Movie News

మెగా రూమర్స్ మీద స్పందించేదెవరు

మెగా బ్రదర్ నాగ బాబు తనయ నీహారికకు తన భర్త చైతన్యతో ఏవో అభిప్రాయభేదాలు వచ్చాయనే వార్త సోషల్ మీడియాని ఊపేస్తోంది. ఇన్స్ స్టాగ్రామ్ లో పరస్పరం ఒకరినొకరు తాము కలిసున్న ఫోటోలను డిలేట్ చేయడం, గత కొంత కాలంగా జోడిగా ఉన్న పిక్స్ ఏవీ పోస్ట్ చేయకపోవడం వీటికి ఊతమిస్తోంది. నీహారికకు పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థ ఉంది. హలో వరల్డ్ లాంటి వెబ్ సిరీస్ లు తీశారు. చైతన్య కూడా యాక్టివ్ గా ఆ వ్యవహారాల్లో పాలు పంచుకున్నాడు. గతంలో అతన్ని హీరోగా లాంచ్ చేసే ప్రయత్నం జరుగుతోందనే వార్తలు వచ్చాయి.

కట్ చేస్తే ఇప్పుడీ న్యూస్ గురించి మెగా ఫ్యామిలీ నుంచి ఎలాంటి స్పందన వస్తుందోనని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ సైతం కళ్యాణ్ దేవ్ తో బ్రేకప్ చేసుకుందన్న వార్త గట్టిగానే చక్కర్లు కొట్టింది. దానికి అఫీషియల్ గా ఎలాంటి క్లారిటీ రాలేదు కానీ అతను ఉన్నట్టుండి సైలెంట్ కావడం, కొత్త సినిమాలేవీ మొదలుకాకపోవడం వాటికి బలం చేకూర్చాయి. చిరంజీవితో సహా ఎవరూ దీని గురించి ఎక్కడా ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడ్డారు. ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉండే నాగబాబు నీహారిక ఇష్యూ గురించి ఏమైనా రెస్పాన్స్ ఇస్తారేమో చూడాలి.

ఇదేదో మెగా ఫ్యామిలీకి శాపంగా మారినట్టు ఉందని అభిమానులు కామెంట్స్ లో నిజం లేకపోలేదు. వరుణ్ తేజ్ త్వరలో పెళ్లి చేయాలని చూస్తున్న నాగబాబుకి ఇది ఇబ్బంది కలిగించే పరిణామమే. ఇది నిర్ధారణగా ఎవరూ చెప్పని విషయమే అయినా కనిపిస్తున్న వాస్తవాన్ని దాచలేరుగా. మూడేళ్ళ క్రితం 2020లో ఒక్కటైన ఈ జంట పెళ్లిని ఎంతో అట్టహాసంగా నిర్వహించారు. ఇంత తక్కువ గ్యాప్ లో అపార్థాలంటే ఆశ్చర్యమే. గత కొన్నేళ్లలో చైతు సమంతలు విడిపోవడం పెద్ద టాపిక్ అయ్యింది. నీహారిక జంటకు ఆ స్థాయి లేదు కానీ బ్యాక్ గ్రౌండ్ వల్ల చర్చకు దారి తీస్తోంది.

Satya

Recent Posts

పట్టు వదలకుండా పరిగెత్తాలి పెద్ది

పెద్ది మొదటి వారం పూర్తి చేసుకుని సెకండ్ వీక్ లో అడుగు పెట్టింది. మూడు వందల యాభై కోట్ల వైపు…

16 minutes ago

పవన్ పేరు ఎందుకు మారింది?

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…

6 hours ago

ఏపీ పాఠ‌శాల‌ల్లో చాగంటి పాఠ్యాంశాలు..!

ఏపీ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ప్ర‌ముఖ ప్ర‌వ‌చ క‌ర్త చాగంటి కోటేశ్వ‌ర‌రావు ప్ర‌సంగాల‌ను పాఠ్యాంశాలుగా ప్ర‌వేశ పెడుతున్నట్టు ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించి…

7 hours ago

జ‌న‌’సేన’ జాగ్ర‌త్త ప‌డాలా?

ఏపీలో కూటమిగా ఏర్పడిన టిడిపి, జనసేన, బిజెపిలు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో కూటమికి నేతృత్వం…

8 hours ago

మీనాక్షి ఇష్యూ కాంగ్రెస్ ను ‘హర్ట్’ చేసింది!

ఓ రాజకీయ పార్టీ తనను వేధించిన విషయంపై అలుపెరగని పోరాటం చేసి తీరుతుంది. అలా చేయకుంటే… అది రాజకీయ పార్టీ…

10 hours ago

మోదీ రికార్డును బద్దలుకొట్టడం కష్టమే!

భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశానికి అత్యధిక కాలం…

10 hours ago