మహేష్ బాబు త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమాకు అమరావతికి అటు ఇటు టైటిల్ ఫిక్స్ చేసినట్టుగా వచ్చిన లీక్ ఫ్యాన్స్ ని ఊపేస్తోంది. గురూజీ తన రెగ్యులర్ సెంటిమెంట్ ని విడిచిపెట్టకుండా అ అక్షరంతో మొదలయ్యేలా మళ్ళీ జాగ్రత్త పడ్డారని అర్థమవుతోంది. అఫీషియల్ గా ప్రకటించలేదు కానీ దాదాపుగా ఖరారు చేసినట్టుగా వినికిడి. అయితే ఈ పేరు వెనుక ఆసక్తికరమైన నేపథ్యం ఉందట. గుంటూరు బ్యాక్ డ్రాప్ గా అమరావతికి చెరో వైపున హీరోకు సంబంధం ఉన్న ఊళ్ళలో ఉండే రెండు కుటుంబాల కథగా దీన్ని తీర్చిదిద్దినట్టు వినికిడి .
ఆ ఫ్యామిలీస్ మధ్య ఉన్న వైరాన్ని తీర్చడంతో పాటు ఒక ప్రత్యేకమైన సంకల్పంతో అక్కడికి వచ్చిన మహేష్ ఏమేం చేశాడన్నదే చిత్ర కథగా చెబుతున్నారు. లైన్ పరంగా చూసుకుంటే కొత్తదనం లేదు కానీ త్రివిక్రమ్ మార్కు ఎంటర్ టైన్మెంట్ పుష్కలంగా దట్టించడంతో పాటు అతడు స్టైల్ యాక్షన్ ఎపిసోడ్స్ కూడా బలంగా ఉంటాయట. కాకపోతే నగర నేపథ్యం ఎక్కువగా ఉండదు కాబట్టి విలేజ్ లోనే కావాల్సినంత వినోదాన్ని సెట్ చేసినట్టుగా తెలిసింది. అయితే ఏపీలో నలుగుతున్న రాజధాని వివాదానికి దీనికి ఎలాంటి సంబంధం లేదనేది వాస్తవం.
విడుదల తేదీ ఖరారు చేసే పని ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఆగస్ట్ 11న రావడం అనుమానమే. 2024 సంక్రాంతికి వెళ్లడం ఖాయమనే సంకేతాలు వస్తన్నాయి. ఒకవేళ ప్రభాస్ ప్రాజెక్ట్ కె, రామ్ చరణ్ సీఈఓ, బన్నీ పుష్ప 2లు వచ్చినా రాకపోయినా జనవరి 12న అమరావతికి అటుఇటుని దించాలని నిర్మాత నాగ వంశీ ఆలోచిస్తున్నట్టుగా టాక్ ఉంది. ఒకవేళ వద్దనుకుంటే మాత్రం ఈ ఏడాది దసరా లేదా దీపావళిని లక్ష్యంగా పెట్టుకోవాలి. ఇంతకన్నా ఆప్షన్లు లేవు. అల వైకుంఠపురములో తరహాలో హీరో మీద కాకుండా టైటిల్ ని సబ్జెక్టు మీద పెట్టడంలో త్రివిక్రమ్ మరోసారి తన మార్కు చూపించారు.
This post was last modified on March 25, 2023 2:29 pm
లోకనాయకుడు కమల్ హాసన్ పనైపోయిందనుకున్న సమయంలో ఆయన అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చిన సినిమా.. విక్రమ్. ఆ సినిమాతోనే సౌత్…
తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిధి స్టాలిన్ను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నటి త్రిష,…
గుజరాత్లో చాందిపుర వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే 22 మంది చిన్నారులు మృతిచెందినట్లు రాష్ట్ర…
సినీ అభిమానులందు తెలుగు అభిమానులు వేరు అని ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే. తమ సినిమాలను ప్రమోట్ చేయడం కోసం తెలుగు రాష్ట్రాలకు…
మలయాళం సూపర్ స్టార్ గా పేరొందిన మోహన్ లాల్ కూతురు విస్మయ ఈ శుక్రవారం విడుదల కాబోతున్న తుదక్కంతో తెరంగేట్రం…
బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…