ఒకప్పుడు తాము చిన్న తెరల్ని అడ్డుపెట్టుకుని.. చెట్ల వెనక్కి వెళ్లి బట్టలు మార్చుకునేవాళ్లమని.. అప్పట్లో ఏ వసతులూ ఉండేవి కావని ముందు తరం నటీనటులు ఇంటర్వ్యూల్లో చెప్పుకుంటూ ఉంటారు. ఐతే ఈ రోజుల్లో ఆర్టిస్టులకు అలాంటి సమస్య లేదు. ఓ మోస్తరు స్థాయి ఉన్న వాళ్లందరికీ కారవాన్లు ఇచ్చేస్తున్నారు. అవి కాకపోయినా బట్టలు మార్చుకోవడానికి.. కాలకృత్యాలు తీర్చుకోవడానికి అందుబాటులో వసతులు ఉండేలా చూసుకుంటున్నారు. ఇలాంటి రోజుల్లోనే కంగనా రనౌత్ లాంటి స్టార్ హీరోయిన్ తాను బండ రాళ్ల మధ్యన కాలకృత్యాలు తీర్చుకున్నట్లు చెప్పడం గమనార్హం.
“గతంలో నేను రంగూన్ అనే సినిమాలో నటించా. ఆ సినిమా చిత్రీకరణ అరుణాచల్ ప్రదేశ్లోని మారుమూల ప్రాంతంలో జరిగింది. అక్కడ రెస్టారెంట్లు, రెస్ట్ రూంలు లేవు. దీంతో పెద్ద పెద్ద రాళ్ల వెనక్కి వెళ్లి యూనిట్ సభ్యులు కాలకృత్యాలు తీర్చుకోవాల్సి వచ్చింది. నేను ఆ చిత్రంలో కథానాయికగా నటించినప్పటికీ నాక్కూడా ఇలా చేయక తప్పలేదు. అప్పట్లో నాకు ఇలాంటి ఇబ్బందులు చాలానే ఎదురయ్యాయి. అందుకే తర్వాతి కాలంలో నేనొక లగ్జరీ వ్యానిటీ వ్యాన్ కొనుగోలు చేశా” అని కంగనా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.
ఇదిలా ఉండగా.. ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ పెట్టిన ఓ ట్వీట్ మీద స్పందిస్తూ కంగనా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనంత నాటకీయ జీవితం ఎవరికీ ఉండదని.. ఓ ప్రేమ వ్యవహారం కారణంగా మొత్తం సినిమా మాఫియా అంతా కలిసి తనను జైలుకు పంపించడానికి ప్రయత్నించిందని పరోక్షంగా హృతిక్ రోషన్ అండ్ కో మీద ఆరోపణలు చేసింది కంగనా.
This post was last modified on March 20, 2023 11:05 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…