నందమూరి కుటుంబంలో నెల కిందట పెద్ద విషాదమే చోటు చేసుకుంది. నటుడు తారకరత్న గుండెపోటుకు గురై.. మూడు వారాల పాటు మృత్యువుతో పోరాడి చివరికి తనువు చాలించాడు. తారకరత్న గుండెపోటుకు గురైనపుడు ఆయన బాబాయి బాలకృష్ణ తన వెంటే ఆసుపత్రికి చేరుకుని కొన్ని రోజుల పాటు తన అన్న కొడుకును కనిపెట్టుకుని ఉంటూ, చికిత్సను పర్యవేక్షించడం ప్రశంసలు అందుకుంది.
తారకరత్న మరణించినపుడు, అంత్యక్రియలు, ఆ తర్వాత జరిగిన నివాళి కార్యక్రమాల్లో అన్నీ తానై వ్యవహరించాడు. తారకరత్న కుటుంబ బాధ్యత తనదే అని ఇప్పటికే బాలయ్య ప్రకటించాడు కూడా. ఇప్పుడు తారకరత్న పేరు నిలిచిపోయేలా.. ఒక గొప్ప పనికి బాలయ్య శ్రీకారం చుట్టినట్లు సమాచారం.
తాను హిందూపురంలో నిర్మించిన ఆసుపత్రిలో కోటి 30 లక్షల రూపాయల ఖర్చుతో ఒక కొత్త విభాగాన్ని ఏర్పాటు చేయబోతున్నాడట బాలయ్య. తారకరత్న గుండెపోటుతో చనిపోయిన నేపథ్యంలో అధునాత గుండె శస్త్రచికిత్సల కోసం ఈ విభాగం ఏర్పాటు కానుందట. హిందూపురం వాసులు గుండె జబ్బులు విషమించినపుడు బెంగళూరుకో, హైదరాబాద్కో వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడ సర్జరీలు చేయించుకునేలా అధునాతన టెక్నాలజీతో ఈ విభాగాన్ని తీర్చిదిద్దనున్నారట. ఈ విభాగానికి తారకరత్న పేరునే పెడుతున్నాడట బాలయ్య. ఇప్పటికే ఈ విభాగానికి సంబంధించి శస్త్రచికిత్స పరికరాలను కూడా తెప్పించాడట బాలయ్య.
ఈ నందమూరి హీరో చేసిన పనిపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇప్పటికే బాలయ్య హైదరాబాద్లో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని విజయవంతంగా నడిపిస్తూ ఎంతో మంది అభాగ్యుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న సంగతి తెలిసిందే.
This post was last modified on March 20, 2023 10:50 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…