నందమూరి కుటుంబంలో నెల కిందట పెద్ద విషాదమే చోటు చేసుకుంది. నటుడు తారకరత్న గుండెపోటుకు గురై.. మూడు వారాల పాటు మృత్యువుతో పోరాడి చివరికి తనువు చాలించాడు. తారకరత్న గుండెపోటుకు గురైనపుడు ఆయన బాబాయి బాలకృష్ణ తన వెంటే ఆసుపత్రికి చేరుకుని కొన్ని రోజుల పాటు తన అన్న కొడుకును కనిపెట్టుకుని ఉంటూ, చికిత్సను పర్యవేక్షించడం ప్రశంసలు అందుకుంది.
తారకరత్న మరణించినపుడు, అంత్యక్రియలు, ఆ తర్వాత జరిగిన నివాళి కార్యక్రమాల్లో అన్నీ తానై వ్యవహరించాడు. తారకరత్న కుటుంబ బాధ్యత తనదే అని ఇప్పటికే బాలయ్య ప్రకటించాడు కూడా. ఇప్పుడు తారకరత్న పేరు నిలిచిపోయేలా.. ఒక గొప్ప పనికి బాలయ్య శ్రీకారం చుట్టినట్లు సమాచారం.
తాను హిందూపురంలో నిర్మించిన ఆసుపత్రిలో కోటి 30 లక్షల రూపాయల ఖర్చుతో ఒక కొత్త విభాగాన్ని ఏర్పాటు చేయబోతున్నాడట బాలయ్య. తారకరత్న గుండెపోటుతో చనిపోయిన నేపథ్యంలో అధునాత గుండె శస్త్రచికిత్సల కోసం ఈ విభాగం ఏర్పాటు కానుందట. హిందూపురం వాసులు గుండె జబ్బులు విషమించినపుడు బెంగళూరుకో, హైదరాబాద్కో వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడ సర్జరీలు చేయించుకునేలా అధునాతన టెక్నాలజీతో ఈ విభాగాన్ని తీర్చిదిద్దనున్నారట. ఈ విభాగానికి తారకరత్న పేరునే పెడుతున్నాడట బాలయ్య. ఇప్పటికే ఈ విభాగానికి సంబంధించి శస్త్రచికిత్స పరికరాలను కూడా తెప్పించాడట బాలయ్య.
ఈ నందమూరి హీరో చేసిన పనిపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇప్పటికే బాలయ్య హైదరాబాద్లో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని విజయవంతంగా నడిపిస్తూ ఎంతో మంది అభాగ్యుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న సంగతి తెలిసిందే.
This post was last modified on March 20, 2023 10:50 pm
టిడిపిలోనే కొందరు నాయకులకు మెజారిటీ సమస్య ఇప్పుడు కొంత గడబిడగా మారింది. గత ఎన్నికల సమయంలో భారీ స్థాయి మెజారిటీతో…
ఇటీవలే శ్వాసనాళానికి సంబంధించిన శస్త్ర చికిత్స చేయించుకున్న ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్రమంగా కోలుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్…
ఎవరు ఔనన్నా కాదన్నా టాలీవుడ్ రెండు వర్గాలుగా విడిపోయింది. ఎగ్జిబిటర్లు ప్లస్ వాళ్లలోనే ఉన్న నిర్మాతలు, ప్రొడ్యూసర్లు ప్లస్ వాళ్లలోనే…
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)కు నిజంగానే ఉచ్చు బిగుస్తోందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.…
జైలు.. ఈ మాట వినగానే సామాన్యులకు వామ్మో అనిపిస్తుంది. అక్కడి పరిస్థితుల గురించి అనుభవం ఉన్న వాళ్లు చెబుతుంటే.. సినిమాల్లో…
ఏపీలో ప్రదాన ప్రతిపక్ష హోదానూ దక్కించుకోలేకపోయిన వైసీపీ… తన పునరాగమనానికి భారీ కసరత్తే చేస్తోంది. అందులో భాగంగా ఏ చిన్న…