవి బెస్ట్ టైం అని ట్రేడ్ లో కూడా చెప్పుకుంటున్నారు.
This post was last modified on July 30, 2020 10:55 am
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…