ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న వాటిలో మోస్ట్ అవైటెడ్ అనదగ్గ చిత్రాల్లో పుష్ప-2 ఒకటి. ఏడాదిన్నర కిందట విడుదలైన ‘పుష్ప’ తెలుగుతో పాటు వివిధ భాషల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా హిందీ మార్కెట్లో ఈ సినిమా ఇరగాడేసింది. ఈ సినిమాలో బన్నీ మేనరిజమ్స్.. పాటలు అంతర్జాతీయ స్థాయిలో పాపులర్ అయ్యాయి. దీంతో ‘పుష్ప-2’ మీద అంచనాలు మామూలుగా లేవు. కొన్ని నెలల కిందటే ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లింది. దాదాపు 20 శాతం చిత్రీకరణ పూర్తయినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం షూట్ ఆపి.. ‘పుష్ప-2’ ఫస్ట్ గ్లింప్స్ మీద వర్క్ చేస్తోందట చిత్ర బృందం. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ గ్లింప్స్ రిలీజ్ చేయబోతోంది టీం. ప్రస్తుతం సుకుమార్ షూటింగ్కు బ్రేక్ ఇచ్చి మరీ టీజర్ మీద వర్క్ చేస్తున్నాడు. బన్నీ డబ్బింగ్ చెబుతున్నట్లు సమాచారం.
విశ్వసనీయ సమాచారం ప్రకారం ‘పుష్ప-2’ షూటింగ్ ఆరంభ దశలో ఉండగానే.. ఒక వెరైటీ కాన్సెప్ట్తో టీజర్ షూట్ చేశాడట సుకుమార్. ప్రేక్షకుల అంచనాలకు భిన్నంగా ఈ టీజర్ ఉంటుందని సమాచారం. దీంతో పాటు బన్నీని ఒక సంచలన అవతారంలో చూపిస్తూ ఫొటో షూట్ కూడా చేసింది టీం. ఆ లుక్ మైండ్ బ్లోయింగ్గా ఉంటుందని సమాచారం. ఐతే దీన్ని ఫస్ట్ లుక్గా రిలీజ్ చేయాలా.. లేక ఇంకొన్ని నెలలు అట్టిపెట్టి రిలీజ్ టైంలో రిలీజ్ చేయాలా అని సుకుమార్ తర్జన భర్జన పడుతున్నట్లు తెలిసింది.
టీజర్, ఫస్ట్ లుక్ రెండూ రిలీజ్ చేస్తే మాత్రం బన్నీ అభిమానులకు పండగే. బన్నీ పుట్టిన రోజుకు ఒక రోజు ముందు వీటిని రిలీజ్ చేసే అవకాశముంది. ఒక రెండ్రోజులు ఇండియన్ సినిమాలో ఇది తప్ప వేరే టాపిక్ ఉండని విధంగా సెన్సేషనల్గా టీజర్, ఫస్ట్ లుక్ రెడీ చేస్తున్నాడట సుకుమార్. ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రావచ్చని అంచనా.
This post was last modified on March 20, 2023 12:05 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…