ఒకప్పుడు తాము చిన్న తెరల్ని అడ్డుపెట్టుకుని.. చెట్ల వెనక్కి వెళ్లి బట్టలు మార్చుకునేవాళ్లమని.. అప్పట్లో ఏ వసతులూ ఉండేవి కావని ముందు తరం నటీనటులు ఇంటర్వ్యూల్లో చెప్పుకుంటూ ఉంటారు. ఐతే ఈ రోజుల్లో ఆర్టిస్టులకు అలాంటి సమస్య లేదు. ఓ మోస్తరు స్థాయి ఉన్న వాళ్లందరికీ కారవాన్లు ఇచ్చేస్తున్నారు. అవి కాకపోయినా బట్టలు మార్చుకోవడానికి.. కాలకృత్యాలు తీర్చుకోవడానికి అందుబాటులో వసతులు ఉండేలా చూసుకుంటున్నారు. ఇలాంటి రోజుల్లోనే కంగనా రనౌత్ లాంటి స్టార్ హీరోయిన్ తాను బండ రాళ్ల మధ్యన కాలకృత్యాలు తీర్చుకున్నట్లు చెప్పడం గమనార్హం.
“గతంలో నేను రంగూన్ అనే సినిమాలో నటించా. ఆ సినిమా చిత్రీకరణ అరుణాచల్ ప్రదేశ్లోని మారుమూల ప్రాంతంలో జరిగింది. అక్కడ రెస్టారెంట్లు, రెస్ట్ రూంలు లేవు. దీంతో పెద్ద పెద్ద రాళ్ల వెనక్కి వెళ్లి యూనిట్ సభ్యులు కాలకృత్యాలు తీర్చుకోవాల్సి వచ్చింది. నేను ఆ చిత్రంలో కథానాయికగా నటించినప్పటికీ నాక్కూడా ఇలా చేయక తప్పలేదు. అప్పట్లో నాకు ఇలాంటి ఇబ్బందులు చాలానే ఎదురయ్యాయి. అందుకే తర్వాతి కాలంలో నేనొక లగ్జరీ వ్యానిటీ వ్యాన్ కొనుగోలు చేశా” అని కంగనా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.
ఇదిలా ఉండగా.. ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ పెట్టిన ఓ ట్వీట్ మీద స్పందిస్తూ కంగనా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనంత నాటకీయ జీవితం ఎవరికీ ఉండదని.. ఓ ప్రేమ వ్యవహారం కారణంగా మొత్తం సినిమా మాఫియా అంతా కలిసి తనను జైలుకు పంపించడానికి ప్రయత్నించిందని పరోక్షంగా హృతిక్ రోషన్ అండ్ కో మీద ఆరోపణలు చేసింది కంగనా.
This post was last modified on March 20, 2023 11:05 pm
ఎన్నికలు అయిపోయాయి. ఫలితాలు ఇంకో పద్దెనిమిది రోజుల్లో రాబోతున్నాయి. ఎవరికి వారు విజయం పట్ల ధీమాగా ఉన్నారు. అధికార పార్టీ,…
మొన్నటిదాకా టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా అత్యధిక డిమాండ్ అనుభవించిన పూజా హెగ్డే కెరీర్ ప్రారంభంలో వచ్చిన ఐరన్ లెగ్…
ప్రకాశం జిల్లాలో ఆమంచి కృష్ణమోహన్ రాజకీయంగా ఒక బలమైన నాయకుడే అని చెప్పాలి. అయితే తన రాజకీయ భవిష్యత్తు కోసం…
తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత రెండు ప్రమాదాలు తప్పించుకుని మూడో ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. నెలల వ్యవధిలో…
ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ 2003లో జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో 681 చదరపు గజాల స్థలం సుంకు గీత అనే…
ఒక్క చిన్న ఇన్స్ టా పోస్ట్ తో ప్రభాస్ సోషల్ మీడియాని ఊపేస్తున్నాడు. హలో డార్లింగ్స్ చివరికి చాలా ప్రత్యేకం…