Movie News

తార‌క‌ర‌త్న పేరు నిలిచిపోయేలా బాల‌య్య‌…


నంద‌మూరి కుటుంబంలో నెల కింద‌ట పెద్ద విషాద‌మే చోటు చేసుకుంది. న‌టుడు తార‌క‌ర‌త్న గుండెపోటుకు గురై.. మూడు వారాల పాటు మృత్యువుతో పోరాడి చివ‌రికి త‌నువు చాలించాడు. తార‌క‌ర‌త్న గుండెపోటుకు గురైన‌పుడు ఆయ‌న బాబాయి బాల‌కృష్ణ త‌న వెంటే ఆసుప‌త్రికి చేరుకుని కొన్ని రోజుల పాటు త‌న అన్న కొడుకును కనిపెట్టుకుని ఉంటూ, చికిత్స‌ను ప‌ర్య‌వేక్షించడం ప్రశంస‌లు అందుకుంది.

తార‌క‌ర‌త్న మ‌ర‌ణించిన‌పుడు, అంత్య‌క్రియ‌లు, ఆ త‌ర్వాత జ‌రిగిన నివాళి కార్య‌క్ర‌మాల్లో అన్నీ తానై వ్య‌వ‌హ‌రించాడు. తార‌క‌ర‌త్న కుటుంబ బాధ్య‌త త‌నదే అని ఇప్ప‌టికే బాల‌య్య ప్ర‌క‌టించాడు కూడా. ఇప్పుడు తార‌క‌ర‌త్న పేరు నిలిచిపోయేలా.. ఒక గొప్ప ప‌నికి బాల‌య్య శ్రీకారం చుట్టిన‌ట్లు స‌మాచారం.

తాను హిందూపురంలో నిర్మించిన ఆసుప‌త్రిలో కోటి 30 ల‌క్ష‌ల‌ రూపాయ‌ల ఖ‌ర్చుతో ఒక కొత్త విభాగాన్ని ఏర్పాటు చేయ‌బోతున్నాడ‌ట బాల‌య్య‌. తార‌క‌ర‌త్న గుండెపోటుతో చ‌నిపోయిన నేప‌థ్యంలో అధునాత‌ గుండె శ‌స్త్ర‌చికిత్స‌ల కోసం ఈ విభాగం ఏర్పాటు కానుంద‌ట‌. హిందూపురం వాసులు గుండె జ‌బ్బులు విష‌మించిన‌పుడు బెంగ‌ళూరుకో, హైద‌రాబాద్‌కో వెళ్లాల్సిన అవ‌స‌రం లేకుండా ఇక్క‌డ స‌ర్జ‌రీలు చేయించుకునేలా అధునాత‌న టెక్నాల‌జీతో ఈ విభాగాన్ని తీర్చిదిద్ద‌నున్నార‌ట‌. ఈ విభాగానికి తార‌క‌ర‌త్న పేరునే పెడుతున్నాడ‌ట బాల‌య్య‌. ఇప్ప‌టికే ఈ విభాగానికి సంబంధించి శ‌స్త్ర‌చికిత్స ప‌రిక‌రాల‌ను కూడా తెప్పించాడ‌ట బాల‌య్య‌.

ఈ నంద‌మూరి హీరో చేసిన ప‌నిపై సోష‌ల్ మీడియాలో ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది. ఇప్ప‌టికే బాల‌య్య హైద‌రాబాద్‌లో బ‌స‌వ‌తార‌కం క్యాన్స‌ర్ ఆసుప‌త్రిని విజ‌య‌వంతంగా న‌డిపిస్తూ ఎంతో మంది అభాగ్యుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న సంగతి తెలిసిందే.

This post was last modified on March 20, 2023 10:50 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

సేఫ్ గేమ్ ఆడుతున్న ఆర్ఆర్ఆర్ నిర్మాత

ఇండస్ట్రీలో సుదీర్ఘ అనుభవంతో ఎన్నో బ్లాక్ బస్టర్లు చూసిన డివివి దానయ్య సగటు మాములు ప్రేక్షకుడికి బాగా దగ్గరయ్యింది మాత్రం…

28 mins ago

మాజీ ప్ర‌ధాని మ‌న‌వ‌డి కోసం… బ్లూ కార్నర్ నోటీసు!

భార‌త దేశ చ‌రిత్ర‌లో ఇదోక అనూహ్య‌మైన.. అస‌హ్యించుకునే ఘ‌ట‌న‌. ఈ దేశాన్ని పాలించి, రైతుల మ‌న్న‌న‌లు, మ‌హిళ‌ల మ‌న్న‌న‌లు పొందిన…

30 mins ago

జ‌గ‌న్.. నీరో : జేడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఏపీ సీఎం జ‌గ‌న్‌.. నీరో చ‌క్ర‌వ‌ర్తిని త‌ల‌పిస్తున్నారంటూ.. సీబీఐ మాజీ డైరెక్ట‌ర్ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ సంచ ల‌న వ్యాఖ్య‌లు చేశారు.…

2 hours ago

ఐపీఎల్ ప్లే ఆఫ్స్ లో ఆర్సీబీ..కప్ కొడతారా?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో అత్యంత దురదృష్టకరమైన జట్టు పేరు చెప్పమని అడిగితే…ఠపీమని ఆర్సీబీ పేరు చెప్పేస్తారు క్రికెట్…

2 hours ago

సతీసమేతంగా అమెరికాకు చంద్రబాబు

ఏపీలో ఎన్నికల పోరు ముగియడంతో ప్రధాన పార్టీలకు చెందిన కీలక నేతలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. తమ కుటుంబ సభ్యులు,…

3 hours ago

పుష్ప 2 పోటీ – తగ్గనంటున్న శివన్న

ఇంకో మూడు నెలల్లో ఆగస్ట్ 15 విడుదల కాబోతున్న పుష్ప 2 ది రైజ్ విడుదల తేదీలో ఎలాంటి మార్పు…

3 hours ago