మెగా బ్రదర్స్ ఇద్దరూ కరోనా విజృంభిస్తున్న టైములో నో షూటింగ్ అంటూ ఫిక్స్ అయిపోయారు. చిరంజీవి గడ్డం, మీసాలు తీసేసి యంగ్ గా కనిపిస్తూ వుంటే, పవన్ గడ్డం, మీసాలు పెంచేసి మళ్ళీ ఎన్నికల అనంతరం లుక్ కి మారిపోయాడు. ఇదిలా వుంటే, ఈ ఏడాది చివరి వరకు షూటింగ్ కి ససేమీరా అని మెగా బ్రదర్స్ ఇద్దరూ తేల్చేయడంతో… సంక్రాంతికి వస్తుందని భావిస్తున్న వకీల్ సాబ్ ఇక అప్పుడు రాదని తేలిపోయింది.
తిరిగి షూటింగ్ మొదలు పెట్టిన తర్వాత తాపీగా అన్నీ చేసుకుని వచ్చే వేసవిలో విడుదల చేయవచ్చని పవన్ డిసైడ్ అయ్యాడు. అలాగే చిరంజీవి కూడా ఆచార్య సినిమా వచ్చే వేసవి చివర్లో విడుదలయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అప్పటికి కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టి, వాక్సిన్ కూడా వచ్చేస్తుందని, మళ్ళీ జనం మాములుగా సినిమాలకు వస్తారని భావిస్తున్నారు. అందుకే పెద్ద సినిమాలకు 2021 వేసవి బెస్ట్ టైం అని ట్రేడ్ లో కూడా చెప్పుకుంటున్నారు.
This post was last modified on July 30, 2020 10:55 am
ప్రేక్షకులు చాల అడ్వాన్స్ ఉన్నారు, తెలివి మీరిపోయారనే సత్యాన్ని చాలా మంది దర్శక నిర్మాతలు గుర్తించడం లేదు. ఆ ఏముందిలే…
ఇండస్ట్రీలో వరుసగా ఫెయిల్యూర్లు ఇచ్చాక అవకాశాలు దక్కించుకోవడం అంత తేలికైన విషయం కాదు. కానీ కొందరు డైరెక్టర్లు మాత్రం తమ…
ఆదర్శ కుటుంబం టీజర్ వచ్చాక అందులో కంటెంట్ ఎలా ఉంటుందో ప్రేక్షకులకు ఐడియా వచ్చేసింది. అభిమానులు హ్యాపీగానే ఉన్నారు. వెంకీ…
ఫిలిం ఇండస్ట్రీలో చాలా ఏళ్ల పాటు నంబర్ స్థానానికి పోటీ పడ్డ ఇద్దరు టాప్ హీరోల మధ్య మంచి స్నేహం…
ఏంటో టాలీవుడ్ లో ఏదీ మాట మీద అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందన్న గ్యారెంటీ లేకుండా పోతోంది. వాయిదాల పర్వంలో నలిగిపోతున్న…
ఏపీ సీఎం చంద్రబాబు గతానికి భిన్నంగా ఏపీలో పాలన సాగిస్తున్నారు. గతంలో ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో…