ఈ రోజుల్లో ప్రమోషన్లు సినిమా సెట్స్ మీదికి వెళ్లడానికి ముందు నుంచే మొదలవుతున్నాయి. సందర్భాన్ని బట్టి ఏదో ఒక అప్డేట్ ఇస్తూ.. పోస్టర్, టీజర్ లాంటివి రిలీజ్ చేస్తూ అభిమానులు ఎంగేజ్ చేస్తుంటారు. సోషల్ మీడియా వేదికగా జరిగే ప్రమోషన్లలో హీరోయిన్లకు కూడా మంచి ప్రాధాన్యమే దక్కుతుంటుంది. వాళ్ల పుట్టిన రోజులు, ఇంకేదైనా ప్రత్యేక సందర్భాలు చూసుకుని స్పెషల్ పోస్టర్లు, టీజర్లు వదులుతుంటారు.
ఐతే ప్రమోషన్లలో తనకు ప్రయారిటీ ఇవ్వలేదని ఒక స్టార్ ఇమేజ్ ఉన్న హీరోయిన్ ట్విట్టర్లో ఓపెన్గా తన అసంతృప్తిని వ్యక్తం చేయడం అన్నది ఇంతకుముందెప్పుడూ చూసి ఉండమేమో. కానీ భీమ్లా నాయక్, బింబిసార, సార్.. ఇలా తెలుగులో వరుస హిట్లతో దూసుకెళ్తున్న మలయాళ భామ సంయుక్త మీనన్ ఉగాది సందర్భంగా తన పోస్టర్ రిలీజ్ చేయలేదని ట్విట్టర్లో తన అసంతృప్తిని వెళ్లగక్కడం గమనార్హం.
సంయుక్త.. సాయిధరమ్ తేజ్ సరసన విరూపాక్ష సినిమాలో నటించింది. ఐతే ఇప్పటిదాకా రిలీజ్ చేసిన ప్రోమోల్లో ఆమెకు ప్రాధాన్యం దక్కలేదు. పండుగ సందర్భంగా బుధవారం తన పోస్టర్ రిలీజ్ చేస్తారని హామీ ఇచ్చి.. ఆ మాటను నిలబెట్టుకోలేదంటూ నిర్మాణ సంస్థ ఎస్వీసీసీని ట్యాగ్ చేస్తూ ట్వీట్ వేయడం చర్చనీయాంశమైంది. ఐతే ఈ విషయం చెప్పడానికి ముందు ఈ సినిమా కోసం పని చేయడం చాలా సంతోషమని పేర్కొంటూ నిర్మాణ సంస్థను కూడా కొనియాడింది. కానీ తన పోస్టర్ రిలీజ్ చేయకపోవడాన్ని మాత్రం తప్పుబట్టింది.
ఐతే వెంటనే ఎస్వీసీసీ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఈ ట్వీట్కు స్పందన వచ్చింది. సాంకేతిక కారణాల వల్ల పోస్టర్ రిలీజ్ చేయలేదని.. త్వరలో సమస్య పరిష్కారమవుతుందని పేర్కొన్నారు. ఐతే ఇదేమైనా పబ్లిసిటీ గిమ్మిక్కా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on March 23, 2023 7:30 am
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…