ఇంకొద్ది గంటల్లో దాస్ కా ధమ్కీ థియేటర్లలో అడుగు పెట్టనుంది. సహజంగానే ఎనర్జీతో పరుగులు పెట్టే విశ్వక్ సేన్ ఇప్పుడు తన స్వీయ దర్శకత్వంలో స్వంత బ్యానర్ లో నిర్మించిన సినిమా కావడంతో ప్రతి మాటలోనూ చాలా కాన్ఫిడెన్స్ చూపిస్తున్నాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ తో మొదలుపెట్టి సెకండ్ హాఫ్ మొత్తం ఊపిరి సలపలేరని ఇప్పటిదాకా ఎవరూ ఇవ్వని ఎక్స్ పీరియన్స్ కలగజేస్తానని హామీ ఇస్తున్నాడు. ఏ ఇంటర్వ్యూ చూసినా ఎలివేషన్లు మాత్రం ఓ రేంజ్ లో ఉంటున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ భీభత్సంగా లేకపోయినా టాక్ తో పికప్ అవుతుందనే నమ్మకం టీమ్ లో ఉంది.
దాస్ కా ధమ్కీ థియేట్రికల్ టార్గెట్ చిన్నదేమీ కాదు. ఏడున్నర కోట్ల దాకా బిజినెస్ జరిగిందట. అంటే షేర్ ఎనిమిది కోట్లు వస్తే హిట్టు ముద్ర వేయొచ్చు. సానుకూలాంశం ఏంటంటే రేపు పెద్దగా పోటీ లేదు. రంగమార్తాండ మీద ఎంత ప్రీ పాజిటివ్ టాక్ ఉన్నా అది మాస్ ని లక్ష్యంగా చేసుకోలేదు. ఆ మాటకొస్తే ఆ వర్గానికి నచ్చే అవకాశాలూ తక్కువే. అది ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ గా పెట్టుకుంది. కానీ ధమ్కీకి యూత్ సపోర్ట్ ని ఆశించొచ్చు. అయితే ఇది కూడా మూవీ బాగుందనే ప్రచారం వస్తేనే దక్కుతుంది కానీ మార్నింగ్ షోలన్నీ హౌస్ ఫుల్స్ తో మొదలవ్వవు.
ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కావాల్సినన్ని స్క్రీన్లు దక్కించుకున్న ధమ్కీకి నాని దసరా వచ్చే దాకా నాన్ స్టాప్ బ్యాటింగ్ ఉంటుంది. వీలైనన్ని వసూళ్లు రాబట్టుకుంటే ఈజీగా బ్రేక్ ఈవెన్ అందుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏడు రోజులకు ఎనిమిది కోట్లు పెద్ద మ్యాటర్ కాదు. బలగం లాంటి ఎమోషనల్ మూవీనే అంత గొప్పగా రాబట్టగలిగినప్పుడు ధమ్కీకి అదేమీ కష్టం కాదు. ఓరి దేవుడా టైపులో పర్వాలేదనిపించుకుంటే సరిపోదు. అదిరిపోయిందనే అనిపించాలి. ఏ మాత్రం తగ్గినా సవాళ్లు ఎదురవుతాయి. మరి దాస్ ధమ్కీ ఇస్తాడో తీసుకుంటాడో రేపీపాటికి తేలిపోతుంది.
This post was last modified on March 21, 2023 3:27 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…