ఒకప్పుడు తాము చిన్న తెరల్ని అడ్డుపెట్టుకుని.. చెట్ల వెనక్కి వెళ్లి బట్టలు మార్చుకునేవాళ్లమని.. అప్పట్లో ఏ వసతులూ ఉండేవి కావని ముందు తరం నటీనటులు ఇంటర్వ్యూల్లో చెప్పుకుంటూ ఉంటారు. ఐతే ఈ రోజుల్లో ఆర్టిస్టులకు అలాంటి సమస్య లేదు. ఓ మోస్తరు స్థాయి ఉన్న వాళ్లందరికీ కారవాన్లు ఇచ్చేస్తున్నారు. అవి కాకపోయినా బట్టలు మార్చుకోవడానికి.. కాలకృత్యాలు తీర్చుకోవడానికి అందుబాటులో వసతులు ఉండేలా చూసుకుంటున్నారు. ఇలాంటి రోజుల్లోనే కంగనా రనౌత్ లాంటి స్టార్ హీరోయిన్ తాను బండ రాళ్ల మధ్యన కాలకృత్యాలు తీర్చుకున్నట్లు చెప్పడం గమనార్హం.
“గతంలో నేను రంగూన్ అనే సినిమాలో నటించా. ఆ సినిమా చిత్రీకరణ అరుణాచల్ ప్రదేశ్లోని మారుమూల ప్రాంతంలో జరిగింది. అక్కడ రెస్టారెంట్లు, రెస్ట్ రూంలు లేవు. దీంతో పెద్ద పెద్ద రాళ్ల వెనక్కి వెళ్లి యూనిట్ సభ్యులు కాలకృత్యాలు తీర్చుకోవాల్సి వచ్చింది. నేను ఆ చిత్రంలో కథానాయికగా నటించినప్పటికీ నాక్కూడా ఇలా చేయక తప్పలేదు. అప్పట్లో నాకు ఇలాంటి ఇబ్బందులు చాలానే ఎదురయ్యాయి. అందుకే తర్వాతి కాలంలో నేనొక లగ్జరీ వ్యానిటీ వ్యాన్ కొనుగోలు చేశా” అని కంగనా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.
ఇదిలా ఉండగా.. ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ పెట్టిన ఓ ట్వీట్ మీద స్పందిస్తూ కంగనా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనంత నాటకీయ జీవితం ఎవరికీ ఉండదని.. ఓ ప్రేమ వ్యవహారం కారణంగా మొత్తం సినిమా మాఫియా అంతా కలిసి తనను జైలుకు పంపించడానికి ప్రయత్నించిందని పరోక్షంగా హృతిక్ రోషన్ అండ్ కో మీద ఆరోపణలు చేసింది కంగనా.
టాలీవుడ్ అగ్ర నిర్మాత సి అశ్వినీదత్ ఇవాళ ఎమోషనల్ అయ్యారు. సింగ్ గీతం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ…
జెన్ జీ యుగంలో యువత ఎక్కడికి పోతోందో?… ఏమేం చేస్తుందోనన్న విషయాలపై అంతు చిక్కడం లేదని చెప్పాలి. ఏదో ఒక…
లోక నాయకుడు కమల్ హాసన్ చాలా సందర్భాల్లో ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. భవిషత్తుని కూడా చక్కగా అంచనా వేస్తారు. విశ్వరూపం…
హఠాత్తుగా ఇరుముడి విడుదల తేదీ ప్రకటించేశారు. ఆగస్ట్ 21 థియేటర్లలో అడుగు పెట్టబోతున్నట్టు మైత్రి మూవీ మేకర్స్ అఫీషియల్ గా…
సోషల్ మీడియా టాక్స్, యూట్యూబ్ రివ్యూల హడావిడి ఎలా ఉన్నా పెద్ది బలంగా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న వైనం స్పష్టం.…
ఉమ్మడి కృష్ణాజిల్లాలోని కీలకమైన నియోజకవర్గం గుడివాడ రాజకీయాలు వేడెక్కాయి. గత రెండేళ్ల పాల నలో తాను చేసిన అభివృద్ధిని చూపించేందుకు..…